Andhra Pradesh

News April 26, 2024

బిట్రగుంట: మెము రైళ్లు రద్దు పొడిగింపు

image

పలు మెము రైళ్లు రద్దు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిట్రగుంట-విజయవాడరైలు 29 నుంచి మే 26 వరకు, విజయవాడ-బిట్రగుంట రైలు 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-చెన్నై రైలు 29 నుంచి మే 3 వరకు, మే 6 నుంచి 10 వరకు, 13 నుంచి 17 వరకు, మే 20 నుంచి 24 వరకు రద్దు చేశారు.

News April 26, 2024

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తి వివరాలు

image

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డా. సృజనకు అందజేశారు. బీవై రామయ్య కుటుంబం పేరిట రూ.2.98కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రామయ్యకు అప్పు రూ.30.78లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై అస్పరి పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది ఒక కేసు నమోదైంది.

News April 26, 2024

గతంలో YCP నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి: పెమ్మసాని

image

గతంలో తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని గుంటూరు టీడీపీ MP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 2019లో నరసరావుపేట, గుంటూరు ఎంపీ టికెట్లు.. రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా తాను తిరస్కరించానన్నారు. తన ఐడీయాలజీకి సరిపోని పార్టీ వైసీపీ అని చెప్పారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు తన వల్ల సమాజానికి మేలు జరుగుతుందని టికెట్ ఇచ్చినట్లు వివరించారు.

News April 26, 2024

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. వాలీబాల్‌లో గాలి తగ్గిందని 12 ఏళ్ల బాలుడు ఓ చోటకు వెళ్లాడు. అక్కడ అనికేపల్లికి చెందిన రాజా అనే వ్యక్తి సైకిల్ పంపు ద్వారా బాలుడి మలరంధ్రాల్లో గాలి కొట్టాడు. దీంతో అతని పొట్ట ఉబ్బిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా రాజాపై పోక్సో కేసు నమోదు చేశారు.

News April 26, 2024

ఎచ్చెర్లలో ఒకే పేరు.. అభ్యర్థులు వేరు

image

ఎచ్చెర్లలో వైసీపీ నుంచి గొర్లె కిరణ్‌కుమార్ పోటీ చేస్తుండగా, గొర్లె కిరణ్‌కుమార్ అనే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కూటమి తరఫున నడుకుదిటి ఈశ్వరావు ఉండగా.. అదే పేరుకు దగ్గరగా నడుపూరి ఈశ్వరరావు, నేతల ఈశ్వరరావు స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. కాగా శ్రీకాకుళం వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేయగా.. రెండుసార్లు వచ్చినవి తీసేయడంతో 123 మంది మిగిలారు.

News April 26, 2024

నెల్లూరు: చివరి రోజు 113 సెట్ల నామినేషన్లు

image

నెల్లూరు జిల్లాలో చివరి రోజు గురువారం మొత్తం 113 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కందుకూరు 14, కావలి 8, ఆత్మకూరు 7, కోవూరు 24, నెల్లూరు నగరం 16, నెల్లూరు గ్రామీణం 8, సర్వేపల్లి 7, ఉదయగిరిలో 14 మంది నామినేషన్ వేశారు. నేడు వీటిని పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.

News April 26, 2024

VZM: ఎన్నికల కోడ్‌తో జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలు ఇవే..

image

ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి గురువారం వరకు విజయనగరం జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సుమారు రూ.4.43 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహ పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.1.04 కోట్ల నగదు, 14,372 లీటర్ల మద్యం, రూ.29.75 లక్షల విలువైన డ్రగ్స్, రూ.1.85 కోట్ల విలువైన లోహ పరికరాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 26, 2024

కృష్ణా: ఒకే పేరుతో పలు నామినేషన్లు

image

మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరు కలిసేలా Ch బాలశౌరి అనే వ్యక్తి, YCP MP అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కలిసేలా రావూరి చంద్రశేఖర్, అన్నే చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. పెడన TDP అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు కలిసేలా కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్, గుడివాడ YCP అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేరు కలిసేలా వెంకటేశ్వరావు కొడాలి అనే వ్యక్తి పేరిట నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 26, 2024

తిరుపతి ఎంపీగా పోటీ చేసిన నేత మృతి

image

టీడీపీ నేత కారుమంచి జయరాం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చనిపోయారు. పోలీసు శాఖలో పని చేసిన ఆయన రిటైర్‌మెంట్ తీసుకుని పొత్తులో భాగంగా 2014లో BJP తిరుపతి MP అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో YCP అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు TDPలో చేరారు. రేణిగుంట(M) అత్తూరులో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News April 26, 2024

ప్రకాశం: ఆ మండలం నుంచి ఆరుగురు MLA అభ్యర్థులు

image

దేశంలోనే పొగాకు వ్యాపారానికి టంగుటూరు మండలం ప్రసిద్ధి. ఇక్కడి నుంచి వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు MLA అభ్యర్థులు ఉన్నారు. బాలినేని, దామచర్ల జనార్దన్ ఇద్దరిది ఈ మండలమే. వీరిద్దరూ ఒంగోలు నుంచి తలపడుతున్నారు. బుర్రా మధుది టంగుటూరులోని శివపురం. MLA డోలా వీరాంజనేయ స్వామిది తూర్పు నాయుడుపాలెం. తాటిపర్తి ఇక్కడివారే. వరికూటి అశోక్ బాబు కారుమంచిలో పుట్టి పెరిగారు. అటు గంటా శ్రీనివాసరావుది జరుగుమల్లి మం.

error: Content is protected !!