India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెళ్లుగడ్డలో మంగళవారం బొంతు మణికుమారి (30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూంలో మాటువేసిన ఆగంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. హత్య సమయంలో డోరు లోపల గడియ వేసిఉందని, కిటికీ లోంచి ఆమె తోడికోడలు, కుమారుడు చూసి కేకలు వేశారు. ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
విశాఖలో <<13107489>>అంబులెన్స్ ఢీకొని<<>> మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన రామకృష్ణ, విజయవాడకు చెందిన చందు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. రామకృష్ణ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో అనాథల పెరిగాడు. చందు తల్లి నిరుపేద కావడంతో ఛార్జీలకు పోలీసులు కొంత నగదు ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు కేజీహెచ్ ఆస్పత్రిలో భద్రపరిచారు.
విశాఖలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విజయవాడకు చెందిన చందు(20) అతడి స్నేహితుడు రామకృష్ణ (19) సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖలో వీరు బైక్ పై వెళుతుండగా.. 108 అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలిలోనే కన్నుమూశారు. కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు సైతం దారి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో, విశాఖ పోలీసులు చందు తల్లికి డబ్బు పంపి విశాఖకు రప్పించినట్లు సమాచారం.
➤ కుప్పం అభ్యర్థి: KRJ భరత్ (YCP)
➤ చరాస్తి: రూ.98.47 లక్షలు
➤ స్థిరాస్తి: రూ.30 లక్షలు
➤ భార్య దుర్గ చరాస్తి: రూ.41.88 లక్షలు
➤ ఇద్దరు పిల్లల పేరిట ఆస్తి: రూ.32.78 లక్షలు
➤ అప్పులు: రూ.11.60 లక్షలు
➤ బంగారం: 950 గ్రాములు
➤ కేసులు: ఒకటి
➤ వాహనాలు: ఒకే కారు
NOTE: తనకు హైదరాబాద్కు సమీపంలో ఓ విల్లా తప్ప ఎలాంటి స్థలాలు, బిల్డింగ్లు లేవని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి ఈరోజు విశాఖపట్నం జిల్లా ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. మొన్న విశాఖ జిల్లాలో ప్రవేశించిన బస్సు యాత్ర నిన్నటి విరామంతో ఎండాడ వద్ద ఆగిపోయింది. నేడు అక్కడి నుంచి ముఖ్యమంత్రి తన యాత్రను ప్రారంభించి విజయనగరం జిల్లాకు చేరుకున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో విజయనగరం ఆర్టీసీ డిపోలోని కొన్ని బస్సులను ఆ సభకు తరలించారు. దీంతో కాంప్లెక్స్కి వచ్చిన ప్రయాణికులు వెనుతిరుగుతున్నారు. కనీసం ప్రయాణికుల కోసం కొన్ని బస్సులనైనా ఉంచకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు, పక్క జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని.. అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలి’అని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం హిందూపురం తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. హిందూపురం శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన B.ED ( బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విధివిధానాలు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు.
Sorry, no posts matched your criteria.