Andhra Pradesh

News September 6, 2024

పెనుకొండలో ఘోర ప్రమాదం.. వృద్ధుడి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వైశాలి హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

News September 6, 2024

ఘోరం: బైకు-ట్రాక్టర్ ఢీ.. తెగిపడిన యువకుడి చేయి

image

తూ.గో జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి శరీరం నుంచి చేయి తెగిపోయి దూరంగా పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

శ్రీకాకుళం: బాడీలోషన్ తాగి వివాహిత సూసైడ్

image

మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చాపురంలోని ధర్మపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగాల సుజాత(25) భర్త నూకయ్యతో 3 రోజుల కింద గొడవ పడింది. కోపంలో విదేశాల నుంచి తెచ్చిన బాడీ లోషన్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త విదేశాలలో వలస కూలీగా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

93 పరిశ్రమల యూనిట్లకు రూ.8.43 కోట్ల సబ్సిడీ మంజూరు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ జీ.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 93 పరిశ్రమల యూనిట్లకు రూ.8.43 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేశారు.

News September 6, 2024

తిరుపతి: సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ కమ్యూనికేటివ్ అండ్ ఫంక్షనల్ సాన్‌స్క్రిట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ సితార్, సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ ట్రాన్స్లేషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రోజూ 2 గంటల పాటు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు nsktuadmission.samarth.edu.inలో రిజిస్టర్ చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 06.

News September 6, 2024

విశాఖలో డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన మంత్రి

image

విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ శ్రీభరత్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ తరహా సేవలు ఇప్పటికే వారణాసి, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 6, 2024

నందికొట్కూరులో మహిళ దారుణ హత్య

image

నందికొట్కూరులోని మారుతీ నగర్‌కు చెందిన శాలు బీ(45) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామాంజీ నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు..

image

ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో నమోదయిన విషయం తెలిసిందే. అయితే 120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1903 అక్టోబర్ 7న 10.68లక్షల క్యూసెక్కులు, 1914 ఆగస్టు11న 9.49, 1917 నవంబర్ 2న 9.55, 1949 సెప్టెంబర్ 24న 9.25, 1964 అక్టోబర్ 2న 9.88, 1998 అక్టోబర్ 17న 9.32, 2009 అక్టోబర్ 5, 6న 10.94, 2024 సెప్టెంబరులో 11.38లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వచ్చింది.

News September 6, 2024

రాజమండ్రిలో యాక్సిడెంట్.. శ్రీకాకుళం వాసి మృతి

image

రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్(20) మృతి చెందారు. రాజమండ్రి దివాన్ చెరువు వైపుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండీయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 6, 2024

రాజమండ్రిలో యాక్సిడెంట్.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి

image

రాజమండ్రిలోని దివాన్ చెరువు వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన కార్తీక్ (19)గా గుర్తించారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.