Andhra Pradesh

News April 25, 2024

చిత్తూరు: మాజీ సీఎంపై ఒకే ఒక్క కేసు

image

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఇందిరా రెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తులు రూ.75.65 కోట్లు. ఆయనపై ఈ నెల 7న రొంపిచర్లలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదైంది. ఇతరత్రా కేసులు లేవు.

News April 25, 2024

కడప: ‘రాయి వేస్తే పట్టుకున్నారు.. హత్య చేస్తే స్పందించరా’

image

పులివెందులలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. వైఎస్ సునీత బుధవారం వేంపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌పై గులకరాయితో దాడి జరిగిందని నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మరి మాజీ మంత్రి వివేకాను క్రూరంగా హత్య చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచి షర్మిలను ఎంపీగా గెలిపించాలన్నారు.

News April 25, 2024

కర్నూలు: కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

image

కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బుధవారం డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు విడుదల చేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ జిలానీ బాషా, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎం.కాశీం వలి, మంత్రాలయం అసెంబ్లీ స్థానానికి పీఎస్ మురళీకృష్ణ రాజు పేర్లను ఖరారు చేసినట్టు ఆయన వెల్లడించారు.

News April 25, 2024

శ్రీకాకుళం ఎంపీకి రూ.23.29 కోట్ల ఆస్తులు

image

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయన భార్య శ్రావ్య పేరిట రూ.23. 29 కోట్ల ఆస్తులున్నాయని నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీటెక్, ఎంబీఏ చదివినట్లు తెలిపారు. దంపతుల పేరిట రూ.6.78 కోట్ల చరాస్తులు, రూ.16.51 కోట్ల స్థిరాస్తులు, 2,335 గ్రాముల బంగారం, రూ.2.98 కోట్ల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

News April 25, 2024

ఒంటిమిట్ట: నేడు కోదండరాముడికి చక్రస్నానం 

image

ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి చక్రస్నానం నిర్వహించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు అన్నారు. రాత్రి ధ్వజారోహణం ఉంటుందన్నారు. శుక్రవారం పుష్పయాగం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు చక్రస్నానంలో పాల్గొనాలని వారు కోరారు.

News April 25, 2024

నెల్లూరు: ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

image

ఎన్నికల నేపథ్యంలో మే 13న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాల్లో పనిచేసే అర్హులైన రోజు వారి, సాధారణ, షిఫ్టుల వారి కార్మికులు ఓటు వినియోగించుకోవడానికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు కార్మిక ఉప కమిషనర్ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

News April 25, 2024

బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ కార్యక్రమం

image

గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ సమగ్ర మిషన్ కార్యక్రమం ప్రారంభించినట్టు పాడేరు సబ్ కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం చింతపల్లిలో అదనపు ఎస్పీ కే.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి చిట్టి కార్యక్రమం ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు జరగడం వల్ల చిన్న వయస్సులో గర్భం దాల్చి మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు.

News April 25, 2024

వైసీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడిగా గోరంట్ల మాధవ్

image

వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కురువ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. తాజాగా ఇదే సామాజిక వర్గానికి చెందిన మాధవ్‌ నియామకంతో పార్టీకి కలిసి వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది.

News April 25, 2024

ఒకే రోజు ఇద్దరు నామినేషన్లు.. చంద్రగిరిలో హైటెన్షన్

image

చంద్రగిరి నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు అభ్యర్థులు భారీ జనసమీకరణ చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాను నామినేషన్ వేసే రోజే మోహిత్ రెడ్డి నామినేషన్ వేయడం కుట్రలో భాగమని నాని ఆరోపిస్తున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయం పాటించాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News April 25, 2024

ప.గో. నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు ఈరోజు తమ నామినేషన్లు సమర్పించనున్నారు. వారిలో
> పోలవరం -చిర్రి బాలరాజు (JSP)
> ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు
> తాడేపల్లిగూడెం -కొట్టు సత్యనారాయణ (YCP)
> ఉంగుటూరు- పుప్పాల వాసు బాబు (YCP)