India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ప్రకటించిన వైసీపీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముందుగా ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు వాణితో సంప్రదింపులు జరిపారు. దీంతో నామినేషన్ వేసే నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మంతెన రామరాజు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జాతర ముందు నిర్వహించే వారాలలో రెండో మంగళవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మొక్కు జొన్నతో అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అంతేకాకుండా పౌర్ణమి సందర్భంగా చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
ధర్మవరం మండలం కుణుతూరు గ్రామానికి చెందిన S.దీక్షిత పోతుకుంటలో గల పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్లో 100కి 100 మార్కులు సాధించారు. దీక్షిత తండ్రి నరసింహులు పెయింటర్గా పనిచేస్తున్నారు. ఈ విద్యార్థిని ప్రతిభ పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్కు కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. 2019 జనవరి 22న గండేపల్లి గ్రామ శివారులో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా.. స్కూటీ చోదకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దాపురం కోర్టు మెజిస్ట్రేట్ జి.హర్షవర్ధన్ తీర్పు వెల్లడించారు.
➤ అభ్యర్థి: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమె పేరిట 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్లో పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యకర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరి కండువా కప్పుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్ చర్చలు ఫలించినట్లు సమాచారం. కాకర్ల సురేశ్ సోదరుడు సునీల్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరోసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని తాను అరెస్ట్ చేశానని 12 ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డి అంటున్నారని.. ఇప్పటి వరకు ఆయన కోమాలో ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ అరెస్ట్కు తనకేంటి సంబంధమన్నారు.
➤ అభ్యర్థి పేరు: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమెకు 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్ లో పేర్కొన్నారు.
నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.డీ ఖలీల్ అహ్మద్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 22.18 లక్షలు ఉన్నట్లు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఖలీల్ పేరుపై రూ.16.25 లక్షలు, ఆయన సతీమణి పేరుపై రూ. 4.26 లక్షలు, కుమారుడి పేరున రూ. 1.67 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపించారు. అప్పులు, కేసులు లేవు.
Sorry, no posts matched your criteria.