Andhra Pradesh

News April 26, 2024

రేణిగుంట: గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

image

జిల్లాలో ఒక్క రోజు పర్యటనను ముగించుకున్న ఏపీ గవర్నర్ ఎస్.నజీర్ శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

News April 26, 2024

గుంటూరు: టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా  

image

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు శుక్రవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు స్వయంగా ఆయనకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట పలువురు టీడీపీలోకి చేరారు. డొక్కా ఆశించిన తాడికొండ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరినట్లు సమాచారం. 

News April 26, 2024

కొండపి: ఒకే రోజు అటు జగన్, ఇటు బాలకృష్ణ

image

కొండపి నియోజకవర్గంలో ఒకే రోజు సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న మర్రిపూడిలోని బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అదేరోజు కొండపిలో సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇద్దరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News April 26, 2024

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక

image

ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టీడీపీ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. ఆమెను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 2019, 2021 ఉప ఎన్నికలో ఆమె టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు లేదా తన భర్తకు ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఆశించారు. ఇవేమీ దక్కకపోవడంతో పార్టీ పదవి కట్టబెట్టారు.

News April 26, 2024

విశాఖ: 33 ఎంపీ నామినేషన్లకు ఆమోదం: కలెక్టర్

image

విశాఖ ఎంపీ స్థానానికి 39 నామినేషన్ పత్రాలు దాఖలు కాగా 33 పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున ఆమోదం తెలిపారు. అర్హత లేని ఐదు నామినేషన్ పత్రాలు తిరస్కరించారు. ఒకదానిపై విచారణకు ఆదేశించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పరిశీలన ప్రక్రియ నిర్వహించారు.

News April 26, 2024

కర్నూలు అసెంబ్లీ బరిలో 27 మంది అభ్యర్థులు

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం జరిగిన నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ ముగిసిందని రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. మొత్తం 40 నామినేషన్లు పరిశీలించగా.. అందులో 13 నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ప్రకటించారు. 27 మంది అభ్యర్థుల నామినేషన్లను అనుమతించామని ప్రకటించారు.

News April 26, 2024

JEE మెయిన్స్.. కోనసీమ విద్యార్థికి ఆలిండియా RANK

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ గారపాటి త్రిమూర్తులు కుమారుడు వీరసత్య సంతోష్‌ JEE మెయిన్స్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 368 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు. ఈ మేరకు విద్యార్థిని గ్రామ సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభినందించారు.

News April 26, 2024

నరసరావుపేట: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

image

పల్నాడు జిల్లాలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 1, 239 మంది హాజరుకాగా, 412 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 33.25% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 2,720 మంది విద్యార్థులు హాజరు కాగా, 1, 549 ఉత్తీర్ణత సాధించారన్నారు. 56.95% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

News April 26, 2024

రాజోలు: ప్రత్యేక ఆకర్షణగా జనసేన వీర మహిళలు

image

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో జనసేన వీరమహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారంతా తెలుపు రంగు చీరపై జనసేన గాజుగ్లాస్ గుర్తు, ఎన్నికల చిహ్నం కలిగిన చీరలు కట్టుకొని ఆకట్టుకొన్నారు.

News April 26, 2024

కడప MP బరిలో 14 మంది ఆశావాహులు

image

కడప నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ నుంచి అవినాశ్, కూటమి నుంచి భూపేశ్, కాంగ్రెస్ నుంచి షర్మిలతో ఇతర పార్టీలకు చెందిన 11 మంది బరిలో నిలిచారు. మరోవైపు ముగ్గురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మొత్తం 32 మంది పోటీ పడగా 18 మంది నానినేషన్లు తిరస్కరించారు.