Andhra Pradesh

News April 25, 2024

మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేదు: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుత వేసవిలో మంచినీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డికి తెలిపారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ప్రస్తుతం వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 25, 2024

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: SP వకుల్

image

ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్.ఎస్.టి బృందాలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఎస్.ఎస్.టి బృందాలు సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలన్నారు. అక్రమంగా మద్యం, నగదు ఇతర వస్తువుల రవాణాను కట్టడి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక

image

సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన కలెక్టర్ అనంతరం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై కొద్దిసేపు వివరించారు.

News April 25, 2024

39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్‌కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.

News April 25, 2024

సార్వత్రిక ఎన్నికల్లో 100% పోలింగ్ సాధించాలి: విశాఖ జేసీ

image

సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యాలను చేసుకోవటంలో అధికార యంత్రాంగానికి, ఓటర్లకు సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఆర్.వో. కె. మయూర్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.

News April 25, 2024

ప.గో.: జోరందుకున్న ప్రచారం.. ఎవరికి ఎన్ని సీట్లు..?

image

ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ పార్టీ నాయకుల ప్రచారం జోరందుకుంది. కూటమి, వైసీపీ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారం చేపడుతూ ముందుకెళ్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 స్థానాలుండగా గత 2019 ఎన్నికల్లో వైసీపీ 13 చోట్ల, టీడీపీ 2చోట్ల విజయం సాధించాయి. మరి ఈ సారి టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు నేపథ్యంలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News April 25, 2024

వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మరు: RRR

image

మంచి మనిషి, సేవాభావం కలిగిన పులివర్తి నాని భగవంతుని ఆశీస్సులతో విజయం సాధించడం ఖాయమని మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు(RRR) అన్నారు. తనపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండి నియోజకవర్గ ఎమ్యెల్యేగా నామినేషన్ వేశానని, ఆనవాయితీగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చానని రఘురామ చెప్పారు. వైసీపీ డ్రామాలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు.

News April 25, 2024

ఏడు గంటల ఆలస్యంగా నడుస్తున్న బెనారస్ రైలు

image

రేపు తెల్లవారుజామున 4.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం – బనారస్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రైలు రాక ఆలస్యం వలన 7 గంటలు ఆలస్యంగా 11.20 గంటలకు విశాఖలో బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీని గమనించి ప్రధానంగా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు.

News April 25, 2024

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి చెందిన సత్తిబాబు (35) మృతదేహం హైవేపై లభ్యమయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ జి. కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సి.బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పోలకల్, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

error: Content is protected !!