Andhra Pradesh

News April 5, 2024

శ్రీసత్యసాయి: ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడే మోసిన మాజీమంత్రి

image

సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ భౌతికకాయాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు. రెండు రోజులు క్రితం ప్రొఫెసర్ అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం పుట్టపర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడేను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మోశారు. సత్యసాయిబాబా అనువాదకుడిగా అనిల్ కుమార్ భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

News April 5, 2024

తిరుపతి IITలో ఉద్యోగాలకు నేడు చివరి తేదీ

image

ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టుల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.

News April 5, 2024

ప్రకాశం: బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బైక్‌‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు పట్టణంలోని సినీఫక్కీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరుకు వెళుతున్న కారు అతి వేగంతో ముందు వెళుతున్న బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చిలకలూరిపేటకు చెందిన నల్లజర్ల వేమయ్య (32)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2024

శ్రీకాకుళంలో భానుడి భగ భగ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 5, 2024

కడప MPగా పోటీ చేయడానికి కారణం చెప్పిన షర్మిల

image

కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వైపు YSR బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన వ్యక్తి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. వివేకాను హత్య చేయించిన వారికి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని నేను తట్టులోక పోయాను. హంతకులు చట్టసభల్లో ఉండకూడదు. అందుకే నేను కడప బరిలోకి దిగుతున్నా’ అని బద్వేల్ నియోజకవర్గ ప్రచారంలో షర్మిల అన్నారు.

News April 5, 2024

మద్దికేర రోడ్డు ప్రమాదంలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య

image

మద్దికేర గ్రామ శివారులో ఆదివారం ఆటో టైరు పేలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు మృతిచెందగా.. మద్దికేర గ్రామానికి చెందిన గొడుగు వెంకటేశ్వరమ్మ (55) ఇవాళ ఉదయం మరణించినట్లు భర్త ప్రభాకర్ తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది.

News April 5, 2024

కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఎం-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24, 26, 29, మే 1వ తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 5, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాఠశాలల్లో వార్షిక పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రశ్న పత్రాలు మండల రిసోర్స్ కార్యాలయం నుంచి పాఠశాల సముదాయాలకు.. అక్కడ నుంచి సంబంధిత పాఠశాలకు ఈ ప్రశ్న పత్రాలు వెళతాయని అధికారులు తెలిపారు.

News April 5, 2024

ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలు

image

అనంతపురం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం 08: 47గంటలకు నూతన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. నూతన కలెక్టర్‌కి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు.

News April 5, 2024

మిసెస్ ఇండియా పోటీల్లో ‘గోదారి’ మహిళ సత్తా

image

మిసెస్ ఇండియా పోటీల్లో ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన రుద్రరాజు ఛాయాదేవి సత్తా చాటారు. గత నెల 30న ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ పోటీల్లో మిసెస్ ఇండియా(క్లాసిక్)గా ఎంపికయ్యారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గుండుగొలనులోనే సాగగా.. వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. MBA చదివిన ఛాయాదేవి ప్రస్తుతం శ్రీవిహారి సర్వీసెస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

error: Content is protected !!