Andhra Pradesh

News August 21, 2024

శ్రీకాకుళం: APEAP CET ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

ఏపీఈఏపీ సెట్-2024 చివరి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వేరిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. ర్యాంకు వచ్చి కౌన్సెలింగ్ హాజరు కాని విద్యార్థులు, బ్రాంచ్ మార్చుకుని అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

News August 21, 2024

గుంటూరు: భారత్ బంద్.. పరీక్షల తేదీల్లో మార్పులు

image

దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో బుధవారం జరిగే పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 27కి, బీటెక్ మొదటి, 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, బీటెక్ 2వ ఏడాది ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు.

News August 21, 2024

నెల్లూరు: ఈ నెల 25న చెస్ జట్ల ఎంపికలు

image

జిల్లా స్థాయి అండర్ – 9 ఓపెన్, బాలికల చెస్ పోటీలను ఈనెల 25న నిర్వహించి జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నామని చెస్ అసోసియేషన్ నెల్లూరు కార్యదర్శి మస్తాన్ బాబు తెలిపారు. రాయ్ చెస్ అకాడమీలో నిర్వహించనున్న పోటీలకు ఆసక్తి గలవారు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు.

News August 21, 2024

కర్నూల్.. మరణంలోనూ వీడని బంధం

image

బండి ఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న చిన్న తిరుపాలు (75) ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో భార్య అక్కమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సాయంత్రం తిరుపాలును అంత్యక్రియల నిమిత్తం తీసుకెళ్తుండగా భార్య అక్కమ్మ(69) గుండెపోటుకు గురై మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

News August 21, 2024

మరికాసేపట్లో MLCగా బొత్స ప్రమాణ స్వీకారం

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని శాసనమండలిలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. బొత్స చేత శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటి అవుతారు.

News August 21, 2024

నెల్లూరు: ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

image

విద్యార్థులకు సరిగా బోధించకపోవడం, తదితర కారణాలతో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖధికారి పి.విజయ రామారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఆర్వి ప్రసన్నలక్ష్మి, తెలుగు పండిట్ ఎల్ శ్రీనివాసరావుపై ఆ పాఠశాల విద్యార్థులు ఇటీవల కలెక్టర్ ఆనందుకు ఫిర్యాదు చేశారు. సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

News August 21, 2024

పోలాకి: చెరువులో పడి యువకుడి గల్లంతు

image

పోలాకి మండలం వెదుళ్లవలసకు చెందిన అమలాపురం దుర్గారావు (24) అనే యువకుడు చెరువులో పడి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం స్థానిక కర్ణాల చెరువులో స్నానానికి వెళ్లిన సమయంలో చెరువులో గొయ్యి వద్ద దిగి తిరిగి రాలేదు. సమాచారం అందుకున్న తహశీల్దార్ సురేష్ కుమార్ గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News August 21, 2024

తుని RTCకి రికార్డ్ స్థాయిలో ఆదాయం

image

తుని RTC డిపో ఒక్కరోజులో రూ.13.86 లక్షలు ఆదాయంతో 105% ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో ఆక్యూపెన్సి రేషియోలో మొదటి స్థానంలో నిలిచింది. వరుస సెలవులు, శ్రావణం, రాఖీ పౌర్ణమి, వివాహముహూర్తాలతో సోమవారం బస్సులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. తుని డిపో నుంచి నిత్యం 72 బస్సులను కాకినాడ, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు నడుపుతారు. రద్దీదృష్ట్యా నిన్న మరో 6 బస్సులు అదనంగా తిప్పారు.

News August 21, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి 2.92 లక్షల క్యూసెక్కుల నీరు

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 2.92లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 10.90 అడుగుల నీటిమట్టం ఉందని చెప్పారు.

News August 21, 2024

కడప: నూతన ఓటు హక్కు చేర్చుకునే అవకాశం

image

కడప జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, కొత్తగా ఓటు హక్కును చేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. 1.1.25 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు ఓటర్ లిస్ట్ నందు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని సూచించారు. అలానే ఓటు కార్డు నందు సవరణలు ఏవైనా ఉన్నయెడల సవరించుకోవచ్చని స్థానిక ఎమ్మార్వో, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలన్నారు.