India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రిమండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ నిర్మాత యుగంధర్ గౌడ్ తన సహచరులతో కలిసి దర్శించుకున్నారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుమన్ తేజ, గరీమ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా నిర్మించిన ‘సీతా కళ్యాణ వైభోగమే’ చిత్రం శుక్రవారం విడుదల కానుందని, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు.

గుర్ల మండలం నడుపూరు గ్రామానికి చెందిన కర్రోతు కళావతి పాము కాటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కళావతి పశువుల కోసం గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది. అక్కడ గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. దీంతో స్థానికులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మార్గంమధ్యలోనే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు టీడీపీ నాయకులు తొలగించాలని వైస్ ఛాన్సలర్కు వినతిపత్రం అందించడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ యోగివేమన విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడని, దాదాపు 16 ఏళ్ల నుంచి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించబడి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల ద్వారా విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు.

ప్రయాణికుల సౌలభ్యం కోసం విజయవాడ-గూడూరు విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12744 విజయవాడ-గూడూరు(జూన్ 20 నుండి 30వ తేదీ వరకు), నం.12743 గూడూరు-విజయవాడ(జూన్ 21 నుంచి జులై 1 వరకు) ట్రైన్లకు 3 సెకండ్ సిట్టింగ్ కోచ్లు(2S) అదనంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ ట్రైన్లకు ఆయా తేదీల్లో 3అదనపు కోచ్లు ఉంటాయన్నారు.

విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. కంచరపాలెం మెట్ట వద్ద విశాఖ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలన్నారు. డీసీపీ మేకా సత్తిబాబు మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

తాడేపల్లిలో వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, విజయానంద రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్పై మొదటి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండవ సంతకం చేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్పై తొలి సంతకం చేశానని తెలిపారు.

రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమించిన విషయం తెలిసిందే. అయితే తిరుమలరావు గుంటూరు వాసి కృష్ణ నగర్లోని మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి వరకు, ఆ తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఆయన కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్గా పని చేశారు. అనంతరం 1989లో ఆయన ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్.

కావలి జాతీయ రహదారిపై మద్దూరుపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి బైక్ ఢీ కొట్టింది. బైక్ లారీ కిందకి దూసుకెళ్లింది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.