Andhra Pradesh

News April 27, 2024

సత్యవేడు: మాజీ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ

image

సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత నామినేషన్ శుక్రవారం తిరస్కరణకు గురి అయింది. ఆమె టీడీపీ తరఫున ఒక సెట్టు నామినేషన్ వేశారు. పార్టీ బీఫామ్ సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

News April 27, 2024

స్వతంత్ర అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణ

image

మంగళగిరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట ఎన్నికల ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. కాగా లావణ్య నేరుగా కాకుండా తన తరపు వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేశారు. దీనితో శుక్రవారం నామినేషన్ పత్రాల పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. మంగళగిరిలో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

News April 27, 2024

శ్రీ సత్యసాయి: అనుమానంతో భార్యను చంపిన భర్త

image

పుట్టపర్తి రూరల్ మండలం వెంగళమ్మ చెరువులో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. ఈడిగ పవన్ వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఇటీవల రాజీనామా చేశాడు. భార్య త్రివేణి(25) ఇంటి వద్ద ఉంటూ పిల్లలను చూసుకునేవారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 27, 2024

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు తిరస్కరణ

image

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు సక్రమంగా లేని 41 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కావలి నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించారు. కోవూరులో 9, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 8, ఉదయగిరిలో ఆరు సర్వేపల్లిలో నాలుగు, ఆత్మకూరులో రెండు, కందుకూరు, నెల్లూరు రూరల్‌లో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.

News April 27, 2024

నేడు జిల్లాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాక: కలెక్టర్ షణ్మోహన్

image

జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా నేడు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ భట్టి చిత్తూరుకు రానున్నారని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. జిల్లా నూతన ప్రధాన న్యాయస్థాన భవన సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

News April 27, 2024

కర్నూలు: 13 మంది నామినేషన్ల తిరస్కరణ

image

కర్నూలు అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినీలో 13 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పేర్కొన్నారు. 40 మంది అభ్యర్థుల నుంచి అందుకున్న 56 నామినేషన్ల పత్రాలను పరిశీలించామన్నారు. సవ్యంగా పత్రాలు సమర్పించిన 27 మంది అభ్యర్థుల సభ్యత్వాన్ని ఆమోదించామన్నారు. లోపాలు ఉన్న 13 మంది అభ్యర్థుల సభ్యత్వాన్ని తిరస్కరించామని తెలిపారు.

News April 27, 2024

శ్రీకాకుళం అసెంబ్లీకి నుంచి ఒక నామినేషన్ తిరస్కరణ

image

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి సీ.హెచ్ రంగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ నామినేషన్ పరిశీలనలో ఒక నామినేషన్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో మొత్తం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించగా.. ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

News April 27, 2024

ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని పెనుకొండ ఆర్డీటీ కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రస్తుతం పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద, గ్రామీణ, ప్రతిభావంతులైన విద్యార్థులు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు, 4 ఫొటోలు తీసుకుని మండల పరిధిలోని ఆర్డీటీ ఆఫీసులో మే 4వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

News April 27, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్.కొంతలపాడు, తొలిశాపురం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి ఆరా తీశారు.

News April 27, 2024

ప్రకాశం: రూ.20 లక్షలు స్వాధీనం

image

జిల్లాలోని పుల్లలచెరువు మండలం మల్లపాలెం చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఒంగోలుకు కారులో తీసుకెళ్తున్న అజీజ్ అనే వ్యక్తి నుంచి ఆ డబ్బును గుర్తించి, సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రూ.50 వేలకు మించి డబ్బులు ఉంటే సరైన పత్రాలు చూపించాలన్నారు.