Andhra Pradesh

News April 29, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో 24,599 మంది కొత్త ఓటర్లు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 24,599 మంది కొత్తగా ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా వారిలో మహిళలే అధికంగా ఉండడం విశేషం. మహిళలు 14,578 మంది ఉండగా.. పురుషులు 10,021 మంది. ఇక కొత్త జిల్లాల ప్రకారం చూస్తే ఏలూరు జిల్లాలో 13,014 మంది కొత్త ఓటర్లుగా నమోదు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో 11,585 మంది చేరారు.

News April 29, 2024

అద్దంకిలో కరణం వర్గీయుల దారెటు?

image

అద్దంకి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న నేత, అన్ని మండలాలలో ఆయనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేదరమెట్ల గ్రామం లాంటి మేజర్ పంచాయతీలలో, ఆయనకు కుడి భుజంగా మెలిగే అనుచరవర్గం ఉంది. కరణం టీడీపీని వీడి వైసీపీలో కొనసాగుతూ ఉండటంతో.. అద్దంకిలో ఆయన వర్గీయులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని నియోజకవర్గవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది.

News April 29, 2024

SKLM: 30 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

image

మే 13న జరిగే ఎలక్షన్‌కు సంబంధించిన ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. వచ్చేనెల ఏడవ తేదీలోగా పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరుకు ఈ‌ స్లిప్పులు అందే విధంగా జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు.

News April 29, 2024

విశాఖ: నేడు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు

image

విశాఖ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సోమవారం సాయంత్రం 6 గంటలకు గుర్తులు కేటాయిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తులు కేటాయించిన అనంతరం నియోజకవర్గం కేంద్ర పరిశీలకులు అభ్యర్థులకు మార్గదర్శకాలు జారీ చేస్తారని అన్నారు.

News April 29, 2024

నడికుడి వద్ద ఆర్టీసీ బస్సు.. బొలెరో ఢీ

image

మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న బొలెరోను సోమవారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పల్టీ కొడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంతో బొలెరోలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉండగా.. వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని 108లో గురజాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News April 29, 2024

కృష్ణా: ఒకే కుటుంబం నుంచి ముగ్గురు MLAలు

image

గుడివాడ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు MLAలుగా పనిచేశారు. 1994 సాధారణ ఎన్నికలలో TDPఅభ్యర్థిగా రావి శోభనాద్రి గెలుపొందారు. 1999లో రావి హరిగోపాల్ TDPతరఫున గెలిచి ప్రమాణస్వీకారం చేయకుండానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన సోదరుడు రావి వెంకటేశ్వరరావు 2000లో జరిగిన ఉప ఎన్నికలలో గెలిచారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒకే నియోజకవర్గంలో MLAలు కావడం విశేషం.

News April 29, 2024

ప.గో.: భార్యాభర్తలు MLAలుగా.. ఇద్దరూ INDEPENDENT

image

ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గంలో వేర్వేరు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన భార్యాభర్తలు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. 1967లో కట్రెడ్డి కుసుమేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోకరాజు రంగరాజుపై 3997 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత 1970లో జరిగిన ఉప ఎన్నికలో కట్రెడ్డి భార్య ఆండాళ్ళమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు.

News April 29, 2024

కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం: CBN

image

చంద్రబాబు ఆదివారం కౌతాళపురంలో ప్రజాగళం సభను నిర్వహించారు. అందులో మంత్రాలయం, ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఇసుక దోపిడీదారులని, ప్రజల రక్తాన్ని పీల్చే వ్యక్తులని, రోడ్డు, నీరు, అభివృద్ధి చేయలేని అసమర్ధులని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను, కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?

News April 29, 2024

ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

image

TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్‌ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

News April 29, 2024

రాజాo: పెన్షన్ తీసుకుంటున్న వారికి గుడ్ న్యూస్

image

దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, చక్రాల కుర్చీకి పరిమితమైన వారు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లను ఇంటింటికి సచివాలయం సిబ్బంది 1వ తారీఖు నుంచి అందిస్తారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మిగిలిన వారికి DBT విధానం ద్వారా వారి వారి అకౌంట్స్‌లోనికి మే 1వ తారీఖున పెన్షన్ జమ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ తీసుకోవడానికి ఎవ్వరూ కూడా సచివాలయం లేదా ఏ ఇతర ఆఫీస్‌లకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు.