Andhra Pradesh

News August 21, 2024

కాళంగి నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

సూళ్లూరుపేటలోని మహాదేవయ్య నగర్ వెనకవైపు ఉన్న కాళంగి నదిలో బుధవారం ఓ గుర్తుతెలియని మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో గురవారం మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News August 21, 2024

అచ్యుతాపురం: కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

image

అచ్యుతాపురం సెజ్ ఘటనలో గాయపడిన వారిని అనకాపల్లికి సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడిన వారిని బస్సులో తరలిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం కాలిన శరీర భాగాలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వారి ఫొటోలు కంటితడి పెట్టిస్తున్నాయి.

News August 21, 2024

పోరుమామిళ్ల: కారు, స్కూటర్ ఢీ.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

పోరుమామిళ్ల మల్ల కత్తువ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుల స్వగ్రామం కలసపాడు మండలం తంబళ్లపల్లె గ్రామంగా స్థానికులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారిలో సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు.

News August 21, 2024

అచ్యుతాపురం: ఉలిక్కిపడిన సమీప గ్రామాలు

image

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెజ్ లోని అగ్నిమాపక యంత్రంతో పాటు 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. రియాక్టర్ పేలుడు ధాటికి మొదటి అంతస్తు శ్లాబు కూలిపోగా, శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16మంది కార్మికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

News August 21, 2024

రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి

image

రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు.

News August 21, 2024

7 మండలాల్లో 4,405 హెక్టార్లలో పంట నష్టం: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కురిసిన నేపథ్యంలో 7 మండలాల్లో 4,405 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే అధికారులు పర్యటించి ప్రాథమిక నివేదికను పంపాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురవడంతో కొన్ని మండలాలలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, రాత్రి హంద్రీ నదిలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు.

News August 21, 2024

నెల్లూరులో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లా కొమురోలు గ్రామానికి చెందిన షేక్ జలీల్ (60) నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మణికంఠ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News August 21, 2024

రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి

image

రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు. 

News August 21, 2024

అయ్యో పాపం.. శిథిలాల కింద కార్మికుల మృతదేహాలు

image

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు శిథిలాల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ప్రాథమిక సమాచారం మేరకు రియాక్టర్ పేలడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఊపిరాడక కొంతమంది శిథిలాల మధ్యలో మరి కొంతమంది చిక్కుకొని మృత్యువాత పడ్డారు. సుమారు 14 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు వివరాలు పూర్తిగా వెల్లడించాల్సి ఉంది.

News August 21, 2024

కంప్యూటరైజేషన్ ప్రక్రియను 100% పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను 100% సెప్టెంబర్ మూడో తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓలతో ఫాక్స్ కంప్యూటరైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల సభ్యత్వానికి సంబంధించి 21 శాతం మాత్రమే ఆన్లైన్ చేశారనిని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు.