India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.
సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కాటూరు నరేంద్ర(36)కృష్ణలంక గుంటూరి వారి వీధిలో ఉంటూ లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, భార్య నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో నరేంద్ర ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పొన్నూరుకు వస్తున్నారు. పి. గన్నవరం నుంచి హెలికాఫ్టర్లో మధ్నాహ్నం 3 గంటలకు స్థానిక జీబీసీ రహదారిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఎన్నికల ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 3వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటీవల ఒంగోలు కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు చేపట్టే ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
ఉమ్మడి అనంత జిల్లాలో ఆదివారం అనంత నగరంలో రికార్డు స్థాయిలో 44.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. బుక్కరాయసముద్రంలో 43.2, తాడిపత్రి, నంబులపూటకుంట, పుట్టపర్తి 40.5, తనకల్లు, గోరంట్లలో 40.4 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
బాడంగి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజయ్యపేటకుగ్రామానికి చెందిన ఏవీఎస్ డీకే రాజు (58) ఆదివారం మృతి చెందారు. ఇటీవల విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖలో చికిత్స పొందుతూ , ఇతర అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు వీఆర్వోల సంఘం సంతాపం ప్రకటించింది.
కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఏలూరుకు చెందిన వినోద్ కుమార్ సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటుచేసే పనిచేస్తుంటారు. పనిలో భాగంగా 8మందితో వ్యాన్లో ఆదివారం అనకాపల్లి బయలుదేరారు. కాపవరం వద్దకు రాగానే వీరివాహనం ముందువెళ్తున్న లారీని ఢీకొంది. వినోద్, ప్రభాకర్(21) అక్కడికక్కడే మరణించారు. మిగతా వారికి గాయాలయ్యాయి. కేసు నమోదుచేసినట్లు కొవ్వూరు గ్రామీణ SI సుధాకర్ తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిన్న సీఎం ప్రచారం జరిగింది. ఈక్రమంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. త్రిభువని సెంటర్లో ప్రసంగం అనంతరం జగన్ విశ్వోదయ కాలేజీ మైదానంలోని హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పెద్దయాచ సముద్రానికి చెందిన మాజీ వాలంటీర్ బారికేడ్లు దూకి హెలికాప్టర్ వద్దకు పరుగులు తీశాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్కు చెందిన రమ్య, రాజమండ్రికి చెందిన వరలక్ష్మి స్థానిక JN.రోడ్డులో బ్యూటీపార్లర్ స్పామసాజ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ప్రకాశంనగర్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి నిర్వాహకులైన మహిళలతో పాటు ముగ్గురు యువతులు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు CI సత్యనారాయణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.