Andhra Pradesh

News August 29, 2024

కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న కర్నూలు జిల్లాకు రానున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆర్డీవో రామలక్ష్మి, డీఎస్పీ వెంకటరామయ్య గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. సెప్టెంబరు 1న సెలవు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే 31న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News August 29, 2024

రూ.40 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా పాత్రునివలసలో కేంద్ర ప్రభుత్వ నిధులతో దీని నిర్మాణం పూర్తి చేసి రెండేళ్లలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పాత్రునివలసలో నిర్మిస్తున్న క్రీడా వికాస ప్రాంగణంతో అన్ని క్రీడాలను ఒకే చోటుకు తీసుకువస్తామని చెప్పారు.

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.

News August 29, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(2023-24 విద్యా సంవత్సరం) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను సెప్టెంబర్ 19 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. 

News August 29, 2024

సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

సీఎం చంద్రబాబును గురువారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. చంద్రబాబును కలిసినప్పుడల్లా మరింత ఉత్సాహం వస్తుందని సామాజిక మాధ్యమాల్లో కేంద్ర మంత్రి తెలిపారు.

News August 29, 2024

వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు: గంటా

image

వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలేటట్లు లేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నివాసంలో గురువారం గంటా మాట్లాడుతూ… వైసీపీలో ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. ఈ విషయాన్ని ముందే చెప్పానన్నారు. రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు.

News August 29, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 29, 2024

VZM: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

గంట్యాడ మండలం మదనాపురంలో చెట్టు నుంచి జారిపడి ముంత అప్పారావు(50) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి కృష్ణ అందించిన వివరాల ప్రకారం.. మృతుడు మదనాపురంలోని ఓ షాప్ ఓపెనింగ్ కొరకు నేరేడు కొమ్మలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.

News August 29, 2024

VZM: పరుగు పందెంలో ట్రాన్స్ జెండర్స్

image

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని విజ్జీ స్టేడియం లో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో పలువురు ట్రాన్స్ జెండర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. యూత్‌ఫెస్ట్ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన ఈ మార‌థాన్ పోటీల‌ను బాలురు, బాలిక‌లు, ట్రాన్స్ జెండ‌ర్స్ మూడు విభాగాలుగా విభ‌జించి, ఒక్కో విభాగంలో ప్ర‌ధ‌మ బ‌హుమ‌తి క్రింద రూ.7,000, రెండో బ‌హుమ‌తి క్రింద రూ.4,000 అంద‌జేస్తారు.