Andhra Pradesh

News April 26, 2024

తొండంగి: ఉరేసుకుని ఇస్రో ఉద్యోగి ఆత్మహత్య

image

తొండంగి మండలం పైడి కొండకు చెందిన కోదండ గంగేశ్వర్ (31) ఉరి వేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో గంగేశ్వర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఎస్పీబీలో విధులు నిర్వహిస్తున్నాడు. సూళ్లూరుపేట షార్ ఉద్యోగుల నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

News April 26, 2024

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

అనంతపురం జిల్లాలో శనివారం పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ జయచంద్ర రెడ్డి తెలిపారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల్లో 8880 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

News April 26, 2024

శ్రీ సత్యసాయి: ఓపెన్‌ పది, ఇంటర్‌ ఫలితాల విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓపెన్‌ పది, ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు జిల్లా పరీక్షల విభాగం ఏడీ లాజర్‌ తెలిపారు. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌లో 1,525మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 888మంది పాసై 58.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసిన 703మంది విద్యార్థుల్లో 249 మంది పాసై 35.42% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వస్థానం సాధించారని తెలిపారు.

News April 26, 2024

ఎర్రగుంట్ల: పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

image

పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.

News April 26, 2024

విశాఖ: మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా మచిలీపట్నం-విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. మచిలీపట్నం- విశాఖపట్నం (17219) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి మే 26 వరకు, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి మే 27 వరకు రద్దు అయినట్లు చెప్పారు.

News April 26, 2024

బుగ్గన హ్యాట్రిక్ కొట్టేనా..?

image

డోన్ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 15సార్లు సాధారణ ఎన్నికలు, రెండుసార్లు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో 8సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ గెలిచింది. 2014,19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై గెలిచారు. ఈసారి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై‌ బుగ్గన గెలిచి హ్యాట్రిక్ కొట్టేనా..? కామెంట్ చేయండి.

News April 26, 2024

ప.గో జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 122 మంది నామినేషన్లు

image

ప.గో.జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గురువారం 67 మంది అభ్యర్థులు 73 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 122 మంది అభ్యర్థులు 206 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు. భీమవరంలో 8 మంది, తాడేపల్లిగూడెంలో 15 మంది , నరసాపురంలో 7, ఆచంటలో 8, తణుకులో 6,  ఉండిలో 10 , పాలకొల్లులో 13 మంది  దాఖలు చేశారు.

News April 26, 2024

పెదకాకానిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పెదకాకానిలో విషాదం చోటు చేసుకుంది. మసీదు సెంటర్ వద్ద షేక్ ముస్తాఫా (35) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద మంచినీరు పట్టేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు డెక్కన్ టుబాకో కంపెనీలో కార్మికుడిగా పని చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు చెప్పారు.

News April 26, 2024

ప.గో: నేడు నామినేషన్లు పరిశీలన

image

ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. శుక్రవారం ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని వాటిని తిరస్కరిస్తారు. 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుంది. మే 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు.

News April 26, 2024

ఎచ్చెర్ల: యోగా పీజీ డిప్లమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్‌నెస్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమా కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత గురువారం తెలిపారు. జూన్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.