Andhra Pradesh

News June 17, 2024

150000 సీడ్ బాల్స్ తయారు చేసిన కుందుర్పి పాఠశాల పిల్లలు

image

కుందుర్పి మండలంలోని విలువల బడుల పిల్లలు 150000 సీడ్ బాల్స్ స్వయంగా చేసి నాటారు. దీనికంతటికి స్ఫూర్తి విలువల బడుల అధ్యాపకులు అవచ్చన్నారు ప్రస్తుత సమాజంలో మన వ్యవస్థలు చేయలేనీ పని మన కుందుర్పి మండలం విలువల బడుల పిల్లలు చేసి చూపించవచ్చని అధ్యాకులు లెనిన్ తెలిపారు. ఈ పిల్లలు తయారు చేసిన సీడ్ బాల్స్ మరో 3 సంవత్సరాల్లో చెట్లుగా అవ్వడం చూడవచ్చని అధ్యాపకులు పేర్కొన్నారు.

News June 17, 2024

తూ.గో: అమ్మలకు తప్పని కడుపు కోతలు

image

నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనబడట్లేదు. తూ.గో జిల్లాలో 100 ప్రసవాల్లో 70 సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
➤ 2023-24లో మొత్తం 23,673 ప్రసవాల్లో 11,944 ఆపరేషన్లే. మాతృమరణాలు-14
☞ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,269 మంది ప్రసవిస్తే.. 3,527 మందికి సిజేరియన్లే
☞ ప్రైవేట్‌లో 16,404 ప్రసవాలు జరిగితే.. 8,417 మందికి కడుపు కోతే.

News June 17, 2024

నెల్లూరు GGHలో మరోసారి పాము కలకలం

image

నెల్లూరు జిల్లా కేంద్రం  జిజిహెచ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. జిజిహెచ్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా చెట్ల మాటున దాగి ఉన్న పాము ఒక్కసారిగా రత్నమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలిపై కాటు వేసింది. దీంతో వైద్య నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాగే పనులు చేస్తుండగా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు పాముకాటుకు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

News June 17, 2024

బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఘర్షణ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

News June 17, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి

image

రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా నియమితులైన సాలూరు, MLA గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదట అంతస్థులో వేద పండితులు పూజలు నిర్వహించగా రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ బాధ్యతలు స్వీకారాన్ని స్వయంగా చూడటానికి సాలూరు నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

News June 17, 2024

రాతియుగం పోయి స్వర్ణ యుగం వచ్చింది: పయ్యావుల కేశవ్

image

అనంతపురం జిల్లాకు చేరుకున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణీ శ్రీ, అమిలినేని సురేంద్రబాబు, అస్మిత్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. వైసీపీ రాతి యుగానికి ముగింపు పలికి కూటమి ప్రభుత్వం స్వర్ణ యుగానికి నాంది పలికిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News June 17, 2024

TTD ఛైర్మన్ పదవి ఎవరికో..?

image

వైసీపీ ఓటమితో ఎన్నికల ఫలితాల రోజే టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో కీలకమైన ఈ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నేతలు పోటీపడుతున్నారు. ముందుగా నాగబాబుకు ఛైర్మన్ పదవి ఖరారైందని వార్తలు రాగా ఆయన దీనిని ఖండించారు. ఓ టీవీ అధినేత, నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు పదవి ఎవరి దక్కుతుందో చూడాలి మరి.

News June 17, 2024

కోటబొమ్మాళి: మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన వివరాలు

image

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 18వ తేదీ మంగళవారం నాటి పర్యటన వివరాలను కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా స్థాయి అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 12 గంటల నుంచి కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటారు.

News June 17, 2024

హోం మంత్రి అనిత స్వీట్ వార్నింగ్

image

కొంతమంది పోలీసు అధికారులు YCP ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేశారని <<13455722>>హోం మంత్రి<<>> అనిత విమర్శించారు. వారిలో ఇప్పటికీ వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమన్న ఆమె.. సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News June 17, 2024

కడప జిల్లా వాసుల కారుపై పెద్దపులి దాడి

image

కడప జిల్లా బద్వేలు వాసులు నెల్లూరుకు వెళ్తుండగా కారుపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తుండగా సోమవారం పులి దాడి చేసింది. ఇందులో కారు కొంత దూరం పులిని ఈడ్చుకెళ్లగా పులికి గాయాలయైనట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పులి సమీప అడవిలోకి వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.