India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రూ.1.74 కోట్ల నగదు, రూ.59 లక్షల విలువైన మద్యం, రూ.16 లక్షల విలువ చేసే వస్తువులు.. మొత్తం కలిపి రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ను పటిష్ఠంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం పులివెందులలోని జెండా మాను వీధిలో తన భార్యను హత్య చేసిన కేసులో అనుమానితుడిగా కానిస్టేబుల్ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికుల సమాచారం ద్వారా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.
ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు మండలం రామవరం గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల వద్ద 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎటువంటి లైసెన్స్ లేదని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రూరల్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉపసమనం పొందేందుకు పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు కిలో 25 రూపాయలు చొప్పున కాయ సైజును బట్టి రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ప్రజలు అధిక రేట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళుతున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.
ఏప్రిల్ రెండవ తేదీన కడప జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడపలో తెలిపారు. 28వ తేదీ కడపలో పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడగా.. ఏప్రిల్ 2న కడపలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొనడంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.
18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని పరిశీలించి 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఓటేసే అవకాశం లభిస్తుందని, అర్హత ఉన్నవారంతా ఓటు హక్కు పొందడమే కాకుండా, ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.