Andhra Pradesh

News August 31, 2024

భారీ వర్షాలు.. శ్రీకాకుళం జిల్లా కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్: 08942240557

News August 31, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి తూ.గో కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 8977935609(తూ.గో), 08856-293104(కోనసీమ), 18004253077(కాకినాడ).

News August 31, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి ప.గో కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 08816-299219 (ప.గో), 18002331077 (ఏలూరు).

News August 31, 2024

విశాఖలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్‌లు

image

జిల్లాలో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్‌గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ నదులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ రోడ్డుపై వరద నీరు ఉంటే చూసి రాకపోకలు సాగించండి
➤ మ్యాన్ హోళ్ల వద్ద జాగ్రత్తగా ఉండండి
➤ విశాఖ కంట్రోల్ రూమ్ నెం. 1800 4250 0002, అనకాపల్లి 08924 226599

News August 31, 2024

VZM: ‘భారీ వర్షాలు.. యంత్రాంగం అలర్ట్’

image

వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజుల‌పాటు విజయనగరం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలని క‌లెక్ట‌ర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. శ‌నివారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. డివిజ‌న్‌, మండ‌ల స్థాయిలో కంట్రోల్ రూముల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. జిల్లా స్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కంట్రోల్ రూమ్ నెం. 08922 236947 ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News August 31, 2024

రేపటి నుంచి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటన వివరాలు తెలిపారు. రేపు ఆమె హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయం చేరుకొని ఇడుపులపాయకు వెళ్లి రాత్రి బసచేస్తారు. 2వ తేదీ తన తండ్రి YSR సమాధి వద్ద నివాళులర్పిస్తారు. 3వ తేదీ జిల్లా కలెక్టర్‌ను కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు.

News August 31, 2024

సింగల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాలకు అనుమతులు

image

శ్రీ సత్య సాయి జిల్లాలో గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులకు సింగల్ విండో విధానంతో అనుమతులు ఇవ్వనున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు పొందవచ్చునన్నారు. 7995095800 నెంబర్ కు వాట్సప్ ద్వారా”Hi”అని సందేశం పంపిస్తే ఎన్వోసీ పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ వాట్సాప్ కు వస్తుందన్నారు.

News August 31, 2024

అందుకే పోలవరం ఫైల్స్ దగ్ధం చేశారు: మాజీ MP భరత్

image

చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ప్రాజెక్ట్ డ్యాంకు నష్టం వచ్చిందని కేంద్ర కమిటీ నిర్ధారించినట్లు మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మరుగున పడేసేందుకు పోలవరానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమైనట్లు నాటకం ఆడి, అమాయకులైన ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేశారని అన్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

News August 31, 2024

ముందస్తు చర్యలు తీసుకోవాలి: NTR కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు.

News August 31, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని

image

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దన్నారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.