India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో 75 మంది, మన్యం జిల్లాలో 71 మంది ఉపాధ్యాయులకు ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

గోదావరి వరదతో వేలేరుపాడు మండలములోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 15 మోటర్ బోట్లు, 30 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని ఆర్డీవో ఆదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముంపు ప్రజలను తరలించడానికి 24 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. మరింత సహాయార్థం టోల్ ఫ్రీ నెం. 8919936844 ఏర్పాటు చేశామన్నారు.

గత నెల 20న రాత్రి నల్లమాడ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ చోరీ చేసిన దొంగను బుధవారం ఇన్ఛార్జ్ ఎస్ఐ వెంకటరమణ స్థానిక వైఎస్సార్ సర్కిల్లో అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వై.నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సాయికుమార్ నుంచి కంప్యూటర్ రికవరీ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.

ఓ చిన్న తప్పుతో ముగ్గురు చనిపోయారు. శాంతిపురం(M) శిలామాకులరాయికి చెందిన రామచంద్ర(45)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో ట్రాన్స్పోర్టు బిజినెస్ చేసే అతనికి హిందూపురానికి చెందిన గిరీశ్ పరిచయమయ్యాడు. ఈక్రమంలో గిరీశ్ భార్య శోభతో రామచంద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లి పురెమ్మ(68) చాలాసార్లు చెప్పినా రామచంద్ర మారకపోవడంతో సోమవారం ఆత్మహత్య చేసుకోగా.. రామచంద్ర, శోభ బుధవారం <<14020063>>సూసైడ్ <<>>చేసుకున్నారు.

నాగావళి లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహానికొస్తే సిక్కోలులో బెజవాడ తరహా ముంపు రానుంది. కృష్ణా పార్కు, రైతు బజారు, డీసీసీబీ, బాకర్ సాహెబ్ పేట, నీలమ్మ, చౌదరి సత్యనారాయణ, నాయుడు చెరువు గట్టు, విశాఖ ఏ,బీ,ఫ్రెండ్స్, వంశధార,వరం,మహాలక్ష్మినగర్ కాలనీలు, ఆర్టీసీ కాంప్లెక్స్, పొట్టి శ్రీరాములు, అరసవల్లి మిల్లు, డే అండ్ నైట్ కూడలిలు, చిన్నబరటాం, మండల,రెల్ల, సానా,గూనపాలెం వీధులు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయి.

అనంతపురం జిల్లా వాసులు తీసిన ‘సేద్యం‘ మూవీ పోస్టర్ను కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలపై కళ్ళకు కట్టినట్లుగా ఈ సేద్యం మూవీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సేద్యం మూవీ డైరెక్టర్ చంద్రకాంత్, తరిమెల శేషు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు (Teacher) కృషి వెలకట్టలేనిది. అటువంటి వారిలో కడప జిల్లాకు చెందిన 79 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు వరించాయి. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు టీచర్స్ డే జరుపుకుంటున్నాము. మరి మీ జీవితాన్ని మార్చిన టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి.
Happy Teachers’ Day

విశాఖ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా కాసేపటికే తిరిగి వెనక్కి వచ్చింది. బుధవారం విశాఖ నుంచి హైదరాబాద్కు విమానం బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి తీసుకువచ్చినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం సవరించిన తర్వాత విమానం బయలుదేరింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాడేపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం కలిశారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. జగన్ను కలిసిన వారిలో జిల్లా నేతలు మాజీ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, రవి కిషోర్ రెడ్డి ఉన్నారు.

నార్పల మండలం దుర్గం గ్రామానికి చెందిన సాకే సంతోశ్ జాతీయ స్థాయి అర్చరీ చాంపియన్షిప్ పోటీకు ఎంపికయ్యాడు. తండ్రి మారెన్న సిద్దరాచెర్ల గ్రామ నౌకరుగా, తల్లి సరస్వతి నార్పల ఎంఆర్సీలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. సంతోశ్ అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 26న ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉపాధ్యాయులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.