India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల MLA చెన్నకేశవ రెడ్డి స్వగ్రామం. 40 ఏళ్లుగా ఈ ఊరును MLA తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏకపక్షంగా ఓట్లు పడేవి. ఈ ఊరిలో ప్రత్యర్థులు ప్రచారం చేసేవాళ్లు కాదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ జయనాగేశ్వర రెడ్డి ఆ గ్రామంలో ప్రచారం చేశారు. కడిమెట్లతో పాటు పరిసర గ్రామాల్లో 12 వేల ఓట్లు ఉండగా.. ఈసారి ఓటింగ్పై అందరి దృష్టి నెలకొంది.
సార్వత్రిక ఎన్నికలు – 2024 ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గం VZM జిల్లా పోలీస్ అబ్జర్వర్ సచ్చింద్ర పటేల్, VZM జిల్లా జనరల్ అబ్జర్వర్ టాట్ పర్వేజ్ ఇక్బాల్ రోహేళ్ల గురువారం సాయంత్రం జిల్లాకు విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ను ఇరువురు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్నికల అంశాలపై చర్చించుకున్నారు.
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ ముస్లిం మైనార్టీస్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ గురువారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలితో మానసిక వేదనకు గురైన తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఉదయం తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్సింగ్, శివప్రకాశ్, మధుకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిపినట్లు సమాచారం.
మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నీరజ్ కుమార్ గురువారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డిని కలిశారు. జిల్లాలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి, పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు, ఓటర్లకు ఎన్నికల పరిశీలకులు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండలన్నారు.
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఓ పోలీస్ కేసు నమోదైంది.
ఓపెన్ స్కూల్, టెన్త్ & ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో టెన్త్ పరీక్షలకు 767 మంది హాజరుకాగా 280 (36.51) శాతం మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1705 మందికి 561 (32.90%) మంది ఉత్తీర్ణులయ్యారని గురువారం జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఫలితాల్లో శ్రీకాకుళం టెన్త్ 17వ స్థానం, ఇంటర్మీడియట్లో 23వ స్థానంలో నిలిచిందని వారు వెల్లడించారు.
JEE మెయిన్స్ పరీక్షల్లో డా.బీఆర్.అంబేడ్కర్ జిల్లా కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు సాయి నరేన్ జాతీయ స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 648వ ర్యాంక్ సాధించారు. నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు గంటి జడ్పీ హైస్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ మేరకు విద్యార్థిని గ్రామస్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు… రామసముద్రం మండలం పట్రాజుపల్లికి చెందిన లోకేశ్, గంజిగానిపల్లికి చెందిన సుబ్బు, శశికుమార్ బెంగుళూరు రైల్వేస్టేషన్కు వెళ్లారు. పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు.
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం యూనివర్సిటీ డీఎన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా డిగ్రీ మొదటి, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.