Andhra Pradesh

News April 28, 2024

గుంటూరు జిల్లాలో రూ.2.46 కోట్లు దొరికాయ్..!

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శనివారం ప్లయింగ్ స్క్వాడ్ లు నిర్వహించిన తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.1,00,000/- నగదు పట్టుబడింది. అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.66,500/- ల నగదు సీజ్ చేశారు. జిల్లాలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 27వ తేది వరకు రూ.2,46 కోట్ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.

News April 28, 2024

కర్నూలు: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

రైలు ప్రమాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న ఆదోని ఆర్ఎస్ యార్డు కిమీ 494/3-1 వ‌ద్ద శ‌నివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ కే.గోపాల్ తెలిపిన వివ‌రాల‌ మేర‌కు.. మృతుని వ‌ద్ద ఎలాంటి ఆధారాలు ల‌భ్యం కాలేద‌న్నారు. ఎడ‌మ చేతిపై మామ్‌, డాడ్ అని ప‌చ్చ‌బోట్లు ఉన్నాయ‌ని, మెడ‌లో శ్రీఆంజ‌నేయ‌ స్వామి డాల‌ర్ చైన్ ఉంద‌ని తెలపారు. ఎవరైనా గుర్తిస్తే స‌మాచారం అందించాల‌ని కోరారు.

News April 28, 2024

తాడిపత్రిలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

తాడిపత్రిని పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. నేడు సీఎం జగన్ పర్యటిస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. బందోబస్తును 6 సెక్టార్లుగా విభజించారు. ఒకరోజు ముందే తాడిపత్రికి చేరుకుని తమకు కేటాయించిన స్థానాలలో విధులు చేపట్టారు.

News April 28, 2024

కృష్ణా: వైసీపీలో చేరిన MLA అభ్యర్థి

image

జగ్గయ్యపేట అసెంబ్లీ జై భీమ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కరిసే మధు వైసీపీలో చేరారు. తొర్రగుంటపాలెంలో శనివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో MLA అభ్యర్థి సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు ఉదయభాను మాత్రమే అని అన్నారు.

News April 28, 2024

అల్లూరి: విషాదం.. కూతురి ఇంటికొచ్చి తండ్రి దుర్మరణం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడుగుపల్లి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. శనివారం రాత్రి గడుగుపల్లిలోని కుమార్తె ఇంటికి వచ్చిన వృద్ధుడిని జాతీయ రహదారిపై బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 28, 2024

కాకినాడ: సివిల్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

image

కాకినాడ ఆంధ్రా పేపర్ మిల్‌లో ఓ ఉద్యోగి అనుమానస్పదంగా మృతిచెందాడు. సీఐ వీరయ్యగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..జగన్నాథపురానికి చెందిన విజయ్‌ భార్గవ్‌ (39) పేపర్ మిల్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్థానిక మిల్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. శనివారం ఉద్యోగానికి వెళ్లకపోవడంతో సహోద్యోగి వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. పోలీసులు అక్కడికి చేరుకొని భార్గవ్ మృతి చెందడాన్ని గమనించారు. ఈ మేరకు కేసు నమోదుచేశారు.

News April 28, 2024

నార్పల మండలం వాలంటీర్ సస్పెండ్

image

నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన వాలంటీర్ ఓలయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 81 మంది వాలంటీర్లు, 18 డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, 30 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 8 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు.

News April 28, 2024

ఏపీ సెట్ – 24కు సర్వం సిద్ధం

image

ఏపీ సెట్ – 2024 పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో కాకుటూరులోని వర్సిటీ కళాశాల, జగన్స్ కాలేజీ, కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీ, రావూస్ డిగ్రీ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాల, వీఆర్ ఐపీఎస్ లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సెట్ ప్రాంతీయ సమన్వయకర్త వీరారెడ్డి తెలిపారు. 1767 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.

News April 28, 2024

పెదకూరపాడులో నీటి గుంతలో దిగి చిన్నారులు మృతి

image

పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో శనివారం ఇద్దరు చిన్నారులు నీటి గుంతలతో దిగి మృత్యువాత పడ్డారు. వేణుగోపాల్‌ (11), ధనుష్‌ (13)లు వేసవి సెలవులు కావడంతో మేనమామ ఊరు కన్నెగండ్లకు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం అల్లిపరవు వాగు వద్ద ఉన్న పొలాలకు నీరు నిల్వ చేసుకోవడానికి తవ్విన గుంతలో ఈతకు దిగారు. గుంతలో మట్టి చేరి ఉండడంతో ఇరుక్కుపోయి ఊపిరి ఆడగా మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 28, 2024

ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ.. హాటెస్ట్ సిటీగా నంద్యాల

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.