Andhra Pradesh

News June 17, 2024

తాడిపత్రి హత్య ఘటనపై స్పందించిన నారా లోకేశ్

image

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన లాల్‌స్వామి అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబాడి సహనంగా ఉన్నామని పేర్కొన్నారు.

News June 17, 2024

VZM: రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వ్యక్తి

image

రైలు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన గోలజాపు పెంటయ్య(60) రెండు కాళ్లను కోల్పోయారు. బహిర్భూమికి వెళ్లి రైలు పట్టాలు దాటుతుండగా కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్-1 చివరలో విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుడికి రెండు కాళ్ళు ఛిద్రమయ్యాయి. వెంటనే 108కి ఫోన్ చేసి క్షతగాత్రుడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు ఆర్పీఫ్ ఎస్సై ఆర్.హసిధ, ఏఎస్ఐ ఎ.ధర్మారావు తెలిపారు.

News June 17, 2024

విధేయతకే పట్టం

image

అత్యధిక మెజార్టీతో గెలిచి అందరినీ ఆకర్షించిన గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు ఇకపై ఏపీ TDP బాధ్యతలు మోయనున్నారు. YCP ప్రభుత్వంలో అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలిచారు. పార్టీ మారాలని ఒత్తిడి వచ్చినప్పటికీ TDPలోనే కొనసాగి విధేయతను చాటుకున్నారు. 7రోజులు ఆమరణదీక్ష చేసి స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి ఊపు తెచ్చిన పల్లా.. గాజువాక హౌస్ కమిటీ భూములు, అగనంపూడి టోల్ గేట్ సమస్యపై పోరాడారు.

News June 17, 2024

విజయవాడలో మాజీ కార్పొరేటర్ అర్ధనగ్న ప్రదర్శన

image

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ దళిత నాయకుడినైన తనపై, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గూండా గిరి చేస్తున్నారని YCP మాజీ కార్పొరేటర్ నందెపు జగదీశ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో YCP తరఫున ప్రచారం చేశాననే కోపంతో తనకు చెందిన భవనాన్ని బోండా ఉమా అనుచరులు JCBతో కూల్చేశారన్నారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన తాను కూల్చిన భవనం వద్ద <<13456099>>శిరోముండనం చేయించుకుని<<>> అర్ధ నగ్నంగా నిరసన తెలిపానన్నారు.

News June 17, 2024

నెల్లూరు: కారుపై పెద్దపులి దాడి

image

నెల్లూరు జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తున్న కారుపై సోమవారం ఉదయం పులి దాడి చేసింది. ఒక్కసారిగా రోడ్డుపైకి పులి రావడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

News June 17, 2024

అనంత: బిల్డింగ్ నుంచి దూకి యువకుడి సూసైడ్

image

బిల్డింగ్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ జరిగింది. పోలీసులు వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. పరీక్ష రాసి ఆదివారం ఫ్రెండ్స్‌తో కలిసి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్‌‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇవాళ హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News June 17, 2024

రేపు వైద్యారోగ్యశాఖ మంత్రి అనంతపురానికి రాక

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ ఈనెల 18వ తేదీన అనంతపురం రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వై.సత్య కుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా అనంతపురం రానున్న నేపథ్యంలో సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News June 17, 2024

కోనసీమ: దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి పల్లెపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ సంఘటనపై బాలిక తండ్రి 16వ తేదీ (ఆదివారం) రాత్రి ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సంపత్ కుమార్ తెలిపారు.

News June 17, 2024

పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం: మంత్రి

image

వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం. అక్రమ సంపాదన కోసం పాలు, ఇసుక, మద్యం, ఎర్రచందనం దేన్నీ ఆయన ఫ్యామిలీ వదల్లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అనుమతులు లేకుండా రూ.700 కోట్లతో రిజర్వాయర్ కట్టారు. అక్కడ రైతుల భూములు లాగేసుకున్నారు’ అని ఆయన ఆరోపించారు.

News June 17, 2024

కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ రాక..!

image

కడప జిల్లాకు మంగళవారం మాజీ సీఎం జగన్ రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ తొలిసారి సొంత జిల్లాకు రానున్నారు. మంగళవారం నుంచి నాలుగు లేదా ఐదు రోజులు పాటు ఇడుపులపాయ, కడప జిల్లాలో ఉండి కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.