India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తీవ్ర కడుపునొప్పితో ఆగస్టు 28న ఓ మహిళ విశాఖ కేజీహెచ్లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చగా.. అబార్షన్కు మందులు వాడారని అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇప్పటివరకు 25లోపే నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

తీవ్ర కడుపునొప్పితో ఆగస్టు 28న ఓ మహిళ విశాఖ కేజీహెచ్లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చగా.. అబార్షన్కు మందులు వాడారని అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇప్పటివరకు 25లోపే నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

విజయనగరం గురజాడ గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం గ్రంథాలయ ప్రతినిధి బీ.లక్ష్మీకి వినతి పత్రం ఇచ్చారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన గ్రంథాలయానికి సుమారు 400 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారని, వసతులు, మరుగుదొడ్లు లేవన్నారు. భవనాలు పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పారు. పరిసరాలు క్లీన్గా లేవన్నారు.

రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (RARS) నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్కు బుధవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx వెబ్ సైట్ చూడాలని సూచించారు.

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ధర్మవరం మండలంలోని నాగులూరు సమీపంలో ఉన్న చీని పంటను పరిశీలించి వ్యవసాయ అధికారులను ఉద్యాన పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా రైతులు తగు సూచనలు పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.

విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, వస్తువుల పంపిణీ వాహనాన్ని కర్నూలు ఎంపీ నాగరాజు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులలో అండగా నిలవాలని కోరారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 261 పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 44 మంది ఏఎస్సైలు, 91 హెడ్ కానిస్టేబుల్, 124 మంది కానిస్టేబుల్స్ను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

నెల్లూరులోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. గణేష్ ఘాట్ లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేందుకు ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీల సభ్యులు సమన్వయంతో పనిచేసి పోలీసులకు సహకరించాలని కోరారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పోస్టుకు న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కోర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.శక్తిమణి ఎంపికయ్యారు. ఈ పోస్ట్కు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఈడీ దీప్తెండు కూడా ఇంటర్వ్యూకి హాజరు కాగా అర్హతులను బట్టి శక్తిమణిని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రస్తుత సీఎండీ అతుల్భట్ నవంబర్లో రిటైర్ అవుతున్నారు.

విజయవాడలో వరద బాధితులకు చేస్తున్న సహాయక చర్యలపై శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ NDEF, వైమానికదళాలతో కలిసి చర్చించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయడంపై పలు సూచనలు చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందజేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.