Andhra Pradesh

News April 25, 2024

ఎన్నికల్లో పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: విశాఖ కలెక్టర్

image

వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా అందరూ కలిసి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు ప్రాముఖ్యత తెలుసుకొని, ఓటర్ చైతన్యం, హోమో ఓటింగ్ విధానం అంశాలపై ఆయన ఈరోజు ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

News April 25, 2024

పుంగనూరు: వికలాంగురాలిపై అత్యాచారం

image

పుంగనూరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. చౌడేపల్లె మండలం అమినిగుంటలో సోమవారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో మానసిక, శారీరక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News April 25, 2024

ప.గో.: స్నానానికి వెళ్లి 13 ఏళ్ల బాలుడు మృతి

image

దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది. క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ వేసింది వీరే..

image

➤ పలాస: CPI- కామేశ్వరరావు
➤ ఇచ్ఛాపురం: BSP- వేదవర బైసాయి
➤ టెక్కలి: BSP- శ్రీనివాసరావు,
➤శ్రీకాకుళం: PPI-లక్ష్మణ
➤ ఆమదాలవలస: PPI-మధుసూదనరావు
➤ పాతపట్నం:INCP- వెంకట్‌రావు, స్వతంత్ర – మోహనరావు, JBNP- తిరుపతిరావు, కృష్ణ- స్వతంత్ర అభ్యర్థి, GDP- సంజీవరావు
➤ ఎచ్చెర్ల: గొర్లె కిరణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి, రమ్య సువ్వారు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.

News April 25, 2024

తూ.గో.: క్వారీలో స్నానానికి దిగి 13ఏళ్ల బాలుడు మృతి

image

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది.
క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

కర్నూలు: రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం

image

ఆస్పరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోతి సతీశ్(25) స్ఠానిక రైల్వే స్టేషన్ సమీపాన రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 25, 2024

హోం ఓటింగ్ ప్రక్రియ మే 8 లోపు పూర్తి చేయండి: కలెక్టర్

image

మే 5 నుండి 8 తేదీల్లో నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. మంగళవారం పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 24, 2024

ఏలూరు: త్వరలో APCC చీఫ్ షర్మిల బస్సుయాత్ర

image

ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి మరో 2 రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో బస్సుయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు.

News April 24, 2024

నెల్లూరు: బాలికపై అత్యాచారయత్నం

image

నెల్లూరు జిల్లా అల్లూరు మండల పరిధిలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. ఫొటో తీసుకోవాలంటూ ఓ పీఈటీ టీచర్ పదో తరగతి పాసైన బాలికను పాఠశాలకు పిలిపించాడు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారం చేయబోయాడు. ఆమె భయంతో ఇంటికి పరుగులు తీసింది. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. సదరు టీచర్‌కి స్థానిక యువకులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.
NOTE: బాధితురాలి వివరాలు తెలిసేలా వివరాలు ఇవ్వడం నేరం

News April 24, 2024

ప్రత్తిపాటి పుల్లారావు ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: చిలకలూరిపేట
 ➤ అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP)
 ➤ భార్య: వెంకాయమ్మ
 ➤ విద్యార్హతలు: B.COM
 ➤ చరాస్తి విలువ: రూ.32.33కోట్లు
 ➤ భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు
 ➤ కేసులు: 13
 ➤ అప్పులు: రూ.22.72కోట్లు
 ➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1,55,011
 ➤ బంగారం: 409.8గ్రాములు, భార్యకు 323.5గ్రాముల బంగారం
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

error: Content is protected !!