Andhra Pradesh

News April 26, 2024

ఈనెల 29న చోడవరంలో సీఎం జగన్ బహిరంగ సభ

image

ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28న తాడిపత్రి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారని, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. 29న చోడవరంలో ఉదయం పది గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారన్నారు.

News April 26, 2024

కోటబొమ్మాళి: ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

image

కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చీపుర్లపాడు పంచాయతీ దుర్గంపేటకు చెందిన చిదపాన శ్రీనును సీతన్నపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

News April 26, 2024

కడప: వివాహిత అనుమానాస్పద మృతి

image

ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.

News April 26, 2024

మచిలీపట్నం అసెంబ్లీకి పేర్ని నాని నామినేషన్!

image

మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి 3 సెట్ల నామినేషన్లు వేశారు. అది కూడా వైసీపీ అభ్యర్థిగా. అదేంటి పొలిటికల్ రిటైర్మెంట్ అని, మళ్లీ నామినేషన్ వేయడం ఏమిటా అని అనుకుంటున్నారా.? తన కుమారుడు పేర్ని కిట్టుకు ఆయన డమ్మీగా నామినేషన్ వేశారు. స్క్రూటినీలో తన కుమారుడి నామినేషన్ అంతా కరెక్ట్‌గా ఉంటే పేర్ని నాని తన నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు.

News April 26, 2024

28న తాడిపత్రికి సీఎం జగన్ రాక..

image

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ తేదీన ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలో బహిరంగ సభ అనంతరం వెంకటగిరికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News April 26, 2024

CTR: టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీలకు రెబల్ పోటు తప్పేలా లేదు. తాజాగా పలమనేరులో TDP రెబల్‌గా దామోదర్ నాయుడు (బుల్లెట్ నాయుడు) నామినేషన్ వేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్నా.. తనకు ఎవరూ గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సత్యవేడులో టీడీపీ రెబల్‌గా జేడీ రాజశేఖర్, కుప్పంలో వైసీపీ రెబల్‌గా ఓ మాజీ సర్పంచ్ నామినేషన్ వేశారు.

News April 26, 2024

నెల్లూరు: రాష్ట్రంలోనే పేద అభ్యర్థి..!

image

నెల్లూరు ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కొప్పాల రఘు నామినేషన్ వేశారు. అఫిడవిట్ ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి ఆయనే కావడం విశేషం. రఘుకి సొంత ఇల్లు, కారు, వ్యవసాయ భూమి, బంగారు ఆభరణాలు లేవు. చర, స్థిర ఆస్తులు ఏమీ లేవు. సెకండ్ హ్యాండ్ బైకు ఉంది. SBI బ్యాంక్ బ్యాలెన్స్ రూ.500. ఆయన భార్య కొప్పాల రేవతి పేరుపై కూడా చర, స్థిర ఆస్తులు లేవు. రఘుపై ఓ సోషల్ మీడియా కేసు ఉంది.

News April 26, 2024

విజయనగరం: ‘మీ ఓటు.. మీ భ‌విష్య‌త్తు’

image

మీరు వేసే ప్ర‌తీ ఓటు మీ భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంద‌ని అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ స‌హాదిత్ వెంక‌ట త్రివినాగ్ అన్నారు. స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం ప‌ట్ట‌ణంలోని కోట‌, బాలాజీ, మ‌యూరి జంక్షన్ల వ‌ద్ద కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌య విద్యార్దులు ఫ్లాష్ మాబ్ నిర్వ‌హించారు. ఓటు హ‌క్కు వినియోగం ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించారు. హుషారైన‌ నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శించి ఉర్రూత‌లూగించారు.

News April 26, 2024

కర్నూలుకి 56 నామినేషన్లు: ఆర్వో

image

నామినేషన్ల స్వీకరణకు 25వ తేదీ చివరి గడువు కావడంతో నామినేషన్లు వెల్లువలా దాఖలు అయ్యాయి. కర్నూలు ఆర్వో కార్యాలయమైన మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఒకేరోజు 21 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం కలిపి 56 నామినేషన్లు దాఖలు అయ్యాయని కర్నూలు మున్సిపల్ కమిషనర్, ఆర్వో ఏ.భార్గవ తేజ తెలిపారు.

News April 26, 2024

సత్యసాయి జిల్లాకు ఇద్దరు జనరల్ అబ్జర్వర్లు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సత్యసాయి జిల్లాకు ఇద్దరు జనరల్ ఎన్నికల కమిషన్ నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అన్బుకుమార్, మహారాష్ట్రకు చెందిన దీపక్ రామచంద్ర తివారి గురువారం సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో భేటీ అయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చునని సంబంధిత అబ్జర్వర్లు పేర్కొన్నారు.

error: Content is protected !!