India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించి, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్టు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లావేరు పోలీసు స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు వెంకటాపురం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అతివేగం, ఓవర్ లోడ్తో వెళ్లిన వాహనాలను గుర్తించి రోడ్డు నియమాలు పాటించాలన్నారు.

నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అధికారులకు ఆదేశించారు. గురువారం ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నైట్ బీట్, పెట్రోలింగ్ పెంచి నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు కృషి చేయాలని, పోలీస్ శాఖపై ప్రజలలో విశ్వసనీయత పెంచే విధంగా చూడాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు హత్యలు, రహదారి ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కోటిరెడ్డి సర్కిల్ ప్రాంగణంలో 3కె రన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థి, యువత దశలో క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ శ్యామల రావు అన్నారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన అమ్మవారి ఆలయం, వాహన మండపం, నాలుగు మాడా వీధులు, పుష్కరిణి ప్రాంతాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమల తరువాత అంతటి ప్రాశస్త్యం కలిగిన అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ఇటీవల ఒలింపిక్స్లో పాల్గొన్న తణుకు పట్టణానికి చెందిన క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతికశ్రీకి శాలువా కప్పి అభినందించి జ్ఞాపిక అందజేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో మరింత రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

వివిధ దళాల్లో అను శక్తి మరింత బలోపేతం చేయనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన INS హరి ఘాత అనే జలాంతర్గామిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక వ్యవస్థలను మన శక్తి సామర్థ్యాలను శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. ఈ జలాంతర్గామి దేశం సాధించిన మరో ప్రగతి అని ప్రశంసించారు.

ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఖజానాకు భారమైనా లబ్ధిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం తెలిపారన్నారు.

➤ కడప జిల్లా వ్యాప్తంగా ITIలో కౌన్సెలింగ్
➤ బీటెక్ రవికి ఎమ్మెల్సీ?
➤ సెప్టెంబర్ 1న ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
➤ కడప జిల్లాలో పర్యటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
➤ వైఎస్ జగన్తోనే నా ప్రయాణం: మేడా రఘునాథ్ రెడ్డి
➤ బీజేపీలోకి ఎర్రగంగిరెడ్డి.. స్పందించిన పురందీశ్వరి
➤ కడప: JNTU కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
➤ పులివెందులలో భారీగా మద్యం పట్టివేత
➤ కొండాపురం వద్ద రెండు లారీల ఢీ

బల్లికురవ మండలంలోని కొమ్మినేని వారి పాలెంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడంతో కరీమున్ అనే మహిళ మృతిచెందింది. మరో మహిళకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.