India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు సమీపంలో అమరావతి హోటల్ వద్ద జాతీయ రహదారిపై బస్సు, కారు, మరో వాహనం ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.
చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
పుట్టపర్తి మండలలో శుక్రవారం వింత గొర్రె పిల్ల పుట్టింది. మండల పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూర్తికి చెందిన ఓ గొర్రె ఎనిమిది కాళ్లు, రెండు తలలతో కూడిన గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. కాగా కొద్ది సేపటికే గొర్రె పిల్ల మృతి చెందినట్లు గొర్రెల కాపారి తెలియజేశారు.
విశాఖపట్నం సాగర్ నగర్ సముద్ర తీరంలో మత్స్యకారులకు సముద్ర కప్పలుగా పిలవబడే విభిన్న చేపలు లభించాయి. తిరిగారు ఈ తరహా జీవులను పవర్ ఫిష్ గా పిలుస్తారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. సముద్రపు అట్టడుగు లోతుల్లో సంచరించే ఈ జీవులు దాడికి గురైన సమయంలో ఇలా బెలూన్ రూపంలో ఆకృతిని మార్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ చేపలను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు.
చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వేంపాడు-పెద్ద రావిపాడులో జరిగింది. వేంపాడుకు చెందిన గోపనబోయిన రామారావు(40) తన మిర్చి పొలంలోని కూలీలకు టిఫిన్ తీసుకుని బైకుపై ముండ్లమూరు నుంచి వస్తున్నారు. అదే సమయంలో రావిపాడుకు చెందిన ఉలవ మల్లికార్జున తన బైకుపై వస్తూ మలుపు వద్ద ఇరువురు ఢీకొన్నారు. రామారావు చనిపోగా, మల్లికార్జున గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.
మదనపల్లికి ఏప్రిల్ 2న సీఎం జగన్ రానున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి ‘మేము సిద్ధం ‘బహిరంగ సభకోసం టిప్పు సుల్తాన్ మైదానం శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ మహమ్మద్, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, షమీం అస్లాం తదితరులు ఉన్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1,884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1,300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గానూ 6 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మహిళా MLAలుగా గెలిచిన వారే లేరు. అవే.. నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు, తణుకు, ఏలూరు, భీమవరం. మిగతా 9 చోట్ల వేర్వేరు ఎన్నికల్లో అతివలు సత్తా చాటి పరిపాలన చేశారు. అయితే.. ఈసారి పోలవరం వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి దక్కింది. ఆమె ఈ పోరులో గెలిచి పోలవరం చరిత్రలో నిలిచేనా చూడాలి.
Sorry, no posts matched your criteria.