India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మైపాడు బీచ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గూడూరు ఆదిశంకర కాలేజ్కి చెందిన కొందరు విద్యార్థులు మైపాడు బీచ్కు వెళ్లి సముద్రంలో ఈత కొడుతుండగా వారిలో ఒక విద్యార్థి సముద్రంలో మునిగిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి అతనిని ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న అతనిని వెంటనే మైపాడులోని ప్రజా వైద్యశాలకు తరలించి అత్యవసర వైద్యం అందించినా అతను మరణించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామం మొటుకువాండ్లపల్లికు చెందిన సంతోష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కుమారుడు సంతోష్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఉన్నట్లుండి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

గుత్తి మండలం ఇసుకరాళ్లపల్లికి చెందిన ఉపేంద్ర అనే యువకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేశ్తో వెంట నడిచాడు. ఆ క్రమంలో తన లక్ష్యం గురించి చెప్పడంతో రూ.22 లక్షల ఆర్థిక సాయం అందించారు. తనకు సహకరించిన నారా కుటుంబం ఫొటో, టీడీపీ జెండాను ఎవరెస్ట్పై పాతి అందరి దృష్టిని ఆకర్షించాడు. వచ్చే ఏడాది మరోసారి ఎవరెస్ట్ ఎక్కి రెండుసార్లు ఎక్కిన ఘనత దక్కించుకుంటానని తెలిపారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కారుపై పెద్దపులి దాడి చేసినట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కారును పరిశీలించిన అధికారులు.. దానిపై ఎలాంటి జంతువు దాడి చేయలేదని తేల్చారు. ఎక్కడో ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, లేదా ఇతర ప్రయోజనాల కోసం యజమాని ఇలా చేశారని తెలుస్తోంది. పెద్దపులి దాడి అంటూ అధికారులు, మీడియాను తప్పుదోవ పట్టించిన యజమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నిన్న బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పవన్ 10 గంటలపాటు సమీక్షలు నిర్వహించినట్లు జనసేన తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది.

రుషికొండ భవనాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిచారు. ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలను జగన్ ఇళ్లు అన్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని, ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. ఫలితాల అనంతరం వైసీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాని, వాటికి తాము ఏమాత్రం భయపడమన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలన్నారు.

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. నోటిఫికేషన్లు విడుదలవుతున్న సమయంలో చదువుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు ఆడిటోరియం గదిని కేటాయించాలని కోరుతూ అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో మాట్లాడి అభ్యర్థులకు గదిని అందించారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ముక్కవారిపల్లిలో ఎస్వీ కళ్యాణ్ మండపం దగ్గర జాతీయ రహదారిపై కారును లారీ ఢీ కొన్న సంఘటనలో కారు నుజ్జైంది. కారులో డ్రైవర్తో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి సిమ్స్కు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి కేసు నమోదుచేశారు.

చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 17ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు పండ్లు ఇస్తానని ఆశచూపి ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి పిల్లలు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.