India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం సూరంపాలెం ఆదిత్య కాలేజ్కు చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగ్గా, అందడం లేదని వారు సమాధానమివ్వడమే నేరమైందని అన్నారు. తక్షణమే కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ ఎకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల నుంచి విడుదల చేయకుండా తన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పవన్ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారని కాకాణి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో టీడీపీ నేతలతో జనసేన అధినేత పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం TDP ఇన్ఛార్జి వర్మ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నానని.. ఆయన రుణం తీర్చుకుంటానన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే మద్దతిచ్చానని తెలిపారు. నేడు సాయంత్రం కోరుకొండ సభలో ఆయన పాల్గొననున్న విషయం తెలిసిందే.
రాజమండ్రికి చెందిన అలికాని సత్యశివకుమార్, దుర్గాభవానీల వివాహం ఈ నెల 21న జరగనుంది. కాగా వారి వివాహ వేడుకకు ఆహ్వానపత్రికను వినూత్నంగా సిద్ధం చేశారు. నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండగ వరకు సుమారు 45 ఘట్టాలు, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. పత్రి ఘట్టానికి ఓ క్యూఆర్ కోడ్ రూపొందించి శుభలేఖలో ముద్రణ చేయించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆ ఘట్టాన్ని ఎవరైనా చూడొచ్చు.
– మీరు చూశారా ఇలాంటివి.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాల వివరాలను ఖచ్చితంగా లెక్కించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందని, అందువలన వాటిపై ఏఈఓలకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.
బేతంచెర్లకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుండా గోపాల్ మనుమడు గుండా ఆయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. 4వ తరగతి చదువుతున్న ఆయాన్ 100 నుంచి ఒకటి వరకు వెనక వైపు నుంచి అంకెలను 37 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను వారం రోజుల పాటు మార్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరను నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఇబ్బందులు లేకుండా అవిలాల జాతర ఆలస్యం కావడంతో మే 14 నుంచి 22వ తేదీకి మార్చారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇదే తొలిసారి ఇలా జరగడం.
ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్, ఎన్నికల పరిశీలకులు కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలతో కలసి నూతన కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. మీడియా మానిటరింగ్, మోడల్ కోడ్ కమిటీ, సోషల్ మీడియా, జిల్లా ఎక్స్పెండిచర్ కమిటీ, కంప్లైంట్స్, రిపోర్టింగ్, మీడియా సెంటర్ విభాగాలను పరిశీలించారు.
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గణపతి నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు చికిత్స నిమిత్తం వెళ్లారు. ఎమ్మెల్యేకు వడదెబ్బ తగిలినట్టు వైద్యాధికారిణి పి. అనూష తెలిపారు. ప్రస్తుతానికి సెలైన్ ఎక్కించినట్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.