India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కూటమి నుంచి వరుపుల సత్యప్రభ పొటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బరావు బరిలో ఉన్నారు. అయితే రాజకీయంగా వీరు ప్రత్యర్థులు అయినప్పటికీ వరుసకు వీరు తాత, మనవరాలు.
ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ఉంటుందని.. అదే విధంగా 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వో లు, నోడల్ అధికారులతో నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సింబల్ అలాట్మెంట్ జరుగుతుందని వివరించారు.
మండలంలోని మునిపెడ అడ్డ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విజయవాడ నుంచి నరసాపురం పెళ్లికి వెళ్తున్న కారు మునిపెడ వద్ద రోడ్డుపై పడి ఉన్న గేదెను తప్పించబోయి పంట బోధిలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో బుధవారం 63 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. పార్లమెంటు స్థానానికి 8 నామినేషన్లు వేశారని చెప్పారు. పుంగునూరు అసెంబ్లీకి ఎనిమిది, నగరిలో 9, జీడీనెల్లూరులో 12, చిత్తూరులో పది, పూతలపట్టులో 5, పలమనేరులో 2, కుప్పంలో 7 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ తెలిపారు.
జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడిపై ఆ పార్టీకి చెందిన 5 మండలాల అధ్యక్షులు తిరుగుబాటుకు దిగారు. వెంకటాచలంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే జన సైనికులపై ఆయన దూషణలకు దిగడం సరికాదన్నారు. ఆయన తీరు నచ్చకే కొందరు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారన్నారు. అతనితో కలిసి పనిచేయబోమని.. తామంతా సోమిరెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు.
ప్రముఖ నటుడు సుమన్ బుధవారం వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఉదయం మఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్చనలు, అభిషేకాలు చేయించారు. వీరబ్రహ్మంగారి ఆలయ విశిష్ఠతను గురించి సుమన్కు వివరించారు. అనంతరం పట్టణంలోని శీలం నరసింహులు గౌడ్ నివాసంలో ఆయన తేనీటి విందులో పాల్గొన్నాడు. సుమన్ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.
జిల్లాలో ఆరవ రోజు బుధవారం మొత్తం 64 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. అత్యధికంగా నరసరావుపేట పార్లమెంటుకు 10, అసెంబ్లీ స్థానానికి 11, నామినేషన్లు వేశారని చెప్పారు. పెదకూరపాడు అసెంబ్లీకి 7, చిలకలూరిపేట అసెంబ్లీకి 7 సత్తెనపల్లి అసెంబ్లీకి 9 వినుకొండ అసెంబ్లీకి 6, గురజాల అసెంబ్లీకి 7, మాచర్ల అసెంబ్లీకి 7 ,నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 26వ తేదీ లోపు ఫామ్-12ను సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. ఎన్నికలలో విధులు నిర్వర్తించడానికి ఉత్తర్వులు పొందిన ఉద్యోగులు ఫామ్-12ను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్కు అందించి పోస్టల్ బ్యాలెట్ పొందాలన్నారు. 26వ తేదీ లోపల అందించని పక్షంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను కోల్పోతారన్నారు.
దెందులూరు అసెంబ్లీ పరిధిలో 5వ రోజు బుధవారం ఏడుగురు అభ్యర్థులు తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి బుధవారం వెల్లడించారు. కాగా ఏప్రిల్ 26న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.
చిత్తూరు: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 466 మార్కులతో స్పందన రాష్ట్రస్థాయిలో 3వ స్థానం సాధించింది. ఆమెది ఉమ్మడి చిత్తూరు జిల్లా కావడం గమనార్హం. తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పని చేస్తున్న యం.సురేంద్ర నాయక్ కుమార్తె స్పందన హైదరాబాద్లో ఇంటర్ చదువుతోంది. ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. స్పందనను పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.