India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో నేరాల కట్టడికి అన్ని చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారి సమీక్షను ఎస్పీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అసాంఘిక కార్యక్రమాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.

సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత ఇసుకకు నూతన విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599ను విస్తృతంగా ప్రచారం చేయాలని మీనా ఆదేశించారు.

వర్షాకాలం కావడంతో ఈ రెండు నెలలు సీజనల్ వ్యాధులు ప్రబల కుండా వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమీక్షలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. వైద్య శాఖ జిల్లా అధికారులు బృందాలుగా వేసుకొని జిల్లా అంతటా ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు.

రాపూర్ మండలంలోని పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగోవ శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో ప్రత్యేక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. గుంటూరుకు మల్లికార్జున, బాపట్లకు ఎంవి శేషగిరి బాబు, పల్నాడుకు రేఖ రాణిని ప్రభుత్వం నియమించింది.

ఆగష్టు నెల 31న పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిదర్శనమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. 31న అందుబాటులో లేని లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న పెన్షన్లు అందచేస్తారన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే అందిస్తున్నారని తెలిపారు.

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా భువనేశ్వర్ (BBS), బెళగావి(BGM) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం BBS- BGM(నం.02813), సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం BGM- BBS(నం.02814) మధ్య నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మరో 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

నేర సంఘటనలపై కేసు నమోదు చేసినంతనే సరిపోదని.. బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. స్థానిక మహిళా యూనివర్సిటీ సెమినార్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయం కోసం ప్రజలు ఏ సమయంలో వచ్చి ఫిర్యాదు చేసినా స్వీకరించి, సమగ్రంగా విచారణ చేయాలని చెప్పారు. నేరాలపై అలసత్వం పనికిరాదన్నారు. సమాచారం అందిన వెంటనే నేర స్థలాన్ని పరిశీలించాలన్నారు.

వర్షం కారణంగా పత్తికొండ పర్యటన రద్దు కావడంతో సీఎం చంద్రబాబు శనివారం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్తో కలిసి కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 1.50 గంటలకు సీఎం ఓర్వకల్లు గ్రామానికి చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తారు.
Sorry, no posts matched your criteria.