India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంత్రులతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్రెడ్డిని కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని కలిసి తణుకు నియోజకవర్గానికి సంబంధించి రానున్న రోజుల్లో యూరియా అవసరాలపై చర్చించారు.

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. గంట్యాడ మండలం రాచకిండాంలో వరి పొలాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తదుపరి బొండపల్లి మండలంలోని రైతు సేవా కేంద్రం, రైస్ మిల్లును సందర్శిస్తారు. మధ్యాహ్నం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం డెంకాడ, భోగాపురం మండలాల్లో రైతు సేవా కేంద్రాలు, పొలాలు, ఎంఎల్ఎస్ పాయింట్ను తనిఖీ చేస్తారు.

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నచికేత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.

విజయనగరం నగరపాలక పరిధి ధర్మపురిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు జరిగింది. ఈ ప్రమాదంలో గుర్ల మండలం నాగలవలస గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 179 అర్జీలు, రెవెన్యూ క్లినికల్ 86 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందే సౌకర్యాన్ని వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో అందుబాటులోకి తెచ్చినట్లు డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 95523 00009 నంబర్కు వాట్సాప్లో ‘Hi’ పంపి Police Services – Download FIR ఎంపిక ద్వారా FIR డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని వినతులు స్వీకరించారు. రెవెన్యూ ఫైళ్లను తిరస్కరించే సమయంలో సరైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలనే విధంగా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

వింజమూరు ఎంపీపీ ఎంపిక గందర గోళానికి దారితీసింది. వైసీపీ తరఫున ఆరుగురు, టీడీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారు. కోరం జరగకుండా చూడాలని ఊటుకూరు ఎంపీటీసీ గవ్వల మల్లిఖార్జునను వైసీసీ నేతలు కిడ్నాప్ చేశారు. అయితే.. కోరంకు 6 మంది సరిపోవడంతో ఎంపీపీని ఒకరు ప్రతిపాదించగా.. ఇద్దరు బలపరచడంతో ఎంపీపీగా టీడీపీకి చెందిన వన్నెపెంట హైమావతిని ఎన్నుకున్నారు.
Sorry, no posts matched your criteria.