Andhra Pradesh

News April 25, 2024

కడప: పోలింగ్ రోజు సెలవుగా ప్రకటన

image

కార్మిక శాఖ దుకాణాలు సంస్థల చట్టం -1988 ప్రకారం మే 13న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మిక శాఖ సెలవు ప్రకటించిందని జిల్లా కార్మిక శాఖ కమిషనర్ శ్రీకాంత్ నాయక్ తెలిపారు. కావున వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ప్రతి వ్యక్తికి ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలన్నారు.

News April 25, 2024

కొండయ్య నామినేషన్‌కి రానున్న హీరో నిఖిల్

image

యువ సినీ హీరో నిఖిల్ మామ, చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం చీరాల వస్తున్నారు. కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈమధ్య ఆయన తన బావ అమర్నాథ్, మహేందర్నాథ్ లతో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ను కలుసుకోగా పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఆయన కోరారు.

News April 25, 2024

కాకినాడ పోర్టు – విశాఖపట్నం రైలు రద్దు

image

కాకినాడ పోర్టు – విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్టు (17267) రైళ్లను ఈ నెల 29 – మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. భావనగర్ – కాకినాడ పోర్టు (12756) రైలును మే 4, 11, 18, 25 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ డివిజన్లో మరమ్మతు నిర్వ హణ పనుల కోసం మార్పులు చేశామన్నారు.

News April 25, 2024

చిత్తూరు: కర్ణాటక ఓటర్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కర్ణాటకకు చెందిన ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7వ తేదీన రెండు దశలుగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.

News April 25, 2024

బ్రహ్మంగారిమఠానికి రానున్న సినీ నటుడు సుమన్

image

ప్రముఖ నటుడు సుమన్ బుధవారం బ్రహ్మంగారిమఠం వస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉదయం 9 గంటలకు మఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 10 గంటలకు సిద్దయ్యగారి మఠాన్ని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం 11 గంటలకు బ్రహ్మంగారిమఠం శీలం నరసింహులు గౌడ్ తన నివాసంలో తేనీటి విందులో పాల్గొంటారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.

News April 25, 2024

ఏలూరు జిల్లాలో నామినేషన్ల వివరాలు

image

ఏలూరు ఎంపీ స్థానానికి మంగళవారం 3 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉంగుటూరులో 6 సెట్లు, దెందులూరులో 2 సెట్లు, ఏలూరులో 5 సెట్లు, పోలవరంలో 4 సెట్లు, చింతలపూడిలో 2 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 13 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, ఉంగుటూరులో 11, దెందులూరులో 10, ఏలూరులో 12, పోలవరంలో 10, చింతలపూడిలో 9 నామినేషన్లు వచ్చాయి.

News April 25, 2024

నరేంద్ర వర్మ ఆస్తులు ఎంతంటే.?

image

బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో దంపతుల ఉమ్మడి ఆస్తి రూ.109.47 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వర్మ పేరిట చరాస్తులు రూ.73.72 కోట్లు, స్థిరాస్తులు రూ.22.59 కోట్లు.. అప్పు రూ.25.91 కోట్లు ఉంది. భార్య హరికుమారికి రూ.11.29 కోట్ల చరాస్తులు, రూ.1.87 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఈయనకు సొంత కారు లేదు. 9 పోలీసులు కేసులున్నాయి.

News April 25, 2024

VZM: మొన్న చంద్రబాబు.. నిన్న జగన్.. నేడు పవన్

image

ఉత్తరాంధ్రపై ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫోకస్ పెంచారు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు S.కోట, గజపతినగరం సభల్లో పాల్గొనగా.. నిన్న చెల్లూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేడు నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంటోంది. మరి మీ మద్దతు ఎవరికో కామెంట్ చెయ్యండి..

News April 25, 2024

నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

image

టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు మంగళవారం రాత్రి కలమటను పిలిచి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని కలమటకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కలమట ఆయన అనుచరులతో మాట్లాడి, నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.

News April 25, 2024

నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య 

image

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.