Andhra Pradesh

News June 18, 2024

రాష్ట్రంలోని ఆలయాల పూర్వవైభవానికి కృషి: మంత్రి ఆనం

image

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాల పూర్వవైభవానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని మంత్రి నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక శతాబ్ధాల చరిత్ర గల ఆలయాలు ఎన్నో ఉన్నాయని, వీటి అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు.

News June 18, 2024

బాపట్ల: హోంగార్డుపై దాడి.. ఇరువురికి ఐదేళ్లు జైలు శిక్ష

image

2013లో బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో హోంగార్డుపై కత్తితో దాడి చేసిన ఘటనలో, ఇరువురికి న్యాయస్థానం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఓ కేసు విషయంలో వారిన అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన హోంగార్డుపై వారు కత్తులతో దాడి చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వాణికుమారి వారికి శిక్ష విధించినట్లు తెలిపారు.

News June 18, 2024

నగరి: శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దు: గాలి భానుప్రకాశ్

image

తనని కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దని నగరి  ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం, శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు దీనిని విన్నపంగా భావించాలని తెలిపారు.

News June 18, 2024

కోనసీమ: చేపల వేటకెళ్లి సముద్రంలో గల్లంతు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వాసి సముద్రంలో గల్లంతయ్యాడు. పెమ్మాడి కాయరాజు(33) సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, పడవలో నుంచి జారిపడి మునిగిపోయినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. మంగళవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన మత్స్యకారులతో కలిసి కాయరాజు వేటకు బయలుదేరి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ పడవలో నుంచి జారి పడినట్లు వారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు వివరించారు.

News June 18, 2024

గంజాయి రవాణా నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్: డీసీపీ సత్తిబాబు

image

హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

News June 18, 2024

శ్రీకాకుళం: బీపీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ నాల్గవ సెమిస్టర్ (రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/లో చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 18, 2024

జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎస్పీ సతీష్ కుమార్

image

ఎన్నికల ముగిసి నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది గ్రామాలలో ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెలవారి క్రైమ్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో సమస్యలు రాకుండా విధి నిర్వహణ కలిగి ఉండాలని జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.

News June 18, 2024

గంజాయి రవాణా నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్: డీసీపీ సత్తిబాబు

image

హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

News June 18, 2024

సీఎం చంద్రబాబుతో సుగవాసి భేటీ

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం మంగళవారం ఉండవల్లిలో భేటీ అయ్యారు. రాజంపేట నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను చంద్రబాబుకు సుగవాసి వివరించారు. రాజంపేటను జిల్లా చేయడం, మెడికల్ కాలేజ్, అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News June 18, 2024

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను కలిసిన జిల్లా అధికారులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను సత్యసాయి జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డితో పాటు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం సత్యసాయి జిల్లా పరిస్థితులపై చర్చించారు.