India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో సాగు చేపట్టిన వెస్టిండియన్ చెర్రీస్ ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటు న్నాయి. ఎరుపు రంగులో ఉండే వీటిలో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. ఇవి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని స్థానిక పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు తెలిపారు. మొక్కలు అన్ని రకాల నేలల్లోనూ ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ పార్క్ సమీపంలో ఓ యువకుడు, మరో యువకుడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి పది గంటల సమయంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ సి.భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్స్ సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన యువకుడిని రిమ్స్కు తరలించారు. ఈ సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.

చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం రేపింది. చీమకుర్తి సీఐ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణ అనే యువకుడు బైక్పై బైపాస్ కూడలి ప్రాంతంలో వెళ్తుండగా.. ఎండ్లూరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఆయనను వెంబడించి దాడి చేశాడు. మత్తు సూది ఇచ్చి కారులో హైదరాబాద్లోని మల్కాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ స్పృహలోకి వచ్చిన పూర్ణ తప్పించుకొని తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం టీచర్ల భర్తీకి గురువారం డెమో నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే అర్హులైన (టెట్, బీఎడ్, పీజీ/ సంబంధిత మెథడాలజీ ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాకు 1132 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ గుర్తించింది. 40 శాతం రాయితీతో రైతులకు అందించనున్నారు. విజయనగరం జిల్లాకు కె-6 రకం 600 క్వింటాళ్లు, మన్యంకు 188 క్వింటాళ్లు, గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై 10 క్వింటాళ్లు కేటాయించారు. లేపాక్షి రకం 300, 18, 16 క్వింటాళ్ల చొప్పున ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే 433 క్వింటాళ్ల సరకు మండల కేంద్రాలకు చేరింది.

సత్తెనపల్లి మండల పరిధి కట్టమూరులోని దీపాలదిన్నెపాలెం రహదారి పక్కన ఓ వ్యవసాయ బావిలో దాసరి ఏసుబాబు(22) మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. భట్లూరుకు చెందిన యువకుడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బావిలో పడి చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పూండి-నౌపడా సెక్షన్ మధ్యలో జరుగుతున్న భద్రత పనుల దృష్ట్యా నేడు పలాన పాసింజర్ గమ్యం కుదించినట్లు అధికారులు తెలిపారు. పలాస-విశాఖపట్నం (07471) పాసింజర్ స్పెషల్ గురువారం పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనుంది. అలాగే విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం-పలాస(07470) పాసింజర్ స్పెషల్ పలాస వరకు కాకుండా శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది.

పేదలకోసం సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. జులై 1నుంచి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు కందిపప్పు, పంచదార, బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరిలో కలిపి 50,06,194మందికి లబ్ధి చేకూరనుందని పౌర సరఫరాల శాఖ డీఎస్ వో విజయభాస్కర్ తెలిపారు.

పూండి-నౌపడా సెక్షన్ మధ్యలో జరుగుతున్న భద్రత పనుల దృష్ట్యా నేడు పలాన పాసింజర్ గమ్యం కుదించినట్లు అధికారులు తెలిపారు. పలాస-విశాఖపట్నం (07471) పాసింజర్ స్పెషల్ గురువారం పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనుంది. అలాగే విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం-పలాస(07470) పాసింజర్ స్పెషల్ పలాస వరకు కాకుండా శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది.

ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ATVM) ఫెసిలిటేటర్స్ కొరకు విజయవాడ రైల్వే డివిజన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఉద్యోగ ప్రకటన కాదని గమనించాలని అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ATVM ఫెసిలిటేటర్స్కు ఎలాంటి పారితోషికం/వేతనం ఉండదని, వీరికి టికెట్ సేల్పై బోనస్ మాత్రమే ఉంటుందని వారు తెలిపారు. పూర్తి వివరాలకు https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్సైట్ చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.