Andhra Pradesh

News March 30, 2024

ఏప్రిల్ 20న పెళ్లి..ఇంతలోనే వాలంటీర్ మృతి

image

త్వరలో పెళ్లి కావాల్సిన వాలంటీర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన రేగడి మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కోయకొండ గ్రామానికి చెందిన షణ్ముఖరావ్ గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 20 వివాహం ఖాయమైంది. పెళ్లి పత్రికల పంపిణీ కోసం ఇద్దరు స్నేహితులతో బంధువుల ఇంటికి బయలుదేరాడు. కె. అగ్రహారం సీమపంలో లారీని తప్పించబోయి ఆటోను డీ కొట్టడంతో షణ్ముఖరావ్ మృతి చెందాడు.

News March 30, 2024

కడప TDP నేతలపై కేసు నమోదు

image

కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద TDP ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడంపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించకుండా, అనుమతి లేకుండా TDP నేతలు కేక్ కట్ చేశారని సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా TDP జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీ TDP అభ్యర్థి మాధవరెడ్డి, హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నారు.

News March 30, 2024

విశాఖలో యువతి సూసైడ్..

image

విశాఖ మధురవాడలో శుక్రవారం యువతి(17) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొమ్మాదిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్లోని 4వ అంతస్తు నుంచి దూకేసింది. కాలేజీ ఫ్యాకల్టీ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆత్మహత్యకు ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసినట్లు సమాచారం. మృతురాలి తండ్రి నాతవరం మండలానికి చెందిన వ్యవసాయం కూలీ. యువతి ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

News March 30, 2024

ఇంకా టైం ఉంది.. ఏమైనా జరగొచ్చు: ఎంపీ RRR

image

చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.

News March 30, 2024

ఇంకా టైం ఉంది.. ఏమైనా జరగొచ్చు: ఎంపీ RRR

image

చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.

News March 30, 2024

నాడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి.. నేడు TDP MLA అభ్యర్థి

image

జగన్ కేబినెట్‌లో మొన్నటి వరకు ఉన్న గుమ్మనూరు జయరాం, YCPని వీడిన విషయం తెలిసిందే. TDPలో చేరిన ఆయనకు నిన్న చంద్రబాబు గుంతకల్లు టికెట్ కేటాయించారు. YCPలో ఆయనకు కర్నూలు MP టికెట్ ఇచ్చినా వద్దనుకొని ఆలూరు టికెట్ కోసం ప్రయత్నించారు. ఆపై ఆ పార్టీనే వీడారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు టికెట్‌ను టీడీపీ వీరభద్ర గౌడ్‌కు ఇచ్చింది. ఈయన పక్క నియోజకవర్గం గుంతకల్లు నుంచి బరిలో దిగుతున్నారు.

News March 30, 2024

గూడూరు: విద్యార్థిపై కత్తితో దాడి

image

సైదాపురం మండలం లింగసముద్రానికి చెందిన ప్రేమ్ కుమార్ చెన్నూరు రెసిడెన్షియల్ స్కూలులో చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి స్కూలులో వార్షికోత్సవం సందర్భంగా వాహనం పార్కింగ్ విషయంలో స్థానిక యువకుడు విష్ణుకి ఇంటర్ చదివే ప్రేమ్ కుమార్ అన్న అశోక్ తో వాగ్వాదం జరిగింది. విష్ణు కత్తితో దాడి చేయడంతో అశోక్ గాయపడ్డాడు. ఈ మేరకు ఎస్సై మనోజ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2024

కార్వేటినగరం: 9 మంది జూదరుల అరెస్టు

image

కార్వేటినగరం మండలంలోని భట్టువారిపల్లిలో జూదం ఆడుతున్న 9మంది నిందితులను అరెస్ట్ చేశామని, వీరిలో తిరుపతి నగరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఉన్నాడని సీఐ సత్యబాబు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పుత్తూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో శిక్షణ డీఎస్పీ పావన్ కుమార్, ఎస్సై వెంకటకృష్ణ, ఏఎస్సై మునికృష్ణ పాల్గొన్నారు.

News March 30, 2024

గొట్టిపాటి V/s బూచేపల్లి

image

దర్శి రాజకీయ చర్చకు ఎట్టకేలకు తెరలేసింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోటీగా గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించగానే అభ్యర్థుల పోటీ ఖరారు అయింది. వీరిరువురి నేపథ్యం గమనిస్తే.. ఇరు కుటుంబాలు రాజకీయ వారసత్వం నుంచి వచ్చినవారే, ఇద్దరు డాక్టర్లే కావడం గమనార్హం. గొట్టిపాటి కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలకపాత్ర పోషించారు. ఇటు తండ్రి సుబ్బారెడ్డి వారసుడిగా శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు.

News March 30, 2024

వైసీపీ నుంచి సిద్ధం.. జనసేన నుంచి ఎవరు.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం MP, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అభ్యర్థులను పవన్ ప్రకటించలేదు. దీంతో ఇక్కడ పోటీ విషయమై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపు YCP నుంచి సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి రమేశ్ బాబు ఎన్నికలకు సిద్ధమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా జనసేన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.

error: Content is protected !!