Andhra Pradesh

News June 15, 2024

ANU: నేడు ఇంజినీరింగ్ కళాశాల ప్రవేశ పరీక్ష

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నేడు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆధార్ కార్డు, ఇంటర్ మెమో మార్కుల జాబితా తీసుకొని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి అధికారి అనుమతితో రూ. 1200 చెల్లించి పరీక్ష రాయవచ్చని చెప్పారు.

News June 15, 2024

కె.వి పల్లి: గురుకులంలో ఉద్యోగ అవకాశాలు

image

కేవీ పల్లి మండలంలోని గ్యారంపల్లె గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఆంగ్లంలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలని కోరారు.

News June 15, 2024

శ్రీకాకుళం: చెట్టు విరిగిపడి వ్యక్తి మృతి

image

జి. సిగడాం మండలంలోని పెనసాంలో ఈదురు గాలులకు చెట్టు విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గేదెల రమణ (39) పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండగా చెట్టు విరిగి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అతనికి భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఎస్సై మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 15, 2024

మైనర్లకు పెళ్లి.. బాలిక తల్లిదండ్రుల అరెస్ట్

image

బాలికకు పెళ్లి చేసిన తల్లిదండ్రులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారుకు చెందిన బాలుడు, బాలిక ప్రేమించుకున్నారు. బాలిక గర్భం దాల్చడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి పేరెంట్స్ గతేడాది Aug 26న వారికి పెళ్లి చేసేందుకు నిర్ణయించగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. ఆ తర్వాత మూడ్రోజులకే వారికి పెళ్లి చేయగా.. SP ఆదేశాల మేరకు బాలిక పేరెంట్స్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

News June 15, 2024

పరవాడ: చేపల వేటకు సిద్ధం అవుతున్న మత్స్యకారులు

image

చేపల వేట నిషేధం గడువు జూన్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధం అవుతున్నారు. 61 రోజుల చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులు చినిగిన వలలు, పాడైన పడవలకు మరమ్మతులు చేసుకున్నారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం జాలరిపేట మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. పరవాడ మండలంలో 120 పడవల ద్వారా మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ ఉంటారు.

News June 15, 2024

అనంత: రానున్న ఐదు రోజుల్లో వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి పేర్కొన్నారు. వచ్చే 5 రోజుల్లో పగలు ఉష్ణోగ్రత 32.4 నుంచి 34.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 23.8 నుంచి 24.7 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

News June 15, 2024

రాజంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రాజంపేట మండలం హస్తవరం- రాజంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శుక్రవారం రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియా సిమెంటు అని బనియన్ దానిపై గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. ఎవరనేది సమాచారం తమకు తెలపాలని కోరారు. కేసు నమోదు చేశామని తెలిపారు.

News June 15, 2024

రాజమండ్రిలో ‘స్పా’ ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో ‘స్పా’ కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తూ.గో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, స్పా కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులతో పాటు సిబ్బందిగా ఉన్న మరో యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News June 15, 2024

ఆత్మకూరు: ఉపాధ్యాయ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆత్మకూరు పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కామేశ్వరి తెలిపారు. ఇంగ్లీష్ టిజిటి, పిజిటి, ఫిజిక్స్ పిజిటి, హిందీ పిజిటి, టిజిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువును 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.

News June 15, 2024

చీమకుర్తి: దివ్యాంగురాలిపై 3 నెలలుగా అత్యాచారం

image

చీమకుర్తి మండల పరిధిలోని చండ్రపాడులో మాటలు రాని, వినపడని యువతిపై మూడు నెలలుగా అఘాయిత్యం జరుగుతున్నట్లు బయటపడింది. ఆ యువతి గర్భిణీ అని తేలటంతో శుక్రవారం ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.