Andhra Pradesh

News April 24, 2024

గొట్టిపాడు వాగు వద్ద మహిళ మృతదేహం కలకలం

image

చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు వాగు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, మహిళ వయసు 30 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ మహిళను ఎవరైనా గుర్తిస్తే చిలకలూరిపేట రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

News April 24, 2024

చిత్తూరు: సీపీఎఫ్ కంపెనీ సమీపంలో మృతదేహం కలకలం

image

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని సీపీఎఫ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే గుడిపాల పోలీసులను సంప్రదించాన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

ఆమంచి ఇంటికి చేరుకున్న షర్మిల

image

ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి షర్మిల చేరుకున్నారు. ఆమంచి నామినేషన్ కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు. మరికాసేపట్లో పందిళ్లపల్లి నుంచి వేటపాలెం మీదుగా చీరాలకు ర్యాలీగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చీరాల గడియారస్తంభం కూడలిలో సభలో షర్మిల ప్రసంగించనున్నారు.

News April 24, 2024

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్

image

నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి హరినారాయణ్‌కు నామినేషన్ అందించారు. విజయసాయిరెడ్డి వెంట రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.

News April 24, 2024

విజయబాబుకు సోమిరెడ్డి నివాళి

image

దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయబాబు మరణం బాధాకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వారి నివాసంలో విజయబాబు భౌతిక కాయానికి సోమిరెడ్డి నివాళులర్పించారు. ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డితో పాటు కుటుంబసభ్యులను సోమిరెడ్డి పరామర్శించారు.

News April 24, 2024

నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు: సుంకర పద్మశ్రీ

image

తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని సుంకర పద్మశ్రీ ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని, అధిష్ఠానం అవకాశం కల్పించలేకపోయిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నిర్ణయాన్ని అధిష్ఠానం మన్నిస్తుందని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు అభ్యర్థిగా పద్మశ్రీని నిన్న కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 24, 2024

ప్రకాశం: పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266

image

జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.

News April 24, 2024

కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు

image

రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హత :MA,
కేసులు :15,
చరాస్తులు: రూ.10.33 లక్షలు,
బంగారం: 90 గ్రాములు,
స్థిరాస్తులు: రూ. 5.45 కోట్లు,
అప్పులు: 1.02 కోట్లు ఉన్నట్లు నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.

News April 24, 2024

సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తి వివరాలు

image

ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దంపతుల ఆస్తి మెుత్తం రూ.13.77 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తి: రూ.1.85కోట్లు, స్థిరాస్తి:రూ.4.22కోట్లు, అప్పులు:రూ.1.22కోట్లు, నగదు:10.30లక్షలు ఉన్నాయి. అంతేగాక 25 తులాల బంగారం, రూ.3లక్షల విలువగల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఆయనకు వాహనం లేనట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

నారా లోకేశ్‌పై 23 కేసులు

image

➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: నారా లోకేశ్(TDP)
➤ భార్య: నారా బ్రాహ్మణి
➤ విద్యార్హతలు: MBA
➤ చరాస్తి విలువ: రూ.341.68కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.45.06కోట్లు
➤ కేసులు: 23
➤ అప్పులు: రూ.3.48కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.16,600
➤ బంగారం: లేదు, భార్యకు 2500.338గ్రాములు బంగారం, 97.441కేజీల సిల్వర్.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.