India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్గా బూరె సర్వేశ్వరుడు నరేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటి అబ్జర్వర్ను కలిశారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను భారత ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే మండల పరిశీలకులకు నేరుగా కానీ ఫోన్లో గాని ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, సి-విజిల్ కేంద్రాన్ని పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే గురువారం
పరిశీలించారు. అక్కడి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఎన్నికల సంబంధిత ఫిర్యాదులకు తన మొబైల్ నంబర్ 9154141876, policeobservertpt23@gmail.com ద్వారా సంప్రదించాలని సూచించారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏలూరు జిల్లాకు ఉంగుటూరు, గోపాలపురం నియోజకవర్గాలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోకి వచ్చాయి. దీంతో ఆయా చోట్ల పోటీచేసే అభ్యర్థులు 2 జిల్లాల్లో ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
– గణపవరం మండలం వాస్తవానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీకి చెందినదే అయినా జిల్లా మాత్రం ప.గో.
– ద్వారకాతిరుమల మండలం ప.గో. జిల్లా గోపాలపురం అసెంబ్లీకి చెందినదే అయినా జిల్లా మాత్రం ఏలూరు.
ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 28న ఆదివారం ఉదయం 7 గంటలకు కృష్ణా జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 23 పురుషుల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్ త్రినాధ్ రాజ్ గురువారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల వారు ఎవరైనా ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఈ ఎంపికలలో పాల్గొనవచ్చన్నారు. క్రీడాకారులు తమ సొంత క్రీడా దుస్తులతో హాజరవ్వాలని చెప్పారు.
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సహజం. ఎల్ఎన్పేట మండలం చింతలబడవంజ గ్రామంలోని ధనలక్ష్మీ అనే గృహిణి ఇంటి బయట మామిడి వృక్షాన్ని నరికేశారు. అయినా కాండానికి గుత్తులుగా కాసిన మామిడి కాయలు అటుగా వెళ్లే చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
నెల్లూరు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతరావు ఎన్నికల బరిలోకి దిగారు. సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కోఆర్డినేటర్గా సానా సతీష్ ఎంపికయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్గా తోట నవీన్, పెద్దాపురం కోఆర్డినేటర్గా రాజా సూరిబాబు రాజు, జగ్గంపేట కోఆర్డినేటర్గా అప్పలరాజు, కాకినాడ కోఆర్డినేటర్ గా వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.
ప్రస్తుత ఏలూరు జిల్లాకు చెందిన దెందులూరు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి MLAగా గెలుపొందారు. రెండేళ్లకే మంత్రి (నీటిపారుదల శాఖ) పదవి సైతం వరించింది. ఆ తర్వాత దెందులూరు మండల జడ్పీటీసీ పదవికి ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిచెందాడు. దీంతో మాగంటి మంత్రి పదవికి రాజీనామా చేశారు. జడ్పీటీసీ ఓటమి మంత్రి పదవికే ఎసరుపెట్టినట్లయింది.
ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి, చక్రస్నాం అయిపోయిన అరగంట తర్వాత పందిరి కూలిపోవడం, అక్కడ భక్తులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.