India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమశ్రీ పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు సంవత్సరాల B.A, B.Edలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30.
పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నుంచి బీఫామ్ అందుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు చెప్పారు.
‘హెచ్చరిక… హెచ్చరిక.. హెచ్చరిక మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన. భవనాల్లో ఆశ్రయంపొందాలి.’ అంటూ APSDMA హెచ్చరిక చేసింది. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ప్రజలకు అలర్ట్ మెసేజులు రావడంతో ఒక్కసారిగా భయాందోళన చెందారు. కావున జాగ్రత్తగా ఉండండి.
రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు నినా నిగమ్ జిల్లా పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం గౌరవ పూర్వకంగా ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ జి.ఆర్.రాధిక ఆహ్వానం పలికారు. అనంతరం జిల్లాలోని అనుసరిస్తున్న ఎన్నికల నియమావళి ప్రక్రియను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతీ అధికారి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
పెన్షన్ డబ్బు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కర్రతో దాడిచేసి కాలు విరిచిన ఘటన శనివారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పత్తెపురానికి చెందిన వెంకటరమణమ్మ పెన్షన్ డబ్బు, కొడుకు లక్ష్మన్నకు ఇవ్వలేదని ఆగ్రహించాడు. ఇంట్లోని గొడ్డలి కట్టెతో తల్లి వెంకటరమణమ్మపై దాడి చేయడంతో ఆమె కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని మదనపల్లికి తరలించి, అక్కడి నుంచి రుయాకు తీసుకెళ్లారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. రాయదుర్గం నియోజక వర్గం కనేకల్ క్యాంపు సైట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులుతో కలిసి జరుపుకొన్నారు. కేకులు కత్తిరించి పిల్లలకి పంపిణీ చేశారు. పిల్లలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్ 26న కుంభోత్సవం సందర్భంగా జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధమని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈమేరకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు. నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం తరపున పూర్తి సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సున్నిపెంటలో రెండు రోజులు పాటు మద్యం షాపుల బంద్కు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశం ఉన్న అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఓటర్లకు లంచం ఇచ్చే ప్రయత్నంలో నగదు, బహుమతుల పంపిణీపై సీ- విజిల్ లాంటి అప్లికేషన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.
➤ నియోజకవర్గం: బాపట్ల
➤ అభ్యర్థి: వేగేశన నరేంద్ర వర్మ రాజు(TDP)
➤ భార్య: హరికుమారి
➤ విద్యార్హతలు: 10వ తరగతి
➤ చరాస్తి విలువ: రూ.73.72 కోట్లు
➤ స్థిరాస్తి విలువ:రూ.22.59 కోట్లు
➤ కేసులు: 2
➤ అప్పులు: రూ.25.91 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.10.67 లక్షలు
➤ బంగారం: తన వద్ద రూ.27లక్షలు, భార్య వద్ద రూ.47లక్షల విలువైన బంగారం ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.
Sorry, no posts matched your criteria.