Andhra Pradesh

News September 11, 2024

అనంత: విద్యార్థి హత్య కేసు ఛేదించిన పోలీసులు

image

ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.

News September 11, 2024

ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు

image

ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్‌ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.

News September 11, 2024

ఆ పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్

image

చిత్తూరు: పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ లోపు లక్ష్యాలు చేరుకోవాలన్నారు.

News September 11, 2024

గుంటూరు: ఏఏస్ఐలకు ప్రమోషన్

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

ఏలూరులో జాబ్ మేళా.. 77 మంది ఎంపిక

image

ఏలూరు ప్రభుత్వ డీఎల్ టీసీ, ఐటీఐ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు 224 మంది హాజరయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 77 మందిని అర్హులుగా గుర్తించి, వివిధ కంపెనీలలో ఉపాధి కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.ఉగాది రావు, జిల్లా ప్లేస్మెంట్ అధికారి(ఒకేషనల్) వరలక్ష్మి, వై.పి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

News September 11, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు వల్లూరు విద్యార్థినులు

image

వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

News September 11, 2024

నేడు దోర్నాలకు రానున్న కలెక్టర్

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

News September 11, 2024

వైద్య సేవలపై రోగులకు ఆరా తీసిన కలెక్టర్

image

అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్, రక్త నిధి కేంద్రం, ఐసీయూ తదితర విభాగాలను ఆయన కలియ తిరుగుతూ సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.

News September 11, 2024

పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వీఆర్వో పెంచల కిషోర్ సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

News September 11, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు సహకరించాలన్నారు.