India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

త్రిపురాంతకం మండలం మేడపిలోని యూనియన్ బ్యాంక్లో ఈ నెల 1వ తేదీన చోరీ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు ముద్దాయిలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ ఎస్. సుబ్బారావు వివరాలను వెల్లడించారు. మహిళ, యువకుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించిన ఎస్సై సాంబశివరావు సిబ్బందిని అభినందించారు. జల్సాలకు అలవాటు పడి ఇలా దొంగతనాలు చేయడం నేరమని అలాంటి అలవాట్లు మానుకోవాలని యువతకు సూచించారు.

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు సంబంధించిన 28 మంది సీఐలకు స్థానచలనం కల్పిస్తూ కాసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో డీఐజీ పేర్కొన్నారు.

హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ నావేల్ కమాండ్ ఆధ్వర్యంలో నౌకాదళ సిబ్బంది అత్యంత సాహసంతో డైవింగ్ చేస్తూ నీటి లోపల జాతీయ జెండాను ఎగరవేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు. దాని స్ఫూర్తితో ఈ సాహస కార్యక్రమాన్ని నిర్వహించామని X (ట్విటర్)లో పోస్ట్ చేశారు.

టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో శుక్రవారం జరిగిన వేలంలో 913 పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారని వేలం నిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఆలకూరపాడు, అనంతవరం, రావివారిపాలెం, జయవరం, పాలేటిపాడుకు చెందిన రైతులు 980 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 913 కొనుగోలు చేశారు. 67 బేళ్లు తిరస్కరించారు. గరిష్ఠ ధర రూ.358 కాగా, కనిష్ఠ ధర రూ.205, సరాసరి ధర రూ.305.30 ధర పలికిందన్నారు.

విజయనగరం సమీపంలోని రాళ్లమళ్లపురం గ్రామం పరిధిలోని రైల్వే ట్రాక్పై శుక్రవారం కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీశ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. జగదీశ్ విశాఖపట్నంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు. విజయనగరం ఎందుకు రావాల్సి వచ్చిందని, హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

పాచిపెంట మండలం రాయిమానుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సారాయివలస ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా మహేశ్, ఆర్తీ పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్పై వస్తుండగా మార్గ మధ్యలో గడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో నదిలో కొట్టుకుపోయారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా, మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాకినాడ జిల్లా సామర్లకోట ఏడీబీ రహదారిలో స్కూటీపై వెళుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన మహిళ చికిత్స పొందుతూ సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మృతి చెందింది. సదరు మహిళ సామర్లకోట మండలంలోని ఉండూరు గ్రామానికి చెందిన ANM నాగ సత్యవేణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గుంటూరు జిల్లా పెదకాకానిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లోదర్ గిరి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వారిపై గోడ పడింది. ఈ ప్రమాదంలో కోలాటపు సాత్విక్ (12), బంగారపు సిద్ధార్థ్ (13) మృతి చెందారు. ఒక పిల్లోడు అక్కడికక్కడే చనిపోగా, మరో పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు

ఐదేళ్ల లక్ష్యాలతో జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుని, లక్ష్యాల సాధనకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఐదేళ్ల విజన్ ప్లాన్ రూపకల్పనపై జిల్లా అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరుగనుంది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మసీదు రోడ్డుకు చెందిన నోయల్ జార్జ్ను హత్య చేసిన కేసులో నిందితులు ప్రసాద్, ప్రశాంతి, ప్రేమ్ కుమార్ను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాజోలు CI గోవిందరాజు, మలికిపురం SI సురేష్ తెలిపారు. గుడిమెల్లంకకు చెందిన ప్రశాంతి నోయల్ జార్జ్తో సహజీవనం చేసేది. జార్జ్ మందు, సిగరెట్, గంజాయికి బానిసై, ప్రశాంతిని కూడా తాగమని వేధించడంతో పథకం ప్రకారం అతడిని హత్య చేసినట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.