India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గూడూరు మండలంలోని రాయవరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రమేశ్(33) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లి కాలేదని మనోవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యంలో విషం కలుపుకొని తాగాడు. దీంతో అతడిని బందరు ఆస్పత్రి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.
పాలకొండ రిటర్నింగ్ ఆఫీసర్, సీతంపేట ఐటిడిఏ పిఓగా శుభం బన్సాల్ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరి బుధవారం మధ్యాహ్నం 1:00 లోపు జాయినింగ్ రిపోర్టును సమర్పించాలని ఐటిడిఏకు సమాచారం అందింది. ఐటిడిఏ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసిన కల్పనా కుమారిని బదిలీ చేశారు. అనంతరం జేసి శోభికకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.
మార్కాపురంలో మంగళవారం హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. కొనకనమిట్ల మం, గుర్రాలమడుగుకు చెందిన కాశయ్య, కృష్ణ అన్నదమ్ములు. కాశయ్య కుమార్తె వీరమ్మ పుష్పాలంకణ వేడుక బుధవారం జరగనుంది. అందుకు సామగ్రి తెచ్చేందుకు వారు మార్కాపురం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయవరం సమీపంలో కారు వీరిని ఢీకొట్టగా, కాశయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో తండ్రి మృతిని చూసి ఆ చిట్టితల్లి గుండెలవిసేలా రోదించడం అందర్నీ కలచిచేసింది.
మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ భాష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కోళ్ల బైలు పంచాయతీలో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓ అభిమాని షాజహాన్ భాష చిత్రాన్ని తన ఛాతిపై వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.
హిందూపురం నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,46,002 మంది కాగా వీరిలో పురుష ఓటర్లు 1,23,752, మహిళలు 1,22,232, ఇతరులు 18మంది ఉన్నారు. హిందూపురం పట్టణంలో 1,26,488మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 1,19,514 మంది ఉన్నారు. హిందూపురంలో గెలుపునకు పట్టణ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద చిల్లకూరు పోలీసులు మంగళవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో రూ.9.64 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకుండా నెల్లూరు నుంచి తిరుపతి, మదనపల్లె, చిత్తూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆభరణాలను సీజ్ చేసినట్లు గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.
➤ నియోజకవర్గం: దెందులూరు
➤ అభ్యర్థి: చింతమనేని ప్రభాకర్ (TDP)
➤ విద్యార్హతలు: డిగ్రీ
➤ చరాస్తి విలువ: రూ.34,93,887
➤భార్య పేరిట రూ.2,15,17,185
➤ స్థిరాస్తులు: రూ.41,85,19,800
➤ భార్య పేరిట రూ.7,12,89,500
➤ కేసులు: 93
➤ అప్పులు: రూ.77,34,471
➤ భార్య పేరిట రూ.1,04,45,990
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
నెల్లూరులోని జీజీహెచ్ లో ఉదయం 9 గంటల నుంచి ఓపీ సేవలు ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఓపీతో పాటు సర్జరీలు, ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలు పెంచాలన్నారు. జీజీహెచ్ లోని అన్ని విభాగాల అధికారులతో ఆయన ఈ మేరకు సమీక్ష నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.