India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపాలెంలో గురువారం ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్కోజు హేమంత్ కుమార్ (38) గురువారం మధ్యాహ్నం ఇంటి లోపల గడియ పెట్టుకున్నాడు. రాత్రి అవుతున్నా బయటకు రాకపోవడంతో తల్లి స్థానికుల సాయంతో తలుపు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు. తన మృతికి ఎవరు కారణం కాదని సూసైడ్ లెటర్ రాసి పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సాలూరు వీఆర్వో గోర్జ శ్రీరాములు(57) హార్ట్ఎటాక్తో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. పెదబోరబంద గ్రామానికి చెందిన శ్రీరాములు సాలూరు పట్టణంలో వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆఫీసులోనే గుండె నొప్పి వచ్చింది. స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్లో చేరారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బస్సు యాత్రలో కృపారాణి, ఆమె భర్త కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కాకినాడ రూరల్ ఏర్పాటైంది. కాగా ఈ నియోజకవర్గంలో తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు PRP నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో పిల్లి అనంతలక్ష్మి TDP నుంచి, 2019లో కురసాల కన్నబాబు YCP నుంచి గెలుపొందారు. ఇలా జరిగిన 3 ఎన్నికల్లో 3 వేర్వేరు పార్టీలు గెలుపొందాయి. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
గుంటూరు నగర శివారు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో గుంటూరు నల్లపాడు గ్రామానికి చెందిన కరణం శేషా సాయి (28) మృతి చెందాడు. మరొక ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు తెలిపారు. గుంటూరు నుంచి వంకాయలపాడు స్పైసెస్ పార్కుకు మినీ ట్రావెల్ బస్సులో సిబ్బంది వెళ్తుండగా.. బస్సు అదుపుతప్పి బోల్తా పడ్డట్టు సమాచారం .పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సీఎం జగన్ గురువారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం వరకు ఇక్కడే ఉండనున్న జగన్ ఉమ్మడి నెల్లూరుతో పాటు కందుకూరు కలిపి 11/11 సీట్లలో విజయంపై జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వేమిరెడ్డి దంపతులతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసే స్థానాలే టార్గెట్గా ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే.
అనంతపురం జిల్లా కలెక్టర్గా నియమితులైన వినోద్ కుమార్ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన గౌతమిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు రెవిన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తానని హమీ ఇచ్చారు.
కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు తీసుకొస్తామని వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. యునివర్సిటీ సెనేట్ హాల్లో పరీక్షల నిర్వహణ, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. డిగ్రీ 2, 4,6 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ థియరీ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు.
జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్కి చెందిన తీడ బాబూరావు (65) కాకినాడలోని తన సోదరుడి వద్ద ఉంటున్నాడు. విశాఖలోని వార్డు సచివాలయం(482) పరిధిలో ప్రతి నెలా పింఛను పొందుతున్నాడు. ఈనెల పింఛను కోసం గురువారం కాకినాడ నుంచి విశాఖ వచ్చి, గోపాలపట్నంలోని సచివాలయం వద్దకు వెళ్తున్నాడు. ఇంతలో బీఆర్టీఎస్ రోడ్డులో ఎండ తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పానీపూరీ వ్యాపారిపై దాడి చేసిన యువకుడిపై సింగ్ నగర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గంభీర్ బాలకుమార్ పీ అండ్ టీ కాలనీలో నివసిస్తూ స్థానికంగా పానీపూరీ బండి నడుపుతున్నాడు. బాలకుమార్ గురువారం వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వర్ధన్ అనే యువకుడు తనకు పానీపూరీ కావాలని అడిగాడు. సమయం అయిపోయిందని ఇంటికి వెళుతున్న పానీపూరీ లేదని చెప్పడంతో దాడి చేసి గాయపర్చాడని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.