India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ వరదల్లో మరణాలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రచారం కోసం చంద్రబాబు జేసీబీపై తిరగారని విమర్శించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పంట పొలాలు అన్ని మునిగిపోయాయని అన్నారు. ఒక్క అధికారి జిల్లాలో కనిపించడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను జగన్ కాపాడినట్లు పేర్కొన్నారు.

రాజమండ్రి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోసం గ్రామీణ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సెల్ ఫోన్ రిపేర్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెక్యూరిటీ కెమెరా ఏర్పాట్లు సర్వీస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పులివెందులలోని ‘మా ఊరి సినిమా’ చిత్ర హీరో మహేశ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పులివెందులలోని షాదీ ఖానా వెనక భాగంలో మహేశ్ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ కాగా, ఆ ఘటన జరిగి నేటికి ఏడాది సందర్భంగా మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు.. నియంత జగన్ కుట్రలు మరో వైపు.. చంద్రబాబు అక్రమ నిర్బంధంపై తెలుగుజాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు ఏడాది క్రితం తప్పుడు కేసులో అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయింది’ అని పోస్ట్ చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వినాయకుడి లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది. బంగ్లా బాయ్స్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. విష్ణువర్ధన్ 2 లడ్లు రూ.2.62 లక్షలు, రాజా రూ.85 వేలు, విశ్వనాథ్ చౌదరి రూ.60 వేలు.. మొత్త రూ. 4.17 లక్షలు ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

నెల్లూరు నగరానికి చెందిన అక్కరపాక సురేశ్ ఆచారి వికలాంగుడు. అయినప్పటికీ ఒంటికాలితో శబరిమల పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరులో బయలుదేరి పెంచలకోన మీదుగా శబరిమలకు పాదయాత్రగా బయలుదేరాడు. సోమవారం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు చేరుకుంది. ఇలా సురేశ్ ఆచారి ఇదివరకు రెండుసార్లు పాదయాత్ర చేపట్టి మూడవసారి మొక్కు తీర్చుకునేందుకు శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు.

గణేశ్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలోని ఆశ్రమం వీధిలో ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ఆదివారం రాత్రి అశోక్(32) అనే యువకుడు డాన్స్ వేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆశ్రమం వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బెంగుళూరు పర్యటనలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్ తో ఫోన్లో సోమవారం మాట్లాడారు. విజయనగరంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.భోగాపురం పోలీసులను అలెర్ట్ గా ఉంచాలని కోరారు.

అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. లింగాల మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ వర్షం నమోదయినట్లు చెప్పారు. కొండాపురం మండలంలో 1.2 మి.మీ, పులివెందుల 26, వేముల 15, చక్రాయపేట 4, సింహాద్రిపురం 4.4, వేంపల్లిలో 5.4, మైదుకూరు 3.8, ఖాజీపేట 2.8, చాపాడు 2.4, తొండూరు 2.0, సిద్దవటం 1.8, దువ్వూరు 1.6, బద్వేల్, అట్లూరు 1.4, బీ.కోడూరు 1.0, బీ.మఠం మండలంలో 1.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.

నల్లమాడలోని పాత బాలాజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వంశీ, ప్రశాంత్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ పోలె వెంకటరెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్లో భాగంగా ఆదివారం కదిరిలో జరిగిన 44వ జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.