Andhra Pradesh

News September 1, 2024

కడప: రేపు విద్యాసంస్థలకు సెలవు

image

కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని యాజమాన్యాల విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించారు. సంబంధిత యాజమాన్యాలు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

News September 1, 2024

కళాశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: RIO

image

ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు RIO సైమన్ విక్టర్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల వద్దకు విద్యార్థులు వెళ్లరాదన్నారు. అలాగే ఎవరైనా కళాశాలలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News September 1, 2024

రేపు నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు

image

సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

News September 1, 2024

గుంటూరు: టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

image

వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి గుంటూరు కలెక్టరేట్, నగరపాలకసంస్థ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లా ప్రజలు గుంటూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 0863-2234014, 9849904013కి, అదేవిధంగా నగర ప్రజలు కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన 0863-2345105, 9849908391 నంబర్లను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తుంది. Share It

News September 1, 2024

శ్రీకాకుళం: ‘సోమవారం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు’

image

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు సోమవారం సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి, రీజినల్ ఇంటర్మీడియట్ అధికారికి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు.

News September 1, 2024

మద్దికేరలో మనస్తాపంతో రైతు మృతి

image

మద్దికేరలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువరైతు నిద్రలోనే ప్రాణాలను కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మద్దికేరకు చెందిన పారా రాజేంద్ర (45) తనకు ఉన్న రెండు ఎకరాలు సాగు చేశాడు. అధిక వర్షాలతో పంట నీట మునగడంతో మనస్తాపానికి గురయ్యాడు. దానికి తోడు తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధపడేవాడు. ఆదివారం మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించిన రాజేంద్ర మంచంపైనే ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.

News September 1, 2024

విశాఖ: మరికొన్ని రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

భారీ వర్షాల కారణంగా మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. 2న నాందేడ్-సంబల్పూర్ నాగవల్లి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ వందే భారత్(20707), విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ (20708) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ (20833), సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ (20834) ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దుచేశామన్నారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. సత్యసాయి జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్ ఇదే

image

శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాల కారణంగా గ్రామ, పట్టణ ప్రాంతాలలో నష్టం వాటిల్లితే టోల్ ఫ్రీకి నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాకు వర్ష సూచన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు తక్షణ సాయం కోసం 08885292432కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News September 1, 2024

ఒంగోలు: ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు

image

తుఫాను వల్ల ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏవైనా అవాంతరాలు తలెత్తితే, సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎవరైనా సహాయం కొరకు 08592-227766 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ఈ విషయాన్ని నగరపాలక సంస్థ ప్రజలు గమనించాలని కోరారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. కర్నూల్.జిల్లా కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠జిల్లా కంట్రోల్ రూం నంబర్: కర్నూల్ 08518277305