Andhra Pradesh

News April 25, 2024

CM పర్యటన నేపథ్యంలో పులివెందులలో ట్రాఫిక్ ఆంక్షలు

image

CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్‌‌లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్‌కు వెళ్తాయన్నారు.

News April 25, 2024

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్‌గా జై కాంత్

image

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ల బృందంలో జిల్లాకు చెందిన ఎస్.జై కాంత్‌ను నియమించినట్లు YCP కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొంది. క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాలు ఎలక్షన్ నిబంధనలో వ్యవహరించాల్సిన తీరును కోఆర్డినేటర్లు పరీక్షిస్తారని తెలిపింది. ఈ బృందంలో ఐదుగురు రాష్ట్రస్థాయి సభ్యులు ఉన్నారు.

News April 25, 2024

కంట్రోల్ రూమ్‌లు పరిశీలించిన కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బుధవారం పరిశీలించారు. అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News April 25, 2024

హిందూపురం పార్లమెంటు నుంచి 6 నామినేషన్లు: కలెక్టర్

image

హిందూపురం పార్లమెంటు నుంచి బుధవారం ఆరుగురు నామినేషన్లు వేసినట్టు సత్యసాయి జిల్లా రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. ఆర్ఎస్పీ పార్టీ నుంచి ఏ.శ్రీనివాసులు, నేషనల్ నవ క్రాంతి నుంచి ధనుంజయ బూదిలి, స్వతంత్ర అభ్యర్థిగా కుల్లాయప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి షాహిన్, వైసీపీ నుంచి శాంత, బీఎస్పీ నుంచి భాగ్య నామినేషన్లు వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

VZM: ఎన్నికల ఎఫెక్ట్… గంట గంటకు ఫోన్ కాల్స్..!

image

విజయనగరం జిల్లాలో ఎన్నికల హీట్ పెరిగింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థుల ఎంపిక మొదలు.. ఎలక్షన్ ప్రచారం వరుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఐవీఆర్ఎస్ ద్వారా ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గంట గంటకు ఆయా పార్టీలకు మద్దతు కోరుతూ ప్రజలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తరుచూ వస్తున్న ఫోన్ కాల్స్‌తో విసుగెత్తిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.

News April 25, 2024

పాడేరు: గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 3 బాలికలు, 5 బాలుర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని పీవో అభిషేక్ సూచించారు. 2024 సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.

News April 25, 2024

గుంటూరు: జిల్లాలో ఎన్నికల పరిశీలకుల పర్యటన 

image

ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజాన్ సింగ్ బుధవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాకు విచ్చేసిన వారికి కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ఆరా తీశారు. 

News April 25, 2024

విజయవాడ పోలీస్ కమీషనర్‌గా రామకృష్ణ నియామకం

image

విజయవాడ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలలోపు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న కాంతి రానా టాటాను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

News April 25, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

*టెక్కలి: ముగిసిన సీఎం జగన్ బస్సుయాత్ర
*ఆమదాలవలస: తమ్మినేనికి రోజులు దగ్గరపడ్డాయి: చంద్రబాబు
*జలుమూరు: శ్రీముఖలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
*పాతపట్నం: నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న కలమట
*పాలకొండ: రిటర్నింగ్ ఆఫీసర్‌గా శుభం బన్సాల్
*శ్రీకాకుళం: ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్
*ఎల్.ఎన్.పేట: ఈదురు గాలులతో వర్షం
*ఎచ్చెర్ల: ఆలయంలో 30 తులాల బంగారం చోరీ
శ్రీకాకుళం:ఆదిత్యుని సన్నిధిలో కూచిపూడి

News April 25, 2024

26న స్క్రూటినీ ప్రక్రియకు హాజరు అవ్వండి: జేసీ

image

ఈ నెల 26న జరిగే నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియకు రాజకీయ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలని పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!