Andhra Pradesh

News April 26, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

బుక్కపట్నం మండలం లింగప్ప గారి పల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. అందులో వెంకట నరసా నాయుడు, ప్రభాకర్ మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తి శ్రీరాములు చికిత్స పొందుతున్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 26, 2024

వారం రోజుల్లో 5 సార్లు తనిఖీలు: టీడీపీ

image

తాడికొండ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కారును పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 5 సార్లు తనిఖీ చేశారని చెబుతున్నారు. తాజాగా, గురువారం తాడికొండ అడ్డరోడ్డు వద్ద శ్రావణ్ కుమార్ వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారని మండిపడ్డారు. కాగా, నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

News April 26, 2024

గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆస్తి రూ.284.36కోట్లు

image

గుడివాడ TDP అభ్యర్థి వెనిగండ్ల రాము తన కుటుంబ ఆస్తిని రూ.284.36 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. చరాస్తులు తన పేర రూ.136.24 కోట్లు, భార్య సుకుధకు రూ.72.43 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు తన పేరున రూ.64.74 కోట్లు, భార్య పేరున రూ.10.93 కోట్లు ఉన్నాయి. తనకు రూ.5.62 కోట్లు, తన భార్యకు రూ.10.98 కోట్లు వివిధ బ్యాంకుల్లో లోన్ల రూపంలో అప్పులు ఉన్నట్టు చూపారు.

News April 26, 2024

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ 

image

వేసవి సెలవుల్లో పాఠశాలలు జూనియర్ కళాశాలలు తెరవద్దని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం పేర్కొన్నారు. విద్యా క్యాలెండర్ పక్కాగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, డీవీఈఓ, ఆర్ఐఓలకు ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

News April 26, 2024

బిట్రగుంట: మెము రైళ్లు రద్దు పొడిగింపు

image

పలు మెము రైళ్లు రద్దు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిట్రగుంట-విజయవాడరైలు 29 నుంచి మే 26 వరకు, విజయవాడ-బిట్రగుంట రైలు 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-చెన్నై రైలు 29 నుంచి మే 3 వరకు, మే 6 నుంచి 10 వరకు, 13 నుంచి 17 వరకు, మే 20 నుంచి 24 వరకు రద్దు చేశారు.

News April 26, 2024

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తి వివరాలు

image

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డా. సృజనకు అందజేశారు. బీవై రామయ్య కుటుంబం పేరిట రూ.2.98కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రామయ్యకు అప్పు రూ.30.78లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై అస్పరి పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది ఒక కేసు నమోదైంది.

News April 26, 2024

గతంలో YCP నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి: పెమ్మసాని

image

గతంలో తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని గుంటూరు టీడీపీ MP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 2019లో నరసరావుపేట, గుంటూరు ఎంపీ టికెట్లు.. రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా తాను తిరస్కరించానన్నారు. తన ఐడీయాలజీకి సరిపోని పార్టీ వైసీపీ అని చెప్పారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు తన వల్ల సమాజానికి మేలు జరుగుతుందని టికెట్ ఇచ్చినట్లు వివరించారు.

News April 26, 2024

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. వాలీబాల్‌లో గాలి తగ్గిందని 12 ఏళ్ల బాలుడు ఓ చోటకు వెళ్లాడు. అక్కడ అనికేపల్లికి చెందిన రాజా అనే వ్యక్తి సైకిల్ పంపు ద్వారా బాలుడి మలరంధ్రాల్లో గాలి కొట్టాడు. దీంతో అతని పొట్ట ఉబ్బిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా రాజాపై పోక్సో కేసు నమోదు చేశారు.

News April 26, 2024

ఎచ్చెర్లలో ఒకే పేరు.. అభ్యర్థులు వేరు

image

ఎచ్చెర్లలో వైసీపీ నుంచి గొర్లె కిరణ్‌కుమార్ పోటీ చేస్తుండగా, గొర్లె కిరణ్‌కుమార్ అనే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కూటమి తరఫున నడుకుదిటి ఈశ్వరావు ఉండగా.. అదే పేరుకు దగ్గరగా నడుపూరి ఈశ్వరరావు, నేతల ఈశ్వరరావు స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. కాగా శ్రీకాకుళం వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేయగా.. రెండుసార్లు వచ్చినవి తీసేయడంతో 123 మంది మిగిలారు.

News April 26, 2024

నెల్లూరు: చివరి రోజు 113 సెట్ల నామినేషన్లు

image

నెల్లూరు జిల్లాలో చివరి రోజు గురువారం మొత్తం 113 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కందుకూరు 14, కావలి 8, ఆత్మకూరు 7, కోవూరు 24, నెల్లూరు నగరం 16, నెల్లూరు గ్రామీణం 8, సర్వేపల్లి 7, ఉదయగిరిలో 14 మంది నామినేషన్ వేశారు. నేడు వీటిని పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.