India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

70ఏళ్ల చరిత్ర గల పాలకొల్లు నియోజకవర్గంలో డా.నిమ్మల రామానాయుడు కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇక్కడ 1955 నుంచి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు నిమ్మలకు మాత్రమే ‘హ్యాట్రిక్’ ఇచ్చారు. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయణ గెలిచినా.. హ్యాట్రిక్ సాధ్యం కాలేదు. 3వసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 19లో గెలిచిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి చేపట్టారు.

కడప-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలు నంబర్లలలో మార్పు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. కడప- విశాఖపట్నం, విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు ప్రస్తుతం 17487/17488 నంబర్లతో నడుస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నంబర్లతో నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.

వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(TUDA) ఛైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు ప్రభుత్వం నిన్న ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడి పదవికి కూడా మోహిత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ బొడ్డుమామిడి లంకకు చెందిన కుండ్ల రాధమ్మ(19)అనే యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధమ్మ చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఆ తర్వాత సోదరుడు మృతి చెందాడు. తనను ఎంతో అపురూపంగా చూసుకునే నాన్నమ్మ ఇటీవలే చనిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాధమ్మ గురువారం ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంప ఎస్సై లోకేశ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

చేబ్రోలు మండలంలోని వడ్లమూడి నక్కల గుంత సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై మహేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలగుంత సమీపంలో మహిళ మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం గుర్తించలేని విధంగా ఉంది. కాషాయం రంగు ఆకులు ఉన్న తెల్ల చీర, ఆరెంజ్ రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. హత్యా? లేదా ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధ ఉత్తర్వులు రద్దుకానున్నాయి. ఏప్రిల్ 15 నుంచి దాదాపు 60 రోజుల పాటు విధించిన నిషేధాజ్ఞలు శుక్రవారం అర్ధరాత్రితో ఎత్తివేయనున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో తిరిగి బోట్ల సందడి మొదలుకానుంది. 2 నెలల పాటు వృత్తికి దూరంగా ఉన్న మత్స్యకారులు వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రంగంపై ప్రత్యేకంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 2000 మందికి మళ్లీ ఉపాధి దక్కనుంది.

పిఠాపురం మండలంలో దారుణ హత్య జరిగింది. భోగాపురంలోని దుర్గమ్మ ఆలయ ఆవరణలో నిద్రించిన బ్రహ్మదేపు ప్రసాద్ను పద్మరాజు అనే వ్యక్తి పెద్ద బండరాయితో మోది హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పిఠాపురం రూరల్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన నాడు నేడు రెండో విడత పనులు పలు పాఠశాలల్లో నిలిచిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు రూ. 50కోట్ల నిధులతో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. కాగా నిధుల లేమితో కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో నాడు-నేడు రెండో విడత పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఎమ్మిగనూరు మండలం చీరాలదొడ్డి-ఎర్రకోట సమీపంలో గురువారం రాత్రి మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వస్తూ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి వెళ్లి చూడగా.. డ్రైవర్, క్లీనర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా లారీ నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కల్పన దిశగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐదేళ్లపాటు ఇదిగో డీఎస్సీ అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరో నాలుగు కీలక ఫైల్స్పై సంతకాలు చేసిన చంద్రబాబు మంచి పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.