Andhra Pradesh

News March 31, 2024

తెనాలి వద్ద మృతదేహం కలకలం

image

తెనాలి మండలం సంగం జాగర్లమూడి సమీపంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగం జాగర్లమూడి రోడ్డు పక్కన సుమారు 30 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 31, 2024

శ్రీకాకుళం: నరసన్నపేటలో టోల్ బాదుడు

image

నరసన్నపేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద నేటి నుంచి పెరిగిన టోల్ గేట్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. ప్రతి వాహనంపై రూ.5 వరకు టోల్ ఛార్జీలు పెంపు అర్ధరాత్రి నుంచి అమలోనికి వచ్చాయి. దీంతో ఇచ్ఛాపురం నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే ఇచ్ఛాపురం, పలాస, మడపాం టోల్ గెట్ దాటాల్సి ఉంటుంది. దీంతో పెట్రోల్ ఛార్జీల కంటే టోల్ ఛార్జీలకే భారం ఎక్కువవుతుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.

News March 31, 2024

టీడీపీని వీడే ప్రసక్తే లేదు: మాజీ MLA

image

అనంతపురం అసెంబ్లీ టికెట్ రాలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ మారుతున్నారని వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. అనంతపురంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. సమస్యను అధినేత చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు.

News March 31, 2024

TDPపై అభిమానం.. పెళ్లి కార్డు ఫొటో VIRAL

image

అభిమానాన్ని పెళ్లి కార్డుల రూపంలో చూపుడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ప.గో జిల్లా ఆచంటలో ఓ యువకుడు TDPపై అభిమానాన్ని చాటుకున్నాడు. పెళ్లి కార్డుపై ‘ఓట్ ఫర్ టీడీపీ’ అంటూ ఆచంట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటోలు ముద్రించుకున్నాడు. కార్డు వెనుక వైపు ‘మన ఆచంట- మన పితాని’ అని రాసి ఉన్న ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News March 31, 2024

DAY-2.. శ్రీపాద వల్లభ సంస్థానంలో జనసేనాని

image

కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేనానికి శ్రీ వల్లభ సంస్థానం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు పవన్‌తో పూజలు చేయించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2వ రోజు ప్రచారంలో భాగంగా పవన్ బయలుదేరగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారికి పవన్ అభివాదం చేశారు.

News March 31, 2024

చాట్రాయి: సముద్రంలో కొట్టుకుపోయి యువకుడి మృతి

image

మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన పుల్లారావు(21)అనే యువకుడు శ్రమల దినాలలో జపమాల ఆచరించి యోగేశ్వరం పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు తోటి జపమాల దారులతో కలిసి వెళ్లాడు. అక్కడ పుల్లారావు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుని పోయి మృతిచెందాడు. గమనించిన స్థానికులు వెంటనే అతని మృతదేహాన్ని అదివారం తన గ్రామానికి తరలించారు.   

News March 31, 2024

VZM: కేంద్ర మాజీ మంత్రిని కలిసిన కూటమి అభ్యర్థులు

image

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును కూటమి అభ్యర్థులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి.. ఆయన బంగ్లాలో అశోక్ గజపతిరాజును కలిసి మద్దతు పలకాలని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

News March 31, 2024

కడప: అసంతృప్తి నేతలు పార్టీ గెలుపునకు సహకరించేనా.?

image

ఉమ్మడి కడప జిల్లాలో TDP వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందని, ఆ మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు సీటు దక్కని నేతలు బహిర్గతంగానే పార్టీపై విమర్శలు చేశారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు నాయకులు ఆ కోవలోనే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు వారు ఎంతవరకు సహకరిస్తారో అని చర్చ ఉంది. అయితే ఇప్పటికే అసమ్మతి నేతలకు బుజ్జగింపులు మొదలు పెట్టింది.

News March 31, 2024

వాలంటీర్లను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు: లోకేశ్

image

తాడేపల్లి మండలం కుంచనపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సమావేశమయ్యారు. నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను పటిష్ఠం చేసి, మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని అన్నారు.

News March 31, 2024

విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ రాజకీయ ప్రస్థానం ఇదే 

image

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

error: Content is protected !!