Andhra Pradesh

News September 12, 2024

షర్మిలను కలిసిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు

image

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు ఇన్‌ఛార్జ్ పాలపర్తి విజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు షర్మిల సూచించారు.

News September 12, 2024

ప్రకాశం జిల్లా నేటి TOP NEWS

image

➤ దోర్నాల మండలంలో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్
➤ ఆసుపత్రిలో తల్లి మృతి.. బిడ్డను అమ్మేసిన తండ్రి
➤ కనిగిరి: రూ.66 వేలు పలికిన లడ్డూ
➤ కురిచేడు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
➤ కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లిక యత్నం
➤ గిద్దలూరు: గణేష్ లడ్డూ పాడిన ముస్లిం సోదరులు

News September 12, 2024

అనంతపురంలో క్రికెటర్ల ప్రాక్టీస్

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. హోటళ్ల నుంచి ప్రత్యేక బస్సుల్లో స్టేడియానికి చేరుకున్న ప్లేయర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. డీ టీమ్ కెప్టెన్ అయ్యర్ సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మిగిలిన ప్లేయర్లు క్యాచింగ్, బంతి త్రో, వ్యాయామం వంటివి చేశారు. ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. గురువారం నుంచి రౌండ్ 2 పోటీలు ప్రారంభం కానున్నాయి.

News September 11, 2024

SKLM: నది కాలువలో ఒకరు మృతి

image

నీట మునిగి ఒకరు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామ సమీపంలోని వంశధార కుడి కాలువలో స్నానం చేయడానికి గుండ చంద్రుడు(44) బుధవారం వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఎస్ఐ వెంకటేశ్ మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

News September 11, 2024

డోన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

డోన్ పట్టణం పాతపేరు ద్రోణపురి. పాండవుల గురువైన ద్రోణాచార్యుడు తీర్థయాత్రలకు బయలుదేరి దారి మధ్యలో ఈ ప్రాంతంలోని కొండలపై కొంత సమయం బస చేస్తాడట. అందుకు గుర్తుగానే ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో ఈ పట్టణం డోన్‌గా స్థిర పడింది. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

News September 11, 2024

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్

image

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మార్పిడి తర్వాత రమేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

News September 11, 2024

ప్రకాశం: APSSDC ఉద్యోగ ప్రకటన

image

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్‌కు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగాలు కల్పించనుంది. ప్రకాశం జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే.. విజయవాడలో రోజూవారీ వేతనంపై పని కల్పిస్తామని జిల్లా అధికారి రవితేజ చెప్పారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న NAC ట్రైనింగ్ సెంటర్‌ను సంప్రదించాలి.

News September 11, 2024

వైద్యపరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు

image

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ ఇవాళ వైద్యపరీక్షలకు హాజరైంది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో అడ్మిట్ అయింది. ఆమెకు రెండు రోజుల పాటు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. తనపై అన్యాయంగా పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్‌ను ఎమ్మెల్యే ఆదిమూలం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

News September 11, 2024

కడప: LLB తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న ఐదేళ్ల LLB మొదటి సెమిస్టర్, మూడేళ్ల LLB మొదటి సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి, కుల సచివులు ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలసి విడుదల చేశారు. తక్కువ కాలంలోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని వీసీ అభినందించారు.

News September 11, 2024

తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

ఈస్ట్ కోస్ట్ డివిజన్‌లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.