India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☞ జి.సిగడాం: సంచరిస్తున్న సింహంపై క్లారిటీ
☞ శ్రీకాకుళం: విజయవాడ బాధితులకు రూ.5 లక్షల సాయం
☞ ఇచ్చాపురం: జ్వరంతో 11 ఏళ్ల బాలుడి మృతి
☞ నందిగాం: నీట్ పీజీలో సాయి కిరణ్ ప్రతిభ
☞ శ్రీకాకుళం: రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
☞ నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
☞ శ్రీకాకుళం: బదిలీపై జిల్లాకు ముగ్గురు డీఎస్పీలు
☞ కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం: ఎస్పీ మహేశ్వర రెడ్డి

అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో రోడ్లో నివాసం ఉండే అనిత అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కోసిగి గ్రామానికి చెందిన బలకుందు కోసిగయ్య(52) సోమవారం మధ్యాహ్నం కోసిగి నుంచి ఐరనగల్ 523/40-42 కిలోమీటర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోసిగయ్య తాగుడుకు బానిసై, కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొండెం నుంచి తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు తెలిపారు.

విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్తో దుర్గ్లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్తో దుర్గ్లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

నంద్యాలలో తనపై జరిగిన దాడి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలను తమ కుటుంబం కానీ నంద్యాల పట్టణ ప్రజలు కానీ సహించబోరని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సోమవారం తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీలోని మరో వర్గానికి చెందిన తమ నాయకుడు ఫొటో లేదని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగారని ఫిరోజ్ తెలిపారు.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.

నరసన్నపేట పట్టణంలోని కలివరపుపేట వీధికి చెందిన వైశ్యరాజు నాగరాజు(32) సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్ కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నాడని ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను మృతి చెందాడని తండ్రి లక్ష్మణ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గ ప్రసాద్ తెలిపారు.

నరసాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఉన్న గోదావరి ప్రాంతమంతా సోమవారం ఎరుపు రంగులో కనిపించిది. సాయంత్రం 5 గంటలకు సంధ్యా సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఎరుపు రంగులో కమ్ముకున్నాయి. దీంతో గోదారి రంగు మారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పలువురు ఈ చిత్రాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.