India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడమేరు వరద కారణంగా కేసరపల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భవిష్యత్తులో తమ నివాసాలవైపు వరద నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఉమ్మడి కడప జిల్లాలో రెండో విడత 8 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
➤ కడప: ఓల్డ్ బస్టాండ్ వద్ద
➤ కడప: ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వద్ద
➤ కడప: ZP ఆఫీస్ వద్ద
➤ జమ్మలమడుగు: ఆపోజిట్ MRO ఆఫీస్ వద్ద
➤ ప్రొద్దుటూరు: దూరదర్శన్ సెంటర్ వద్ద
➤ పులివెందుల: ఓల్డ్ జూనియర్ కాలేజీ వద్ద
➤రాజంపేట: RB బంగ్లా వద్ద
➤రాయచోటి: గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద SHARE IT.

ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.

ఉ.కర్నూలు జిల్లాలో కొత్తగా మరిన్ని <<14130693>>అన్న<<>> క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాటి అడ్రస్లు ఇవే..
➤ ఆళ్లగడ్డ: టీబీ రోడ్డు పాతూర్ వీధి
➤ డోన్: LIC కార్యాలయం కింద
➤ ఎమ్మిగనూరులో(రెండు చోట్ల): శ్రీనివాస థియేటర్ ఎదురుగా, తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో
➤ గూడూరు: కూరగాయల మార్కెట్ వద్ద
➤ ఆదోనిలో(మూడు చోట్ల): పాత లైబ్రరీ పోస్ట్ ఆఫీస్, యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా, శ్రీనివాస భవన్
SHARE IT

అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.

ఈనెల 19 నుంచి ఏపీ ఆన్లైన్ శాండ్ పోర్టల్ అందరికీ అందుబాటులోకి రానుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. ఈ పోర్టల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభిస్తారని తెలిపారు. ఇసుక బుకింగ్ ప్రక్రియ, రవాణాదారుల జాబితా పొందుపరిచే ప్రక్రియ, బల్క్ వినియోగదారుల ఇసుక అవసరాన్ని ముందుగానే వెరిఫికేషన్ను భూగర్భ శాఖ ద్వారా జేసీ లాగింగ్కు పంపించాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు ప్రజా రవాణా అధికారి బి.సుధాకర్రావు తెలిపారు. <

ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో మొదటి విడత అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయింది. 542 సీట్లు ఉండగా 259 ప్రవేశాలు జరిగాయి. ఇంకా 303 సీట్లు మిగిలి ఉండటంతో రెండో విడత కౌన్సిలింగ్కు ఈనెల 19 లోపు రిజిస్ట్రేషన్, 21న ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 23, 25న వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.