India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామ రెడ్డి, పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి (విజయ్ బాబు) చనిపోయారు. నెల్లూరులోని అపోలోలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయ్ రెడ్డికి బాబాయి అవుతారు.
➤ పలాస: YCP అప్పలరాజు
➤ ఇచ్ఛాపురం: స్వతంత్రంగా లక్ష్మీ
➤ టెక్కలి: TDP అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం: TDP శంకర్, INCP కృష్ణారావు,
➤ ఆమదాలవలస: YCP సీతారాం, INCP అన్నాజీ రావు, BSP సోమేశ్వరరావు, స్వతంత్రంగా సురేశ్
➤ పాతపట్నం: YCP రెడ్డి శాంతి, కూటమి మామిడి గోవిందరావు
➤ ఎచ్చెర్ల: PPI నీలాచలం, JBNP కొర్లయ్య, INCP మల్లేశ్వరరావు,
➤ నరసన్నపేట: YCP కృష్ణదాస్, NCP కామేశ్వరి, INCP నరసింహ మూర్తి.
ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి రామాలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం దగ్గరకు తీసుకెళ్లారు. తెలుగుదనం ఉట్టిపడేలా సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కళ్యాణ మండపం కిటకిటలాడింది.
మహానంది మండలం తమ్మడపల్లె గ్రామం వద్ద ఈలలు, కేకలు వేస్తూ ప్రజా శాంతికి భంగం కలిగించిన ముగ్గురిపై ఈ నెల 17న మహానంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బొల్లవరం గ్రామానికి చెందిన గుండా మధు, పలుకూరు జమాన్ మధు, తమ్మడపల్లె అశోక్ లను ముగ్గురిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఒక్కొక్కరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.
టెన్త్ ఫలితాల్లో చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని స్టేట్ మూడవ ర్యాంక్ సాధించింది. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన కనుపర్తి భావజ్ఞ సాయి 600కు 597 మార్కులు తెచ్చుకొని స్టేట్ మూడో ర్యాంక్ సాధించింది. నల్లబోతుల దివ్యశ్రీ 583 మార్కులు, మహమ్మద్ సబిహా బేగం 582 మార్కులు సాధించారు.
TDP నెల్లూరు సీటీ అభ్యర్థి నారాయణ 77 పేజీలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన స్థలాల వివరాలకే దాదాపు 50 పేజీలు ఉపయోగించారు. ఆయన దగ్గర బంగారం లేకపోయినా భార్య దగ్గర రూ.22.76 కోట్ల విలువైన 35.929 కేజీల బంగారం ఉందని ప్రకటించారు. తన అప్పులు రూ.62.43 కోట్లు, భార్య పేరిట రూ.127.16 కోట్లు ఉన్నట్లు చూపారు. తనపై CID, పేపర్ లీకేజీతో పాటు నారాయణ విద్యా సంస్థలో విద్యార్థి సూసైడ్ కేసు ఉందని పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా టాపర్గా పార్వతీపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిలిచింది. 591 మార్కులతో పార్వతిపురం టిఆర్ఎస్ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని కేబి గౌతమి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విద్యాశాఖలో అమలు చేసిన విప్లవాత్మక మార్పులు కారణంగా కార్పొరేట్ పాఠశాలలకు గట్టి పోటీని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లాలోని పీసీపల్లి మండలం ఇర్లపాడులో మిరపకాయలు కోసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో వెంగళాయపల్లిలోకి వచ్చేసరికి హఠాత్తుగా కుక్క రోడ్డుపైకి అడ్డంగా రావడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరత్తమ్మ, గోవిందమ్మ, ఐ.జయమ్మ, సంపూర్ణ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను పీసీపల్లి వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స చేశారు. ఆనంతరం మెరుగైన చికిత్స కోసం 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.
పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలోకి వెళ్తే.. కోటబొమ్మాళి మండలం విశ్వనాథపురం పంచాయతీ సీతారాంపురానికి చెందిన వజ్రగడ్డి జానకి(16) పదిలో బక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో ఫ్యాన్కు ఉరేసుకుంది. తల్లి సరోజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్థానిక ఏస్ఐ షేక్మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.