Andhra Pradesh

News September 23, 2025

వైకుంఠం జ్యోతి ఎవరు?

image

ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. <<17795004>>వైకుంఠం<<>> ఫ్యామిలీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. జ్యోతి మామ శ్రీరాములు 1995లో KDCC బ్యాంకు ఛైర్మన్‌గా పనిచేశారు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. తర్వాత తనయుడు, జ్యోతి భర్త ప్రసాద్‌ 2011లో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు MLA టికెట్‌ ఆశించినా అవకాశం రాలేదు. పార్టీలోనే కొనసాగుతున్న ఆ ఫ్యామిలీకి మరోసారి ఇన్‌ఛార్జి పదవి దక్కింది.

News September 23, 2025

పైడితల్లమ్మ పండగ ఏర్పాట్లపై ఆరా

image

విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం ఉదయం పర్యటించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో పైడితల్లి అమ్మ వారి పండుగ జరగనున్న నేపథ్యంలో సిరిమాను ప్రారంభించే ప్రాంతమైన హుకుంపేటను పరిశీలించారు. అనంతరం పైడితల్లమ్మ అమ్మవారి గుడికి చేరుకుని భక్తులు లోపలికి ప్రవేశించే మార్గాలపై ఆరా తీశారు. వారితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

News September 23, 2025

బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్‌గా విశాఖ: కాటమనేని

image

విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, అదానీ, ఇన్ఫోసిస్, మౌరి టెక్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ITE&C కార్యదర్శి కటామనేని భాస్కర్ తెలిపారు. విశాఖను ‘బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కటంనేని స్పష్టం చేశారు.

News September 23, 2025

చిత్తూరు TDP అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ..?

image

జిల్లా TDP అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. B.చిట్టిబాబు, జయప్రకాష్‌ నాయుడు, P.విజయ్‌బాబు, హేమంబరధరావు, మహదేవ సందీప్‌ వంటి నేతలు బరిలో ఉన్నారు. మహిళా కోటాలో K.అరుణ ఉన్నారు. ఇక చిత్తూరు MLA నాయుడు సామాజిక వర్గ నేత కావడంతో బలిజ కోటాలో బాలాజీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News September 23, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 50%కు పడిపోయిన అమ్మకాలు

image

గుంటూరు మిర్చీ యార్డులో 50% కు అమ్మకాలు పడిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో లారీల రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. మిర్చి ధర కూడా క్వింటాకు రూ. 800 వరకు తగ్గుదల అయ్యింది. రానున్న 10 రోజుల్లో రోజుకి 25 వేల టిక్కీల వరకు విక్రయం కూడా కష్టమే అనే మిర్చి ట్రేడర్లు చెబుతున్నారు.

News September 23, 2025

ప్రకాశం: భార్య చికెన్ వండలేదని ఉరేసుకున్నాడు..!

image

ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. గోళ్లవిడిపి గ్రామంలో ఇళ్ల లక్ష్మీనారాయణ(25) భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం చికెన్ వండాలని లక్ష్మీనారాయణ చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన అతను పొలాల్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News September 23, 2025

డీఎస్సీ అభ్యర్థులు 24న తిరుపతి చేరుకోవాలి: డీఈవో

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు కాల్ లెటర్, ఆధార్ కార్డులతో రిపోర్టు చేయాలని సూచించారు. దుప్పటి, దిండు, గొడుగు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులకు, సహాయకులకు ఐడీ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఫొటోలు తీసుకురావాలన్నారు.

News September 23, 2025

112కు కాల్.. ప్రాణాలు కాపాడిన కోవూరు పోలీసులు

image

112 కి వచ్చిన ఫోన్ కాల్‌కి స్పందించిన కోవూరు పోలీసులు సోమవారం ఒకరి ప్రాణాలను కాపాడారు. కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన కందల వంశీ (26) మానసిక స్థితి సరిగా లేక తను చనిపోతున్నానని, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోమని తన అక్క స్వరూపకు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని స్వూరూప 112కు తెలియజేశారు. వెంటనే స్పందించిన కోవూరు సీఐ వి.సుధాకర రెడ్డి రైలు పట్టాలపై ఉన్న వంశీని కాపాడారు.

News September 23, 2025

బస్సులో ప్రయాణించి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాల జారీ కార్యక్రమ సభకు వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్వయంగా బస్సులో ప్రయాణించి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా అవసరమైన చోట రహదారులను వెడల్పు చేయించడం, మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు ఉన్నారు.

News September 23, 2025

SKLM: DSCలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

DSC‌లో ఎంపికైన అభ్యర్థులకు 25న విజయవాడలో సీఎం నియామక పత్రాలను అందజేయమన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డీఈవో రవిబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 24న ఉదయం 6 గంటలకు, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు అభ్యర్థులు చేరుకోవాలని, 37 ప్రత్యేక బస్సుల్లో విజయవాడు చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.