India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజోలులోని మలికిపురం కూడలిలో.. 6 గంటలకు ద్రాక్షారామ సుభాష్చంద్రబోస్ కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. 28న జగ్గంపేట, ప్రత్తిపాడు సభల్లో పాల్గొంటారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోనసీమ , కాకినాడ , రాజమండ్రి పార్లమెంటు ఆయా పరిధిలోని 21 అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ పార్లమెంట్లకు 32, రాజమహేంద్రవరం పార్లమెంటు 19, అమలాపురం పార్లమెంటు 21 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21అసెంబ్లీ స్థానాలకు గాను కాకినాడ జిల్లా 170, తూర్పు గోదావరి జిల్లా 114 డా.బి.ఆర్. కోనసీమ జిల్లా 175 నామినేషన్లు దాఖలయ్యాయి .
ఏలూరు నగర శివారు చాటపర్రుకు చెందిన ఈదుపల్లి పవన్ పోతురాజు (28) లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. ఇతను గురువారం లారీలో వెళుతుండగా కొమడవోలు వద్ద వేరే లారీని తప్పించే క్రమంలో ఆ వాహనం డోర్ తగిలి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పోతురాజును సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
యర్రగొండపాలెంలో టీ కొట్టు యజమాని శ్రీను త్రిపురాంతకం రోడ్ సెంటర్లో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగ్గా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను పరిశీస్తున్నారు. ఆ ప్రదేశంలో అచ్చు బొమ్మ ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 30వ తేదీ మైదుకూరులో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కాగా గురువారం పులివెందులలో జగన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనకు YCP శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జగన్ సొంత ఇలాఖాలో మరోసారి పూర్తి పట్టు సాధించాలని చూస్తున్నారు. అటు టీడీపీ కూడా ఈసారి కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాపాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం డాన్ గంగిరెడ్డితో మిథున్ రెడ్డి తిరుగుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డు వస్తున్నారని 40 మందిని చంపేశారు. మరికొందరి కాళ్లు, చేతులు నరికేశారు. ఆస్పత్రుల్లో ఇంజెక్షన్లతో చంపేస్తున్నారు. యువత ఎదురు తిరిగితే జగన్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..?’ అని పవన్ ప్రశ్నించారు.
విజయనగరం ఎంపీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. విజయనగరం లోక్ సభ 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టాయి. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలో బరిలో ఉన్నాయి. మరి ఈ సారి సెంటిమెంట్ వర్క్ఔట్ అవుతుందా కామెంట్ చేయండి.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి 21 మంది 36 నామ పత్రాలు సమర్పించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 39 సెట్లు, రూరల్ 28, సర్వేపల్లి 23, కందుకూరు 40, కావలి 43, ఆత్మకూరు 27, ఉదయగిరిలో 41 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ నెల 30న అండర్-19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎంఎల్ఎన్ రాజు తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2005 సెప్టెంబర్ 1 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువపత్రం, గత మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలన్నారు. సంబంధిత తేదీల్లో ఉదయం 6.30 గంటలకు వైట్ డ్రెస్, సొంత కిట్తో హాజరు కావాలని కోరారు.
దశాబ్దాల నుండి ప్రత్తిపాడులో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ సెగ్మెంట్లో మొదట ముద్రగడ కుటంబం హవా కొనసాగగా.. తరువాత పర్వత కుటుంబం ఒక వెలుగు వెలిగింది. తదనంతరం వరుపుల కుటుంబం అధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి సత్యప్రభ బరిలో నిలబడగా, వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఉన్నారు
Sorry, no posts matched your criteria.