India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కె.కోటపాడు మండలం బొట్టవానిపాలెం గ్రామ సమీపంలో ఓ కళాశాలలో చదువుతున్న నేపాల్కు చెందిన విద్యార్థి జీవన్ మగర్(23) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. సోమవారం విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.కోటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తనను కలవడానికి వచ్చే వారు శాలువాలు, పూలదండలు, బొకేలు తీసుకురావొద్దని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో ఎవరైనా ఏదైనా తీసుకురావాలనుకుంటే.. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు తీసుకొస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ద్వారకాతిరుమల మండలం దొరసానివాడు గ్రామానికి చెందిన సంజయ్ కుమార్(24) ఓ పాఠశాల బస్సు డ్రైవర్. ఐదేళ్ల క్రితం నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన తేజాను లవ్మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఆదివారం తమ కుమార్తె పుట్టినరోజు కావడంతో పోతవరం వెళ్లి వేడుకలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రివేళ ఇంట్లో కొత్త బల్బ్ పెడుతుండగా సంజయ్ షాక్కు గురై చనిపోయాడు. కాగా తేజ ప్రస్తుతం గర్భిణి.

విజయవాడ రైల్వే డివిజన్లోని పలుచోట్ల ట్రాక్పనులు చేపడుతున్నందున ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్నిరైళ్లను రామవరప్పాడు వరకు నడపనున్నట్లు చెప్పారు. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే డెమో రైలును రామవరప్పాడు వరకే నడపుతామన్నారు. ఆ రైలు తిరిగి రాత్రి 8 గంటలకు రామవరప్పాడులో బయల్దేరి అర్ధరాత్రి 12గంటలకు నరసాపురం చేరుతుందన్నారు

మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

మాజీ మంత్రి జోగి రమేశ్ కంకిపాడు గ్రామంలోకి రావద్దంటూ ఆ గ్రామ బస్టాండ్ వద్ద భారీ బ్యానర్ వెలిసింది. పవన్ కళ్యాణ్ను పదే పదే వ్యక్తిగతంగా విమర్శించిన ఆయన్ను కంకిపాడులో ఏ కార్యక్రమానికీ ఆహ్వానించొద్దంటూ దానిపై రాశారు. ఆయన హాజరైతే తదుపరి పరిణామాలకు వైసీపీ వారే బాధ్యులు అని రాయడం కలకలం రేపింది. బ్యానర్ ఏర్పాటు వివాదాస్పదం కావడంతో పోలీసులు ఆ బ్యానరును తొలగించారు.

విశాఖ పోర్టు అథారిటీ ప్రపంచ ర్యాంకింగ్ లో ఉత్తమ స్థానానికి చేరుకుందని పోర్టు చైర్మన్ అంగముత్తు ఒక ప్రకటనలో తెలిపారు. 2023 సంవత్సరానికి 62.29 ఇండెక్స్ పాయింట్లతో ప్రపంచ ర్యాంకింగ్ లో 20వ స్థానం, కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికలో 19వ స్థానంలో నిలిచిందన్నారు. పని సామర్థ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతిక అంశాలు అమలులో పోర్టు అద్భుత పనితీరు చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఓబుళదేవరచెరువు మండలం చౌడంపల్లిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ వంశీకృష్ణ వివరాలు..యువతి ఇంట్లో తరచూ ఫోన్లో మాట్లాతుండగా తల్లిదండ్రులు దండించారు. దీంతో ఆమె ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. వెతికినా కనబడలేదన్నారు. సోమవారం గ్రామ సమీపంలోని చెక్డ్యాం వద్ద యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

కడపలో సోమవారం తొలిసారిగా MLAలు సోమవారం సమావేశమయ్యారు. అక్రమార్కుల పనిపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో అంటకాగిన అధికారుల భరతం పట్టాలని, దీనిలో ఎలాంటి మినహాయింపులు లేవనే అభిప్రాయానికి వచ్చారు. జిల్లా TDP శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన R&Bలో చర్చించారు. దీనికి కమలాపురం MLA పుత్తా హాజరుకాలేదు. అయిదేళ్లు కార్యకర్తలను వేధించిన వారిని గుర్తించి తీవ్రవను బట్టి సస్పండ్ చేయించాలని అభిప్రాయానికి వచ్చారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఏఎన్ఎంల నియామకం ఫైల్పై తొలి సంతకం చేశారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తానని, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు. మాతాశిశు మరణాలు నియంత్రణ చేస్తానని, కక్ష సాధించనని , త్రికరణ శుద్ధితో ప్రజల కోసం పని చేస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.