India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం. ఎస్ రాజుపై మెుత్తం 47 కేసులు నమోదైనట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. చరాస్తుల విలువ ఎం. ఎస్ రాజుపై రూ.1,29,218, అతని భార్యపై రూ.750549 ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు అతనిపై రూ.1.50 లక్షలు, భార్యపై రూ. 2.5 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుపై రూ.2.5 లక్షల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు.
మంగళగిరి అసెంబ్లీకి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇటీవల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. అధికారుల పరిశీలన అనంతరం ఆమోదం లభించింది. ఈయన మంగళగిరితో పాటు పుంగనూరులో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో తనపై 28 కేసులున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, మంగళగిరి నియోజకవర్గానికి 76 నామినేషన్లు దాఖలు కాగా, 71 ఆమోదం పొందాయి.
బీపీఈడీ, డీపీఈడీ విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం మే 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థినీ, విద్యార్థులు రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాలు కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం అత్యధికంగా బొమ్మనహల్ మండలంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రేకులకుంట పరిశోధన స్థానం శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు అదేవిధంగా యల్లనూరు, తాడిపత్రి, 43.3, గుంతకల్, తాడిపత్రి,43.1, శింగనమల, చెన్నేకొత్త పల్లి,43.0, పరిగి 42.9, పుట్టపర్తి 42.9, ముదిగుబ్బ 42.8, యాడికి 42.5 నమోదైనట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంలో సినీ హీరో వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి ఆయన బయలుదేరి వెళ్లారు.
మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నపోతేపల్లి గ్రామానికి చెందిన యువకుడు పుప్పాల గణేశ్ మట్టి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం పోతేపల్లి నుంచి మట్టి లోడ్ చేసుకుని వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 18,75,934 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత 26,180 మంది కొత్తగా చేరారు. డబుల్ ఎంట్రీ, మరణించారు ఇలా 10,156 మంది ఓటర్లను తొలగించారు. జిల్లాలో పురుషులు 9,29,859, మహిళలు 9,45,945, ఇతరులు 130 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 2,73,260 మంది, అత్యల్పంగా ఆమదాలవలసలో 1,93,858 మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి జారీ చేసిన కూపన్లకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన ఎన్ఏడి జంక్షన్లో గల పెట్రోల్ బంక్ లైసెన్స్ను తాత్కాలింగా రద్దు చేసినట్లు విశాఖ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ తీసుకున్న 860 మంది వాహనదారులపై కూడా కేసులు నమోదు చేయాలని జేసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కోనసీమ జిల్లావ్యాప్తంగా ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 31 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో 21 నామినేషన్లు వేయగా 16 , ఏడు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 130 నామినేషన్లు దాఖలు చేయగా 104 నామినేషన్లు ఆమోదించామని తెలిపారు.
తూ.గో జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఇందులో రాజమండ్రి అర్బన్ లో 13 నామినేషన్లు వేస్తే 2, రాజమండ్రి గ్రామీణంలో 14 వేస్తే 7, రాజానగరంలో 18 కి 4, కొవ్వూరులో 14 కి 2, గోపాలపురంలో 15 కు 4, నిడదవోలులో 16 కు 3, అనపర్తిలో 24 నామినేషన్లు వేస్తే 15 నామినేషన్లు తిరస్కరించారు.
Sorry, no posts matched your criteria.