Andhra Pradesh

News April 27, 2024

పుంగనూరు: మోసగించిన యువకుడి అరెస్ట్

image

పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యంకు చెందిన ఎం.క్రిష్ణప్ప కుమారుడు మహేంద్ర (23) ఓ  బాలికను ప్రేమిస్తున్నట్లు నటించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాఘవరెడ్డి పేర్కొన్నారు.

News April 27, 2024

అనంత: RDT సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు RDT సెట్‌ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్ జి.మోహన్‌ మురళి తెలిపారు. 10వ తరగతిలో 500 మార్కులుపైన సాధించిన విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ RDT భరిస్తుందన్నారు. మే 4 నుంచి 10వ తేదీలోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వివరాల కోసం సంప్రదించాలని కోరారు.

News April 27, 2024

నెల్లూరులో ఒకే రోజు బావబామ్మర్దుల ప్రచారం

image

సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా శనివారం నెల్లూరు జిల్లాలో ఇద్దరు ప్రముఖుల ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నారా చంద్రబాబు ఎన్నికల ప్రజాగళం సభలు నిర్వహిస్తుండగా, వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ రోడ్ షో జరగనుంది.

News April 27, 2024

శ్రీకాకుళం: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

image

శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05కి తిరుపతిలో (07440) బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం (07441) రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.

News April 27, 2024

కడప: బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

image

బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తిప్పిరెడ్డిపల్లెకు చెందిన శ్రీవాణి భర్త కృష్ణారెడ్డితో కలిసి ఆళ్లగడ్డలో శుభాకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని ఏవీ గోడౌన్స్ వద్ద వీరు వెళుతున్న బైక్‌ను ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీవాణి అక్కడికక్కడే మృతిచెందింది.

News April 27, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథికి తప్పిన ప్రమాదం

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నుంచి మడకశిరకు ఆయన కారులో వెళుతుండగా చెన్నేకొత్తపల్లి వద్ద ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పార్థసారథి సురక్షితంగా బయటపడ్డారు. ఐచర్ డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని కారులో ఉన్న వారు తెలిపారు.

News April 27, 2024

ఆళ్లగడ్డ: బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

image

బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన శ్రీవాణి తన భర్త కృష్ణారెడ్డితో కలిసి ఆళ్లగడ్డలో శుభాకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని ఏవీ గోడౌన్స్ వద్ద వెళుతన్న బైక్‌ను ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో శ్రీవాణి అక్కడికక్కడే మృతిచెందింది.

News April 27, 2024

విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు రాజీనామా

image

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఆయన అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. కాంగ్రెస్ పార్టీతో ఏ సంబంధం లేని వారికి టిక్కెట్లు ఇవ్వడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానన్నారు. ఆయన భవిష్యత్తు నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

News April 27, 2024

నెల్లూరు : కోటంరెడ్డి ఇంటికి బాలకృష్ణ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆదిత్య నగర్ లోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం బాలకృష్ణను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రాజకీయాలపై చర్చించారు.

News April 27, 2024

ఆత్మకూరు: బాలింత మృతిపై వివాదం

image

ఆత్మకూరు వైద్యశాలలో బాలింత మృతిపై వివాదం నెలకొంది. అనంతసాగరం మండలం రేవూరుకి చెందిన భవాని రెండో కాన్పు కోసం రెండు రోజుల క్రితం వైద్యశాలలో చేరారు. శుక్రవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి నొప్పులు అధికంగా ఉన్నాయనడంలో వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చారు. ఒక్కసారిగా పెదవి పక్కకు లాగి నూరుగు వచ్చింది. అత్యవసర వార్డుకు తరలించి సేవలందించారు. అయినా యువతి కోలుకోలేక మృతి చెందింది.