India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈడీ స్వాధీనం నుంచి భూములను వెనక్కు తీసుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. లేపాక్షిలో 8,844 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఓర్వకల్, కొప్పర్తి తరహాలో లేపాక్షిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి టీజీ భరత్ చెప్పారు.

కాకినాడ జిల్లా కరప మండల సమీపంలోని కోళ్లఫారం ఫారం షెడ్డులో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన కిషోర్, విశాక్ ఉరేసుకొని ఉన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కరప పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇసుక డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు సరికొత్త ఆలోచనలకు తెర తీస్తున్నారు. ఎడ్లబండ్లలో ఇసుక తరలించి దానిని ట్రక్కులకు నింపి సొమ్ము చేసుకుంటున్న ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలుగు చూసింది. వాస్తవానికి బండ్లకు ఎటువంటి డబ్బులు కట్టకుండా తరలించవచ్చు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమంగా ఇలా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సత్యవేడు MLA ఆదిమూలంపై కుట్రపూరితంగా KVBపురానికి చెందిన మహిళతో ఆరోపణలు చేయించారని.. ఇది అవాస్తవమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. నారాయణవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ‘ఈ కుట్ర వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత, చెరుకు గుర్తుతో పోటీ చేసిన రమేశ్ ఈ ప్లాన్ వేశారు’ అని మాజీ ఎంపీపీలు గోవిందస్వామి, భక్తవత్సలం, సుబ్రహ్మణ్యం ఆరోపించారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే దుకాణ యజమానులపై చట్ట పరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి హెచ్చరించారు. ఉదయగిరి వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల దుకాణ యజమానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలను పాటిస్తూ దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకుంటారని పేర్కొన్నారు.

ఒంగోలులోని సమతానగర్లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా 17 అడుగుల ఎత్తులో కొబ్బరికాయలతో గణేష్ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. బస్తాపై ఉన్న ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని, నాసిరకం ఎరువులు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లులు జారీ చేయాలని, దుకాణాల ఎదుట ధరలు, నిల్వ వివరాలు పొందుపరచాలని చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని తెలిపారు.

ఉమ్మడి ప.గో.లో వైసీపీ కీలక నేతలంతా రాజీనామాలు చేయడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ సహా 19 మంది కార్పొరేటర్ల రాజీనామా చేశారు. తాజాగా జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు సైతం రాజీనామా చేశారు. ఈ ఎఫెక్ట్ జిల్లా వైసీపీలో ఏ మేర ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది. మీ కామెంట్..?

భారీ వర్షాల కారణంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 07281 నరసాపూర్ -గుంటూరు రైలును నేటి నుంచి 8వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. 07783 విజయవాడ- గుంటూరు, 07779 గుంటూరు-మాచర్ల, 07580 మాచర్ల-నడికుడి, 07579 నడి కుడి-మాచర్ల రైళ్లు ఇవాళ, రేపు రద్దు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.