India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు ప్రణాళిక, వాణిజ్య పన్నులు&అసెంబ్లీ వ్యవహారాలు, ధర్మవరం ఎమ్మెల్యే వై.సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య, పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చేనేత, బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా ఈ ముగ్గురూ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, గృహ నిర్మాణ శాఖ, ఎన్ఎండీ ఫరూక్కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తొలిసారి మంత్రులు కాగా.. ఫరూక్ నాలుగో సారి మంత్రి కావడం గమనార్షం.

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 MLAలలో ఇద్దరికి మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. కాగా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలు, నిడదవోలు MLA కందుల దుర్గేశ్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

సీఎంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. రాయచోటి MLA మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడా, సమాచార శాఖను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించింది. రాయచోటి నియోజకవర్గం నుంచి మొదటి మంత్రి కావడం విశేషం. దీంతో రాయచోటి కూటమి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమ, గిరిజనశాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాలూరు నియోజవర్గం నుంచి మొదటి మహిళా మంత్రి సంధ్యారాణే కావడం గమనార్హం. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్కు శ్రీనివాస్కు MSME, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికు సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లోని కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులుగా ప్రమాణ చేసిన ఇద్దరికి సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు భూగర్భ గనుల, ఎక్సైజ్ శాఖ దక్కింది. నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి సమాచార, గృహనిర్మాణ శాఖ కేటాయించారు. దీంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. దీంతో రెండ్రోజుల ఉత్కంఠకు తెరపడింది. జిల్లాకు సంబంధించి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన నారా లోకేశ్కు ఐటీ, మానవ వనరుల శాఖ.. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ.. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని ఆత్మకూరు, నెల్లూరుసిటీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఇటీవల మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నారాయణకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పని చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మంత్రిగా అనిత ఉన్నారు. పాయకరావుపేట నియోజకర్గం నుంచి మొదటి మంత్రి అనితే కావడం గమనార్హం. టీచర్ పనిచేసిన అనిత 2014లో మొదటిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 కొవ్వురులో పోటీ చేసి మాజీ హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓడిన అనితను హోంమంత్రి వరించడం విశేషం.
Sorry, no posts matched your criteria.