India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. గుంటూరు సెక్షన్లో భద్రతాపరమైన పనుల వల్ల ఈ ఏడాది ఏప్రిల్ వరకు రద్దు చేసిన డోన్-గుంటూరు-డోన్ (17227/28) రైలును పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. డీఆర్సీసీ మెంబర్ జుబేర్ బాషా కృషి ఫలితంగా ఈరైలును పునరుద్ధరించనున్నట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారులైన కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలు శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)ను పరిశీలించారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు.
పొదలకూరు మార్కెట్లో శుక్రవారం నాణ్యమైన నిమ్మకాయలు బస్తా రూ.9.500 పలికాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు బస్తా రూ.4 వేలు నుంచి రూ.5 వేలు పలుకుతూ వచ్చింది. మంగళవారం ఆరు వేలకు చేరగా, గురువారం రూ.8 వేలు పలికింది. శుక్రవారం మరో రూ.1500 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం పెద్ద చెప్పలిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దచెప్పలిలోని పంచర్ బంకుకు విద్యుత్ సరఫరా కావడంతో అన్వర్ భాష(36) షాక్ తగిలి స్పృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెనాలిలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఇక్కడి బరిలో నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు తుంపల నరేంద్ర, అశోక్ కుమార్,జి. రామకృష్ణ, తెలుగు జనతా పార్టీ అభ్యర్థి కె.నాగరాజు నామినేషన్ పత్రాలకు ఆమోదం లభించింది.
గుడివాడ YCP అభ్యర్థి కొడాలి నాని నామినేషన్పై వివాదం నెలకొంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ROకి TDP నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆఫీస్ను కొడాలి నాని క్యాంప్ ఆఫీస్గా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరారు. మరోవైపు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్కు 2024-2025 సంవత్సరానికి గానూ లీగల్ ఎయిడ్ విభాగానికి ఎన్టీఆర్, కృష్ణాజిల్లా ఛైర్మన్గా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ శేషగిరిరావు ఉత్తర్వులు జారీ చేశారు. 18 సంవత్సరాలుగా బాలాజీ లయన్స్ క్లబ్లో అనేక పదవులు నిర్వహించి పలు సేవా అవార్డులు పొందారు.
ఎల్.ఎన్.పేట మండలం శ్యామలాపురం పునరావాస కాలనీలో ఉంటున్న నెల్లి అమ్ములు (69) గురువారం రాత్రి మృతిచెందింది. శుక్రవారం ఉదయం ఈమె దహన సంస్కరాలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేస్తున్నారు. అక్కడే రోదిస్తూ ఉన్న అమ్ములు భర్త ఏకాశి (77) ఆమెకు చివరి స్నానం చేయిస్తూ కుప్పకూలిపోయాడు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది.
పెదపాడు మండలంలోని జయపురం గ్రామంలో భలే జగన్మోహనరావు (32) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిది హత్యా.. లేక కరెంట్ షాక్ తో చనిపోయారా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.
తొండంగి మండలం పైడి కొండకు చెందిన కోదండ గంగేశ్వర్ (31) ఉరి వేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో గంగేశ్వర్ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తూ డిప్యూటేషన్పై సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో ఎస్పీబీలో విధులు నిర్వహిస్తున్నాడు. సూళ్లూరుపేట షార్ ఉద్యోగుల నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.