India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పార్వతీపురం మన్యం జిల్లాలో 71 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పగడాలమ్మ తెలిపారు. 10 మంది ప్రధాన ఉపాధ్యాయులు, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7గురు పీడీలను, 33 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లను జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు. వీరందరికీ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

తుఫాను కారణంగా బంగాళాఖాతం సముద్రంలో చిక్కుకున్న చెన్నై ఫిషింగ్ బోట్తో పాటు అందులోని 10 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం బుధవారం రక్షించింది. ఆగస్టు 23న బయలుదేరిన మత్స్యకారులు సాంకేతిక కారణంతో తుఫానులో చిక్కుకున్నారు. సముద్ర తీరం నుంచి 100 నాటికన్ మైళ్ల వద్ద గుర్తించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు అధికారులు పంపిన టగ్ ద్వారా కాకినాడ కస్టమ్స్ జెట్టీకి సురక్షితంగా తీసుకువచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రంలో నెలకొన్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న సంఘటనలూ చూస్తున్నాం. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లాకు చెందిన సీఐలు ఎస్సైలు, ఇతర సిబ్బంది వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా బందోబస్తుకు తరలి వెళ్లారు. బాధితులను ఆదుకునేందుకు NDRF సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చిన్నగంజాం మండలం మోటుపల్లి పంచాయతీ రుద్రమంబాపురానికి చెందిన మత్స్యకారులు.. 10 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లారు. కాగా బోటు చెడిపోవడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిలో కొండూరి రాముడు, బసన్నగారి జయరాజు, కాటంగారి బాబురావు, ఆవల మునియ్యలు కోస్ట్ గార్డ్స్ సాయంతో కాకినాడ తీరానికి చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము క్షేమంగా రావటానికి కృషి చేసిన పర్చూరు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, రేపు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.

కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలను, వన్య ప్రాణులను సంరక్షించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ, డిస్టిక్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలలో టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. ఆయా టూరిజం స్పాట్లలో పర్యాటకులు సందర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

వరద ముంపు బాధితులకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాసటగా నిలిచారు. విజయవాడ బాధితులకు సీఎం రమేశ్ కుటుంబం కోటి రూపాయల విరాళం ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలుకోలేని విధంగా నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా రెవిన్యూ అధికారి రామకృష్ణ రెడ్డి సత్యసాయి కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం అయినట్లు కార్మిక సంఘం నాయకులు ఉపేంద్ర కుమార్ తెలిపారు. కార్మికులకు ఎలాంటి తక్షణ సహాయం లేకుండా సమ్మె విరమించాలని అడిగారన్నారు. అందుకు కార్మిక సంఘాలు అంగీకరించలేదని చెప్పారు. సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు.

చిన్నగంజాం మండలం మోటుపల్లి పంచాయతీ రుద్రమంబాపురానికి చెందిన మత్స్యకారులు.. 10 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లారు. కాగా బోటు చెడిపోవడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిలో కొండూరి రాముడు, బసన్నగారి జయరాజు, కాటంగారి బాబురావు, ఆవల మునియ్యలు కోస్ట్ గార్డ్స్ సాయంతో కాకినాడ తీరానికి చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము క్షేమంగా రావటానికి కృషి చేసిన పర్చూరు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.